టోర్నమెంట్ గోడపత్రికలను ఆవిష్కరిస్తున్న జీవన్రాయ తదితరులు
మాకవరపాలెం: మండలంలోని తామరం ఇమ్మానుయేలు ఎడ్యుకేషన్ క్యాంపస్లో ఈ నెల 22న రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు ప్రగతి చెస్ అకాడమీ నిర్వాహకుడు సుధీర్కుమార్ తెలిపారు. ఈ టోర్నమెంట్ గోడపత్రికలను మంగళవారం ఇమ్మానుయేలు సంస్థ డైరెక్టర్ బిషప్ కె.జీవన్రాయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టోర్నమెంట్లో పాల్గొనేవారు ఈ నెల 20లోగా తమ పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. వయసుతో సంబంధం లేకుండా పాల్గొనవచ్చని, విజేతలుగా నిలిచిన 30 మందికి నగదు బహుమతులు అందజేస్తామన్నారు. వివరాలకు 9949048153, 9676514520 నంబర్లను సంప్రదించాలన్నారు.


