-
అమ్మకాల్లో షావోమీ ఎలక్ట్రిక్ కార్ సరికొత్త రికార్డ్లు
చైనా టెక్ దిగ్గజం షావోమీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కార్లు ఊహించని విధంగా అమ్ముడు పోతున్నట్లు తెలుస్తోంది. షావోమీ గతేడాది ఎస్యూ7 (ఎస్యూ అంటే స్పీడ్ ఆల్ట్రా) ను ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కారును గత నెల చివరి వారంలో విడుదల చేసింది. టెస్లా, బీవైడీ కార్లను తట్టుకుని నిలబడేందుకు ధర 2,15,900 యువాన్లు (సుమారు రూ.24,90లక్షలు)గా నిర్ణయించింది. ఇప్పుడు ఈ మోడల్ కార్లను విడుదల చేసిన మొదటి నెలలో సుమారు 70వేల ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ లీ జున్ మాట్లాడుతూ.. ఎస్యూ 7ను ఈ ఏడాది మొత్తం లక్ష యూనిట్లను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. కాగా షావోమీ ఎస్యూ7 సెడాన్ మూడు వేరియంట్ ధరల్లో లభ్యమవుతుంది. స్టాండర్డ్ ధర 215,900 యువాన్లు, హై ఎండ్ ఎస్యూ7 ప్రో 245,900 యువాన్లు, ఎస్యూ 7 మ్యాక్స్ 299,900 యువాన్లుగా ఉంది. -
ఒకసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ టు శ్రీకాకుళం!
చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షావోమీ తాజాగా తమ తొలి విద్యుత్ కారును ఆవిష్కరించింది. బీజింగ్లో జరిగిన కార్యక్రమంలో కంపెనీ సీఈఓ ‘లీ జున్’ దీన్ని పరిచయం చేశారు. ఎస్యూ7గా వ్యవహరించే ఈ కారును మార్చి 28న చైనాలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ సెడాన్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ కంపెనీ ప్రముఖ ఫోన్లతో అనుసంధానమయ్యేలా రూపొందించారు. చైనాలో దిగ్గజ కంపెనీలుగా పేరొందిన ‘కాన్టెంపరరీ యాంపరెక్స్ టెక్నాలజీ’, బీవైడీ నుంచి తీసుకున్న బ్యాటరీలను ఈ కార్లలో వాడుతున్నారు. భవిష్యత్తులో ప్రపంచంలో తొలి ఐదు దిగ్గజ వాహన తయారీ సంస్థల్లో ఒకటిగా నిలుస్తామని లీ జున్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కారుని ‘సెల్-టు-బాడీ’ టెక్నాలజీతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. దీంతో బ్యాటరీని నేరుగా వాహన నిర్మాణానికే అనుసంధానం చేసినట్లు వివరించారు. ఫలితంగా కారు దృఢత్వం పెరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికే కంపెనీ రూపొందించిన అనేక యాప్లకు ఈ కారులో యాక్సెస్ ఉంటుందన్నారు. ఈ కారు ఎస్యూ7, ఎస్యూ7 మ్యాక్స్ పేరిట రెండు వేరియంట్లలో లభించనుంది. ఎస్యూ 7 విషయానికి వస్తే.. 0-100 kmph వేగాన్ని 5.28 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ తెలిపింది. అలాగే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 668 కిలోమీటర్లు వెళ్తుంది. గరిష్ఠ వేగం 210 కి.మీ/గం. అత్యధికంగా 400 ఎన్ఎం టార్క్ వద్ద 299 పీఎస్ శక్తిని విడుదల చేస్తుంది. ఇదీ చదవండి: కంపెనీని బురిడీ కొట్టించి రూ.180 కోట్లు గ్యాంబ్లింగ్.. అసలేం జరిగిందంటే.. మరోవైపు ఎస్యూ7 మ్యాక్స్ 2.78 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఒక్క ఛార్జింగ్తో 800 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని గరిష్ఠ వేగం 265 కి.మీ/గం. 838 ఎన్ఎం టార్క్ వద్ద 673 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కార్ల ధరలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. -
షావోమీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు అలెర్ట్!
స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. లిక్విడ్ యూవీ స్క్రీన్ ప్రొటెక్టర్లను వాడొద్దని సూచించింది. వాటిల్లో ద్రవరూపంలో ఉండే రసాయన జిగురు స్మార్ట్ఫోన్ చార్జింగ్ పోర్ట్, స్పీకర్, ఇతర భాగాల్లోకి వెళ్లి.. ఫోన్ పనితీరును దెబ్బతీస్తుందని హెచ్చరించింది. దీంతో పరికరం వారంటీ పూర్తి కాలం రాదని తెలిపింది. స్మార్ట్ ఫోన్ లలో స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ అమర్చబడి ఉంటుంది. అయినప్పటికి ఫోన్ కింద పడినప్పుడు డిస్ ప్లేకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు యూజర్లు అదనంగా స్క్రీన్ ప్రొటెక్టర్ లను ఉపయోగిస్తుంటారు. అయితే మార్కెట్లో లభించే వివిధ రాకలైన స్క్రీన్ ప్రొటెక్ట్ లలో లిక్విడ్ యూవీ అడెసివ్ ప్రొటెక్టర్లు మంచివని అంటుంటారు. ముఖ్యంగా కర్డ్వ్ ఫోన్ లకు ఫోన్ స్క్రీన్ కు, గ్లాస్ లేయర్ లు భద్రతగా ఉంటాయని వ్యాపారస్తులు నమ్మిస్తుంటారు. కానీ అలాంటి స్క్రీన్ ప్రొటెక్ట్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని షావోమీ ఓ నోట్ ను షేర్ చేసింది. ఈ ప్రొటెక్టర్లలో ఉపయోగించే లిక్విడ్ అంటుకునే పదార్థం ఫిజికల్ కీలు, ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ హోల్, బ్యాటరీ కవర్లోకి ప్రవేశించి, ఊహించని రీస్టార్ట్లు, బటన్ పనిచేయకపోవడం, స్పీకర్ శబ్దం, బ్యాటరీ కవర్ లెదర్ ఊడిపోవడం వంటి సమస్యలకు దారి తీస్తుందని నోట్ లో పేర్కొంది. వాటికి బదులుగా టెంపర్డ్ గ్లాస్, నాన్ టెంపర్డ్ లేదా ఎలక్ట్రోస్టాటిక్ ఫిల్మ్ల వంటి ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సిఫార్సు చేస్తోంది. -
షావోమీ 14 సిరీస్ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే?
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన షావోమీ 14 సిరీస్ ను మార్కెట్ కు పరిచయం చేసేందుకు సిద్ధమైంది. వచ్చే నెల 7న షావోమీ 14తో పాటు షావోమీ 14 ప్రో, షావోమీ 14 ఆల్ట్రా సహా షావోమీ 14 సిరీస్ ఫోన్లలో తొలుత షావోమీ 14 ఫోన్ మాత్రమే భారత్ మార్కెట్ లో విడుదల చేయనుంది. కాగా, ఈ సిరీస్ ఫోన్లను షావోమీ ఇప్పటికే చైనా మార్కెట్ లో విడుదల చేసింది. ఇప్పుడు గ్లోబుల్ మార్కెట్ లో ఆవిష్కరించనుంది. షియోమీ 14 ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.36 అంగుళాల 1.5 కే ఎల్టీపీఓ ఓలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. 3000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తున్నది. షావోమీ 14 120హెచ్ జెడ్ వరకు రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్తో 1.5కే ఎల్ టీ పీ ఓ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ డాల్బీ విజన్తో పాటు స్టీరియో స్పీకర్లతో కూడిన డాల్బీ అట్మోస్కు సపోర్ట్ చేస్తుందని తెలిపింది. హ్యాండ్సెట్ 90డబ్ల్యూ వైర్డ్ హైపర్ఛార్జ్, 50డబ్ల్యూ వైర్లెస్ టర్బో ఛార్జ్కు సపోర్ట్ ఇస్తుంది. ఇది ఫోన్ను 10 నిమిషాల కంటే తక్కువ సమయంలో సున్నా నుండి 50కి ఛార్జ్ చేస్తుందని షావోమీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇందులో లైకా కో-ఇంజినీర్డ్ కెమెరా సెటప్ ఉంటది. ఓఐఎస్ 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 50 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్, 50-మెగా పిక్సెల్ ఆల్డ్రావైడ్ యాంగిల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. సెల్పీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా సైతం యూజర్లను అలరిస్తుంది. షియోమీ 14 ఫోన్ 90వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50వాట్ల వైర్ లెస్ చార్జింగ్ మద్దతుతో 4610 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. జేడ్ గ్రీన్, బ్లాక్, వైట్, స్నో మౌంటేన్ పింక్ వేరియంట్స్ కలర్స్ లో రానున్న ఈ ఫోన్ ధర రూ.50 వేల నుంచి రూ.60 వేల మధ్య ఉండొచ్చునని అంచనా -
అదిరిపోయే ఫీచర్లతో.. భారత్లో రెడ్మీ ఏ3 విడుదల.. ధర ఎంతంటే?
స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన స్మార్ట్ఫోన్ బ్రాండ్ రెడ్మీ సిరీస్లో రెడ్మీ ఏ2కి కొనసాగింపుగా రెడ్మీ ఏ3ని తీసుకొచ్చింది. మూడు కలర్ ఆప్షన్లు, మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభ్యమవుతున్న ఫోన్ ధర రూ.7,299గా ఉంది. రెడ్ మీ ప్రీమియం ఫోన్లలో కనిపించే హాలో డిజైన్ ఈ బడ్జెట్ ఫోన్లలో కనిపిస్తుంది. రెడ్మీ ఏ3 ధర ఫిబ్రవరి 23 నుండి రిటైల్ అవుట్లెట్లలో లభ్యమయ్యే రెడ్మీ ఏ3 ధర 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,299 ఉండగా.. 4జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 8,299, 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,299 అందుబాటులో ఉంటుంది. రెడ్మీ ఏ3 స్పెసిఫికేషన్స్ రెడ్మీ ఏ3 1650*720 పిక్సెల్ల రిజల్యూషన్తో 6.7 అంగుళాల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేను కలిగి ఉంది. 90హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. బడ్జెట్ స్మార్ట్ఫోన్ వాటర్డ్రాప్ స్టైల్ నాచ్ను కలిగి ఉంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియా జీ36 చిప్సెట్తో 6జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జీబీ వరకు ఈఎంఎంసీ 5.1 స్టోరేజ్తో పనిచేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కోసం బడ్జెట్ స్మార్ట్ఫోన్లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, కనెక్టివిటీ పరంగా రెడ్మీ ఏ3 సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5 ఎంఎం హెడ్ఫోన్ జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, డ్యూయల్ 4జీ సిమ్ కార్డ్ స్లాట్లు, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3లు ఉన్నాయి. 8ఎంపీ ప్రైమరీ సెన్సార్, 0.08 ఎంపీ సెకండరీ సెన్సార్తో సహా వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్, సెల్ఫీ, వీడియో కాల్ సంబంధిత అవసరాలను తీర్చడానికి 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement