విద్యార్థులకు అభినందనలు
విద్యార్థులను అభినందిస్తున్న హెచ్ఎం శేషు
అచ్యుతాపురం రూరల్ : రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో ఖాజీపాలెం విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. బాపట్ల జిల్లాలో ఈ నెల 22,23,24 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన హేమ శేఖర్, నవదీప్, లలిత్ కుమార్లు రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి సాధించిన పాఠశాల పీడీ దిననరణ్ సోమవారం విలేకరులతో తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేషు, సర్పంచ్ పీలా నర్సింగరావు, గ్రామ పెద్దలు, కుటుంబీకులు తదితరులు విద్యార్థులను అభినందించారు.


