అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 56 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా కార్యాలయంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో ఉన్న సమస్యలు పరిష్కారానికి వారం రోజుల్లో చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. భూ తగాదాలు, ఆస్తి సంబంధిత సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, వేధింపులు, మోసపూరిత వ్యవహారాలు, ఆర్థిక నేరాలు, ఇతర ప్రభుత్వ విభాగాలకు చెందిన అర్జీలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.


