రైతు వ్యతిరేక ప్రభుత్వం
చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని వర్గాల వారు వంచనకు గురయ్యారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం దాటవేతధోరణి అవలంభిస్తోంది. ఎన్నికల ముందు ప్రతీ రైతుకు ఏడాదికి రూ .20వేల మేర అన్నదాత సుఖీభవ పథకం కింద సాయం అందిస్తామంటూ నమ్మించి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది ఈ పథకానికి మంగళం పాడేసింది. రెండవ ఏడాది కూడా పూర్తిస్థాయిలో పథకం అమలు చేయలేదు. సాగుకు అవసరమయ్యే పెట్టుబడుల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంటల బీమాకు బడ్జెట్లో నామమాత్రంగా కేటాయించారు. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా చంద్రబాబు సర్కార్ పేరుగాంచిందనే చెప్పాలి. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది.
– ఎస్.బ్రహ్మాజీ, సీఐటీయూ కార్యదర్శి, తిమ్మరాజుపేట, మునగపాక


