
సాక్షి, అమరావతి: సీఐడీ అదనపు డీజీ సునీల్కుమార్ తమ కుటుంబసభ్యులను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆయన మామ, విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ తండ్రి పెనుమాక సుబ్బారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు సునీల్కుమార్తోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, డీజీపీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌం టర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.