న్యూస్రీల్
పీహెచ్సీల్లో వైద్యుల కొరత సగం మందితోనే సేవలు జిల్లాలో 25 పోస్టులు ఖాళీ 18 మందికి పీజీ రావడంతో రిలీవ్ ఉన్నవారితోనే సర్దుబాటు రోగులకు తప్పని తిప్పలు
కై లాస్ నగర్: ఆదిలాబాద్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్(ఆర్డీవో)గా పి.జగదీశ్వర్రావు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇది వరకు ఆర్డీ వోగా పనిచేసిన స్రవంతి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అంతకు ముందు కలెక్టర్ రాజర్షిషాను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
ఇక్కడ ఖాళీగా కనిపిస్తున్నది తాంసి పీహెచ్సీ వైద్యాధికారి కుర్చీ. ఉదయం 11 గంటలకు ఈ సెంటర్ను ‘సాక్షి’ పరిశీలించగా వైద్యాధికారి అందుబాటులో లేరు. ఈ మెడికల్ ఆఫీసర్ ఉన్నత చదువు నిమిత్తం ఈనెల 1నుంచి లాంగ్లీవ్లో వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సు మాత్రం విధుల్లో ఉన్నారు. ఫార్మసిస్టు 11 గంటల తర్వాత విధులకు వచ్చారు. స్టాఫ్ నర్సు రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ ఒక్క పీహెచ్సీలోనే కాదు.. జిల్లాలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులే ఉన్నట్లుగా ‘సాక్షి’ విజిట్లో తేలింది.
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంగళవారం ‘సాక్షి’ విజిట్ చేసింది. పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండకపోవడం, సమయపాలన పాటించకపోవడం, మందుల కొరత తదితర సమస్యలు దర్శనమిచ్చాయి.
ఆదిలాబాద్టౌన్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను వైద్యుల కొరత వేధిస్తోంది. దీంతో రోగులకు పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందని పరిస్థితి. జిల్లాలో 27 పీహెచ్సీలకు గాను 50 వైద్యపోస్టులు ఉన్నా యి. ఇందులో 25 మంది మాత్రమే పనిచేస్తుండగా, మిగతా పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉన్న వైద్యులతో సర్దుబాటు చేస్తూ రోగులకు సేవలు అందిస్తున్నారు. ఇందులో కొంత మంది సమయపాలన పాటించకపోవడం, మధ్యాహ్నమే ఇంటిముఖం పట్టడంతో రోగుల అవస్థలు వర్ణనాతీతం. ప్రస్తుతం భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికే 44 డిగ్రీల మార్క్ దాటాయి. జనం వడదెబ్బకు గురవుతున్నారు. వాంతులు, విరేచనాలు, జ్వరాల బారిన పడుతున్నారు. ఆస్పత్రికి వెళ్లిన సమయంలో వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో గత్యంతరం లేక ప్రైవేట్కు వెళ్లాల్సిన దుస్థితి.
ఖాళీలతో అవస్థలు..
జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు బోథ్, నార్నూర్ సీహెచ్సీలు ఉన్నాయి. పీహెచ్సీల్లో 50 పోస్టులకు గాను 25 మంది పనిచేస్తున్నారు. బజార్హత్నూర్లో నా లుగు పోస్టులకు గాను ఒక్కరు కూడా లేరు. భీంపూర్(టి)లో రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గుడిహత్నూర్, ఝరి పీహెచ్సీల్లో ఇదే పరిస్థితి. ఇద్దరు చొప్పున ఉండాల్సి ఉండగా, ఒక్కరు కూడా లేరు. సైద్పూర్, పీపీ యూనిట్, నేరడిగొండ, గాదిగూడ, పిట్టబొంగరంలో ఒక్కరు చొప్పున వైద్యులు ఉండాల్సి ఉండగాా, ప్రస్తుతం ఈ పీహెచ్సీల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బోథ్ సీహెచ్సీలో 6 పోస్టులకు గాను ఇద్దరు మాత్రమే పనిచేస్తుండగా, 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగతా పీహెచ్సీల్లో ఉన్న వైద్యులతో సేవలు అందిస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
కై లాస్నగర్: పెన్షనర్లకు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యసేవలు అందించా లని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సాయిరి శశి కాంత్ డిమాండ్ చేశారు. ఈమేరకు అదనపు కలెక్టర్ ఆర్ఎస్ చిత్రుకు మంగళవారం ఆయన కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఇందులో సంఘం నాయకులు దయానందరెడ్డి, జగన్మోహన్, దేవిదాస్, గంగాధర్, శ్యామ్ రాజుగౌడ్, ఉమాకాంత్ తదితరులున్నారు.


