మరుగుతున్న నీటిలో కారం కలిపి, భర్త ముఖంపై జల్లి... | - | Sakshi
Sakshi News home page

మరుగుతున్న నీటిలో కారం కలిపి, భర్త ముఖంపై జల్లి...

Sep 21 2023 1:54 AM | Updated on Sep 21 2023 9:41 AM

- - Sakshi

ఈక్రమంలో భర్త బాత్‌రూమ్‌కు వెళ్లగా ఆఫ్రీన్‌ వేడి నీటిలో కారం పొడి కలిపింది.

అనంతపురం: భర్తపై భార్య దాష్టీకానికి పాల్పడింది. వేడినీటిలో కారం కలిపి ముఖంపై చల్లింది. ఈ ఘటన ఉడిపి పట్టణంలో జరిగింది. కటపాడియ శంకరపురలో మోహమ్మద్‌ ఆశ్రఫ్‌, అప్రీన్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈరికి గత ఏడాది వివాహమైంది. అయితే భర్త వివాహేతర సంబంధం నడుపుతున్నట్లు భార్య అనుమానపడుతోంది.

దీనిపై ప్రశ్నించినందుకు అతను గొడవపడ్డాడు. ఈక్రమంలో భర్త బాత్‌రూమ్‌కు వెళ్లగా ఆఫ్రీన్‌ వేడి నీటిలో కారం పొడి కలిపింది. అతను బయటకు రాగానే ముఖం చల్లింది. ఈ విషయం ఏవరికై న చెబితే అంతుచూస్తానని బెదిరించింది. ఎట్టకేలకు బాధితుడు పోలీసులను ఆశ్రయించి భార్య దాష్టీకంపై ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement