జంతుగణనకు సన్నద్ధం
ఎన్టీసీఏ గైడ్లైన్స్ ప్రకారం వన్యప్రాణుల గణనకు అటవీశాఖ సన్నద్ధమైంది. కవ్వాల్ టైగర్జోన్లోని 576 అటవీ బీట్లలో ఈ గణన నిర్వహించనున్నారు.
చిన్నతనంలోనే ప్రేరణ పొందా..
నాది నిర్మల్ జిల్లా ప్రియదర్శిని నగర్. నాన్న పరమేశ్వర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మ సుజాత గృహిణి. నాన్న టీచర్ కావ డంతో ఆయన పనిచేసే పాఠశాల విద్యార్థులను ఏటా విహారయాత్రలకు తీసుకెళుతుండేవారు. నేను ఒకటో తరగతిలో ఉండగా కన్యాకుమారిలోని స్వామి వివేకానందుని మెమోరియల్కు తీసుకెళ్లారు. అప్పుడే ఆ మహనీయుని గురించి తెలిసింది. చిన్నతనం నుంచే డాడీ లైబ్రరీ నుంచి వివేకానందుని పాకెట్ బుక్లను తీసుకొచ్చి చదివించేవారు. దీంతో తెలియకుండానే నాపై ఆయన ప్రభావం పడింది. 2016లో డిగ్రీ పూర్తిచేశా. ఓయూలో ఎంసీజే చదువుతున్న సమయంలో 2017 ఆగస్టులో ఎఫ్ఆర్వో నోటిఫికేషన్ వచ్చింది. తొలి ప్రయత్నంలో నే ఉద్యోగం సాధించాను. అపారమైన విశ్వా సం.. అనంతమైన శక్తి విజయసాధనకు మా ర్గాలనే స్వామిజీ సూక్తి నన్ను ముందుకు నడిపించింది.
– తొడిశెట్టి ప్రణయ్, ఎఫ్ఆర్వో, బోథ్


