ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పథకం ప్రకారం దళితులు, గిరిజన జనాభా ప్రతిపాధికన నిధులు కేటాయించి అభివృద్ధి పథకాలు అమలు చేయాలంటూ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద దళిత నాయకులు నిరసన చేశారు. ఎస్సీలకు 16.4, ఎస్టీలకు 5.3 శాతం నిధులు కేటాయించి ఖర్చు చేయాలని, ప్రతి నెలా నోడల్ ఏజెన్సీ సమావేశం ద్వారా పథకాన్ని సక్రమంగా ఆమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పథకం నిధులను ఇతర పథకాలకు కేటాయించకుండా శ్వేత పత్రం విడుదల చేయాలంటూ పలు డిమాండ్లపై వినతిపత్రాన్ని పీజీఆర్ఎస్ ద్వారా కలెక్టర్కు అందించారు.


