వసూళ్లపై దృష్టి సారించాలి
కైలాస్నగర్(బేల): పేరుకుపోయిన విద్యుత్ బ కాయిలపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తిస్థాయిలో వసూలు చేయాలని విద్యుత్శాఖ ఎస్ఈ జాదవ్ శేష్రావు ఆదేశించారు. బేల మండల కేంద్రంలోని సబ్స్టేషన్ను గురువారం ఆయన పరిశీలించి నిర్వహణ వివరాలు తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అన్ని 11కేవీ విద్యుత్ లైన్లు సరి చేసుకోవాలని, లైన్లకు దగ్గరగా ఉన్న చెట్ల కొ మ్మలను తొలగించాలని సూచించారు. వేలాడే విద్యుత్ వైర్లు, డ్యామేజ్ పోల్స్ను పరిశీలించినట్లు తెలిపారు. విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, నాణ్య మైన విద్యుత్ అందించాలంటే లైన్లను ముందుగా సరిదిద్దుకోవాలని సూచించారు. ఆయన వెంట బేల, జైనథ్ మండలాల ఏఈలు, ఇతర విద్యుత్ సిబ్బంది తదితరులున్నారు.


