జిల్లాకు ఐదు సూపర్‌ లగ్జరీ బస్సులు | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు ఐదు సూపర్‌ లగ్జరీ బస్సులు

Aug 8 2024 11:48 PM | Updated on Aug 8 2024 11:48 PM

జిల్ల

జిల్లాకు ఐదు సూపర్‌ లగ్జరీ బస్సులు

అమలాపురం రూరల్‌: జిల్లాకు ఐదు సూపర్‌ లగ్జరీ బస్సులను కేటాయించారు. అమలాపురం ఆర్టీసీ డిపోకు మూడు, రాజోలు డిపోకు రెండు చొప్పున బస్సులను కేటాయించినట్లు రవాణా శాఖ మంత్రి ఎం.రామప్రసాద్‌రెడ్డి గురువారం ఏలూరులో ప్రకటించారు. ఈ బస్సులను కోనసీమ జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ఎస్‌.శ్రీనివాస్‌, అమలాపురం డీఎం చల్లా సత్యనారాయణ మూర్తికి మంత్రి అందజేశారు. ఇవి హైదరాబాద్‌, విశాఖపట్నం రూట్లలో తిరుగుతాయని డీఎం మూర్తి తెలిపారు. వీటిని ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు.

కలెక్టరేట్‌

విద్యుత్‌ ఫీడర్‌ ప్రారంభం

అమలాపురం రూరల్‌: అమలాపురం సెక్షన్‌ పరిధిలో బాలయోగి ఘాట్‌ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నుంచి కొత్తగా ఏర్పాటు చేసిన 11 కేవీ కలెక్టరేట్‌ ఫీడర్‌ను రాజమహేంద్రవరం ఏపీఈపీడీసీఎల్‌ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ టీవీఎస్‌ఎన్‌ మూర్తి గురువారం ప్రారంభించారు. దీనిని సుమారు రూ.35 లక్షలతో ఏర్పాటు చేశామన్నారు. ఈ ఫీడర్‌ ద్వారా కలెక్టరేట్‌, ఆర్టీఓ కార్యాలయం, గవర్నమెంట్‌ హాస్పటల్‌, కోర్టులు, ప్రభుత్య కార్యాలయాలకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తామన్నారు. కార్యక్రమంలో అమలాపురం ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ మోకా రవికుమార్‌, రాజమహేంద్రవరం కనెక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ వై.డేవిడ్‌ తదితరులు పాల్గొన్నారు..

జాబ్‌ మేళాలో

83 మందికి ఉద్యోగాలు

అమలాపురం రూరల్‌: అమలాపురంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో గురువారం జాబ్‌మేళా జరిగింది. కేఎల్‌ గ్రూప్‌ అమెజాన్‌ సంస్థ చైన్నెలో పనిచేయడానికి ఇంటర్వ్యూలు జరిగాయి. ఇందులో 83 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు లభించాయని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఇ.వసంతలక్ష్మి తెలిపారు. ఉద్యోగానికి ఎంపికై న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అంచెలంచెలుగా ఎదగాలని సూచించారు. ఉద్యోగం చేస్తూ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలని అన్నారు. ఈ మేళాలో 189 యువత పాల్గొనగా, ఎంపికై న వారికి నియామక పత్రాలు అందజేశారు.

పంపా నుంచి

100 క్యూసెక్కుల విడుదల

అన్నవరం: అల్పపీడనం ప్రభావంతో కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడుతుండటంతో అన్నవరం పంపా రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఫలితంగా రిజర్వాయర్‌ నీటిమట్టం గురువారం సాయంత్రానికి 100.3 అడుగులకు చేరుకుంది. రిజర్వాయ్‌ర్‌లోకి 160 క్యూసెక్కుల చొప్పున ఇన్‌ఫ్లో ఉంటటంతో నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. రిజర్వాయర్‌ గరిష్ట నీటిమట్టం 103 అడుగులు కాగా ప్రస్తుతం 100.3 అడుగులకు చేరింది. దీంతో ముందు జాగ్రత్తగా బ్యారేజీ రెండో నంబర్‌ గేటు ఎత్తి 100 క్యూసెక్కుల నీటిని సముద్రానికి విడుదల చేసినట్లు ఇరిగేషన్‌ పెద్దాపురం డివిజన్‌ ఈఈ శేషగిరిరావు గురువారం తెలిపారు. పంపా ఆయకట్టుకు 130 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. పంపా మెయిన్‌ కెనాల్‌ ద్వారా 120 క్యూసెక్కులు, సబ్సిడరీ డ్యామ్‌ ద్వారా పది క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. పంపా రిజర్వాయర్‌ గరిష్ట నీటి నిల్వ 0.43 టీఎంసీ కాగా ప్రస్తుతం 0.33 టిఎంసీ నీరు నిల్వ ఉంది.

జిల్లాకు ఐదు సూపర్‌  లగ్జరీ బస్సులు 1
1/3

జిల్లాకు ఐదు సూపర్‌ లగ్జరీ బస్సులు

జిల్లాకు ఐదు సూపర్‌  లగ్జరీ బస్సులు 2
2/3

జిల్లాకు ఐదు సూపర్‌ లగ్జరీ బస్సులు

జిల్లాకు ఐదు సూపర్‌  లగ్జరీ బస్సులు 3
3/3

జిల్లాకు ఐదు సూపర్‌ లగ్జరీ బస్సులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement