చింతపల్లి: గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రం చింతపల్లిలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ సోమవారం మూత పడింది. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మండలంలో ఉన్న ఈ ఏకై క బంక్ ద్వారా రోజుకు రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు పెట్రోల్, డీజిల్ విక్రయిస్తారు. సోమవారం పెట్రోలు ట్యాంక్ రాకపోవడంతో బంక్ మూతపడింది. దీంతో ఈ ప్రాంతానికి వచ్చిపోయే పలువురు వాహనచోదకులు ఇబ్బందులకు గురయ్యారు. ఇటీవల తరచూ పెట్రోలు కొరత ఏర్పడుతుండడంతో ఇబ్బందులు పడుతున్నామని, ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా గిరిజన సహకార సంస్థ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు వాహనదారులు కోరారు.


