AP CM YS Jagan Praises Priya Malik for Win Gold Medal at World Cadet Wrestling - Sakshi
Sakshi News home page

Priya Malik: ప్రియామాలిక్‌కు అభినందనలు తెలిపిన సీఎం జగన్

Jul 25 2021 5:59 PM | Updated on Jul 26 2021 10:39 AM

Ap: Cm Jagan Praises Priya Malik Wins Gold At World Cadet Wrestling - Sakshi

సాక్షి, అమరావతి: హంగేరీ వేదికగా జరిగిన రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత్‌ రెజ్లర్‌ ప్రియా మాలిక్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. దేశానికి మరో పురస్కారం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ‘‘హంగేరిలో జరిగిన ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ తరపున బంగారు పతకం సాధించినందుకు ప్రియా మాలిక్‌కు నా హృదయపూర్వక అభినందనలు’’ అని ట్వీట్‌ చేశారు.


రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన తర్వాత ప్రియామాలిక్‌ విజయహాసం

కాగా హంగేరీలో జరుగుతున్న రెజ్లింగ్ పోటీల్లో 73 కేజీల విభాగంలో ఫైనల్‌లో ప్రియా మాలిక్‌ విజయం సాధించి గోల్డ్‌మెడల్‌  కైవసం చేసుకుంది. ఆమె 5-0తో బెలారస్‌ రెజ్లర్‌ను ఓడించి పసిడిని ఖాతాలో వేసుకుంది. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో కూడా భారత రెజ్లర్లపై భారీ అంచనాలే ఉన్నాయి. 57 కేజీల విభాగంలో రవి కుమార్ దహియా, 65 కేజీల విభాగంలో భజరంగ్ పూనియా, 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా పురుషుల జాబితాలో పోటీ పడనుండగా మహిళల విభాగంలో సీమా, వినేశ్ ఫోగర్, అన్షు, సోనమ్ బరిలో దిగబోతున్నారు.ప్రియా మాలిక్ విజ‌య‌మై సోష‌ల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement