108 Ambulance Contract Employees Thanks To AP CM YS Jagan- Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌కు థాంక్స్‌ చెప్పిన ‘108’ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు

Aug 7 2021 7:54 AM | Updated on Aug 7 2021 9:33 AM

108 Ambulance Contract Employees Thanks To CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: అంబులెన్స్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవచూపడంపై 108 కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది. శుక్రవారం అరబిందో యాజమాన్యంతో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయని, ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి యాజమాన్యం అంగీకరించిందని యూనియన్‌ ప్రెసిడెంట్‌ బి.కిరణ్‌కుమార్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్‌ జిల్లాల బదిలీలు, జీతాల శ్లాబుల్లో మార్పులు, జిల్లాస్థాయి గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటుతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి సానుకూలత వ్యక్తం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా 108 సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:
ఏపీ కేబినెట్‌ ఆమోదించిన అంశాలు ఇవే..  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement