ఇచ్చోడ: నేర నియంత్రణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహిస్తున్నామని ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే అన్నారు. గురువారం తెల్లవారు జామున ఇచ్చోడ మండల కేంద్రంలోని ఇస్లాంపూర, రంజాన్పూర కాలనీలో తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలులేని 110 ద్విచక్ర వాహనాలు, ఆటో, 4 కార్లు, నంబర్ ప్లెట్లు లేని, ఫేక్ నంబర్లు ఉన్న 15 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్ ఇచ్చోడ స్టేషన్హౌజ్ ఆఫీసర్ నరేష్కుమార్, సీఐ సీహెచ్ రమేశ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి.వెంకట్, మురళి, ఎన్.చంద్రశేఖర్, 150 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


