
( ఫైల్ ఫోటో )
సాక్షి, తాడేపల్లి: స్వాతంత్ర్య సమరయోధులు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ శుభాష్ చంద్రబోస్ 127వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఘన నివాళులు ఆర్పించారు. నేతాజీ దేశ సేవను, ధైర్య సాహసాలను సీఎం జగన్ ప్రశంసించారు.
స్వతంత్ర భారతావనే లక్ష్యంగా పోరాడి, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. యువతలో స్ఫూర్తిని నింపి వారిని స్వతంత్ర పోరాటంలో భాగస్వాములను చేశారని అన్నారు. .నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా స్పందించారు.
చదవండి: CM Jagan: వైఎస్సార్ ఆసరా కార్యక్రమం ప్రారంభం
స్వతంత్ర భారతావనే లక్ష్యంగా పోరాడి, దేశం కోసం ప్రాణత్యాగం చేశారు నేతాజీ సుభాష్ చంద్రబోస్. యువతలో స్ఫూర్తిని నింపి వారిని స్వతంత్ర పోరాటంలో భాగస్వాములను చేశారు. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/Qoztfg3awD— YS Jagan Mohan Reddy (@ysjagan) January 23, 2024