బాబు సర్కారు మళ్లీ రూ.5 వేల కోట్ల అప్పు | Chandrababu Naidu Government Is Again Taken Debt Of Rs 5 Thousand Crores, More Details | Sakshi
Sakshi News home page

బాబు సర్కారు మళ్లీ రూ.5 వేల కోట్ల అప్పు

Aug 30 2025 3:52 AM | Updated on Aug 30 2025 1:23 PM

Chandrababu government is again in debt of Rs 5 thousand crores

సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు మళ్లీ అప్పు చేస్తోంది. వచ్చే మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ వేలం ద్వారా రూ.5,000 కోట్లు అప్పు చేయనుంది. ఈ మేరకు సెక్యూరిటీ వేలంను ఆర్‌బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. రూ.1,000 కోట్ల అప్పు వచ్చే ఎనిమిదేళ్లలో తీర్చేలా, మరో రూ.1,000 కోట్ల అప్పు వచ్చే తొమ్మిదేళ్లలో.. రూ.1,500 కోట్ల అప్పు 11 ఏళ్లలో.. మరో రూ.1,500 కోట్ల అప్పు 12 ఏళ్లలో తీర్చేలా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ వేలం ద్వారా ఈ మొత్తం రుణాన్ని ఆర్‌బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది.

Advertisement
 
Advertisement
Advertisement