
ఒకేసారి రూ.7,000 కోట్ల అప్పునకు ఇండెంట్
3వ తేదీన ఆర్బీఐ సెక్యూరిటీల వేలం ద్వారా సమీకరణ
కొత్త ఆర్థిక ఏడాది రెండు నెలల్లోనే రూ.19,572 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: వచ్చే మంగళవారం చంద్రబాబు సర్కారు మళ్లీ అప్పు చేస్తోంది. జూన్ 3న ఒకేసారి రూ.7,000 కోట్ల అప్పునకు ఇండెంట్ పెట్టింది. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తం అప్పును ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించనుంది.
తొమ్మిదేళ్ల కాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 11 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,500 కోట్లు, 12 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,500 కోట్లు, 13 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,500 కోట్లు, 14 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,500 కోట్ల అప్పు చేయనుంది. దీంతో కొత్త ఆరి్థక ఏడాది రెండు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం రూ.19,572 కోట్ల అప్పు చేసినట్లవుతుంది.