నర్సీపట్నం: ఆటపాటల ద్వారా చిన్నారులకు విద్య నేర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి.జి.ఎస్.నాగేశ్వరరావు అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. పట్టణంలోని జెడ్పీ హైస్కూల్(తురకబడి)లో జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను అంగన్వాడీ కేంద్రాల్లో సక్రమంగా అమలు చేయాలన్నారు. ఇంగ్లిష్పై ప్రత్యేక దృష్టి సారించి, చిన్నారులను ఆ దిశగా తీర్చిదిద్దాలన్నారు. పిల్లలకు సులభంగా అర్థం కావాలంటే ఆటపాటల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో సీడీపీవో జి.వి.రమణి, ఏఎంవో కెజియా, ఎంఈవో సిహెచ్.తలుపులు, రిసోర్స్పర్సన్లు కె.ఆర్.పి.ఎం.నాగేశ్వరరావు, బి.ఎస్.ఆర్.గోవింద్, కె.గణేష్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు కె.రామలక్ష్మి, పి.అప్పలనర్స పాల్గొన్నారు.


