నకిలీ మద్యంపై సీఎం సరికొత్త డ్రామా | Chandrababu New Drama on Fake Liquor | Sakshi
Sakshi News home page

నకిలీ మద్యంపై సీఎం సరికొత్త డ్రామా

Oct 6 2025 3:48 AM | Updated on Oct 8 2025 10:40 AM

Chandrababu New Drama on Fake Liquor

సాక్షి, అమరావతి : అన్నమయ్య జిల్లాలో బయట పడిన నకిలీ మద్యం రాకెట్‌లో టీడీపీ కీలక నేతల ప్రమేయం బట్టబయలు కావడంతో సీఎం చంద్రబాబు సరికొత్త డ్రామాకు తెర లే­పారు. ఈ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించి, పా­ర్టీకి సంబంధం లేని వారిని బాధ్యులను చేయాలని చూసినా.. అది బెడిసి కొట్టింది. దీంతో టీడీపీ తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దాసరిపల్లి జయ­చంద్రారెడ్డి, టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడు­ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. తద్వారా ఈ వ్య­వహారంతో తమకు సంబంధం లేదని, కింది స్థా­యిలో ఏదో జరిగిందని ప్రజల దృష్టి మళ్లించేలా కొ­త్త కుతంత్రం రచించారు.

‘కల్తీ మద్యం ఆ­రోప­ణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చంద్రబాబు ఆదేశాల మేరకు వారిద్దరిని సస్పెండ్‌ చేస్తున్నాం’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదివారం ప్రకటన విడుదల చేశా­రు.  భారీ యంత్రాలతో వివిధ బ్రాండ్లను పోలిన నకిలీ మద్యాన్ని ఈ యూనిట్లో తయారు చేస్తూ ‘కీలక’ నేత అండతో వారు ఉమ్మడి చిత్తూరు, అనంతపురం తదితర జిల్లాలకు గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ రాకెట్‌ బయట పడటంతో అమరావతి పెద్దలు తమకేమీ సంబంధం లేనట్లు.. స్థానిక నాయకులే కారణమంటూ డ్రామాలకు పూనుకోవడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement