breaking news
Ziva MS Dhoni
-
ఎంఎస్ ధోనీ కుమార్తె జివా ఏం కావాలనుకుంటుందో తెలుసా? వైరల్ వీడియో
డాక్టర్ బిడ్డ డాక్టర్ కావాలని, యాక్టర్ బిడ్డ యాక్టర్, వ్యాపారి బిడ్డ వ్యాపరే అవుతుందని సాధారణంగా భావిస్తుంటాం. తల్లిదండ్రుల వారసత్వాన్ని నిలబెట్టుకుని కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టనవారు కూడా చాలామందే ఉన్నారు. అయితే టీమీండియా స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానిగా ఆయన కుమార్తె క్రికెటర్గా రాణించాలనుకుంటున్నారా? మెరుపువేగంతో సెంచరీలు చేస్తూ, క్రికెట్ గ్రౌండ్లో తనదైన వ్యూహాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాలనుకుంటున్నారా? అయితే మీకో ఇంట్రస్టింగ్ న్యూస్. ధోని ముద్దుల తనయ పెరిగి పెద్దయ్యాక ఏం కావాలనుకుంటోందో తెలుసా?ఎంఎస్ ధోనీ, సాక్షిల ఏకైక కుమార్తె జీవా. ఈ జంటకు 2010లో వివాహం జరగ్గా.. 2015లో జీవా జన్మించింది. భవిష్యత్తులో ఏం చేస్తావు అంటే పిల్లలు సాధారణంగా, డాక్టర్, యాక్టర్, టీచర్, పైలట్ ఇలాంటి సమాధానాలే చెబుతారు. కానీ ప్రకృతిని ప్రేమించి, ప్రకృతి శాస్త్రవేత్తను అవుతాను ధోనీ కుమార్తె చెప్పడం విశేషంగా నిలిచింది.(రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్ కామత్ ఆఫర్)శుక్రవారం నాడు ఉత్తరాఖండ్లోని హరిద్వార్కు చెందిన ఒక రాజకీయ నాయకుడితో జరిగిన సంభాషణలో, తాను పెద్దయ్యాక ప్రకృతి శాస్త్రవేత్త కావాలని కోరుకుంటున్నానని ఎంఎస్ ధోని కుమార్తె జీవా వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ధోని భార్య సాక్షీ, జీవా కాశీ పర్యటనలో ఉన్నట్టు తెలుస్తోంది. హర్ కి పౌరి ప్రాంతం సమీపంలోని మరొక వీడియోలో, సాక్షి మరియు ఇతరులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య స్థానికులకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు చూపించారు. వారి సందర్శనల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గంగా సభ కార్యదర్శి తన్మయ్ వశిష్ఠ ఈ వీడియోను అప్లోడ్ చేశారు. 10 ఏళ్ల చిన్నారికి ఇలాంటి కోరిక ఉండటం చాలా ఆనందం అంటూ ప్రశంసించారు.భవిష్యతుల్లో మంచి మనిషిగా రాణిస్తుంది అంటూ దీవించారు నెటిజన్లు.I want to become Naturalist : Ziva Dhoni #MSDhoni pic.twitter.com/r0gqRiLrEu— Chakri (@ChakriDhonii) October 25, 2025 -
ధోని గారాలపట్టి జివా క్యూట్ అండ్ వైరల్ ఫొటోలు
-
హార్దిక్కు చీర్స్ తెలిపిన ధోని కూతురు
-
హార్దిక్కు చీర్స్ తెలిపిన ధోని కూతురు
డబ్లిన్: ఐర్లాండ్తో రెండు టీ20ల సిరీస్ను టీమిండియా 2-0తో కైవసం చేసుకుని యూకే పర్యటనను ఘనంగా ఆరంభించింది. శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్లో భారత్ 143 పరుగుల తేడాతో ఆతిథ్య ఐర్లాండ్ను చిత్తుచిత్తుగా ఓడించింది. భారత ఇన్నింగ్స్లో భాగంగా చివర్లో హార్దిక్ చెలరేగి ఆడాడు. కేవలం 9 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 32 పరుగులు చేసి భారత్ జట్టుకు భారీ స్కోరు అందించాడు. అయితే మ్యాచ్ అనంతరం పాండ్యా తన ఇన్స్టాగ్రాం ద్వారా ఒక వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ‘నన్ను ప్రోత్సహించేందుకు ఒక చీర్ లీడర్ దొరికిందని అనుకుంటున్నాను’ అని పేర్కొన్నాడు. ఇంతకీ ఆ చీర్ లీడర్ ఎవరో తెలుసా. ఎంఎస్ ధోని గారాలాపట్టి జీవా. ‘కమాన్... కమాన్.. హార్దిక్’ అంటూ జీవా ఆ వీడియోలో సందడి చేసింది. ఈ వీడియోను ధోనీ భార్య సాక్షి... పాండ్యాకు పంపించిందట. ఆ వీడియోను హార్దిక్ అభిమానులతో పంచుకున్నాడు. -
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ధోని కూతురు


