ఫుట్బాల్ ఇన్స్పైర్ కప్ టోర్నీ ప్రారంభం
అనంతపురం కార్పొరేషన్: ఆర్డీటీ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి అనంత క్రీడాగ్రామంలో ఫుట్బాల్ ఇన్స్పైర్ ఇన్విటేషన్ కప్ టోర్నీ ప్రారంభమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జట్లు బరిలో దిగాయి. దాదాపు 252 మంది మహిళా క్రీడాకారిణులు తరలివచ్చారు. ఆదివారం జరిగిన మ్యాచ్లో థాండమ్ ఫౌండేషన్, ఫజల్ ఎఫ్సీ, కెంప్ ఎఫ్సీ జట్లు తమ ప్రత్యర్థి జట్లపై సునాయాసంగా విజయం సాధించాయి. బెంగళూరు, టర్న్ ప్రో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ నెల 10వ తేదీ వరకు టోర్నీ జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


