మెరిసిన బావ, బావమరిది | - | Sakshi
Sakshi News home page

మెరిసిన బావ, బావమరిది

Jan 29 2026 6:26 AM | Updated on Jan 29 2026 6:26 AM

మెరిస

మెరిసిన బావ, బావమరిది

అనంతపురం ఎడ్యుకేషన్‌: గోరంట్ల మండలం బీటీ తండాకు చెందిన ఎస్‌.శివప్రసాద్‌నాయక్‌ 2014 డీఎస్సీలో ఎస్జీటీగా ఎంపికయ్యాడు. 2021లో గణితం స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందాడు. ప్రస్తుతం రాయదుర్గం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నాడు. ఈయన తల్లి ప్రమీల, తండ్రి లక్ష్మీరామ్‌నాయక్‌ ఇద్దరూ వ్యవసాయ కూలీలే. గ్రూప్‌–2 పరీక్షల్లో ప్రతిభ చాటిన శివప్రసాద్‌నాయక్‌ డిప్యూటీ తహసీల్దార్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఇక శివప్రసాద్‌ నాయక్‌ చెల్లెలును పెళ్లి చేసుకున్న రాయదుర్గం మండలం మల్లాపురం తండాకు చెందిన ఎస్‌.గంగాధర్‌ నాయక్‌ సైతం ప్రస్తుతం రాయదుర్గం ఫైర్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూనే గ్రూప్‌–2లో ప్రతిభ చాటి ఎకై ్సజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యారు. ఇతని తల్లిదండ్రులు జయాబాయి, శంకర్‌నాయక్‌ ఇద్దరూ వ్యవసాయ కూలీలే కావడం గమనార్హం.

మెరిసిన బావ, బావమరిది 1
1/1

మెరిసిన బావ, బావమరిది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement