పాడేరు పాతబస్టాండ్ వద్ద సామాజిక పింఛన్ సొమ్మును పంపిణీ చేస్తున్న కలెక్టర్ నిశాంతి
సాక్షి,పాడేరు: ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీని కలెక్టర్ టి.నిశాంతి సోమవారం పాడేరు పాతబస్టాండ్లో ప్రారంభించారు.పలువురు పింఛన్దారులకు జూన్ నెలకు సంబంధించిన పింఛన్ సొమ్మును కలెక్టర్ అందజేశారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ మురళీ,మాజీ ఉప సర్పంచ్ బూరెడ్డి రామునాయుడు,సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లాలోని 11 మండలాల్లో తొలిరోజు సాయంత్రం నాటికి 90.2శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేశాఈమని డీఆర్డీఏ పీడీ మురళీ తెలిపారు.


