సాక్షి,పాడేరు: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరగనున్న ప్రతిష్టాత్మక మహిళా సదస్సుకు జిల్లాకు చెందిన ముఖ్య మహిళా నేతలు శనివారం భారీగా తరలివెళ్లారు. వీరిలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వ తమ్మ, అరకులోయ, పాడేరు నియోజకవర్గాల అధ్యక్షురాళ్లు సమిడ పూర్ణిమాదేవి, కిల్లో ఉర్వశిరాణి, హుకుంపేట వైస్ ఎంపీపీ జి. సుశీల, సూకూరు ఎంపీటీసీ కిలగాడ సింహచలం, పాడేరు మండల కార్యదర్శి లకే రామసత్యవతి, కుజ్జెలి గ్రామ కమిటీ కార్యదర్శి గంజాయి సూర్యకళ తదితరులు ఉన్నారు.


