నిండు గర్భిణి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

నిండు గర్భిణి ఆత్మహత్య

Jun 15 2023 12:50 PM | Updated on Jun 15 2023 1:09 PM

- - Sakshi

అనకాపల్లి: మండలంలో వెదుళ్ల పాలెం గ్రామానికి చెందిన గర్భిణి కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన ఓరుగంటి శ్రావణి (21)కి పెనుగొల్లుకు చెందిన శివతో మూడు మాసాల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం ఈమె రెండు నెలల గర్భిణి. ఈమె తరచూ కడుపు నొప్పితో బాధపడుతోందని, కుటుంబ సభ్యులు తెలిపారు.

మంగళవారం రాత్రి కడుపునొప్పి తీవ్రంగా రావడంతో తన గదిలోకి వెళ్లి చీరతో ఉరేసుకుందన్నారు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను కిందికి దించి ఆస్పత్రికి తరలించేలోపే మరణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. తమ కుమార్తె కడుపునొప్పి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని, ఆమె తల్లి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ శిరీష తెలిపారు.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement