యాడికి: అధిక ఉష్ణోగ్రతలతో వడదెబ్బ మరణాలు పెరుగుతున్నాయి. తాజాగా ఒక బేల్దారి వడదెబ్బకు గురై మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యాడికి మండల కేంద్రంలోని తిప్పారెడ్డిపల్లి రహదారిలో నివసిస్తున్న కుమ్మర శ్రీనివాసులు(35) బేల్దారి పనులు చేసుకుంటూ భార్య, కుమారుడు, కుమార్తెను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండటంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. శుక్రవారం సాయంత్రం పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ ఘటన ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది.


