స్మార్ట్‌ఫోన్ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ కారు - సింగిల్ ఛార్జ్‌తో 800కిమీ రేంజ్ | Xiaomi Unveils SU7 Electric Car Details | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ కారు - సింగిల్ ఛార్జ్‌తో 800కిమీ రేంజ్

Dec 28 2023 4:37 PM | Updated on Dec 28 2023 4:47 PM

Xiaomi Unveils Electric Car SU7 Details - Sakshi

చైనాలోని బీజింగ్‌లో గురువారం జరిగిన 'షావోమి' (Xiaomi) ఈవీ టెక్నాలజీ లాంచ్ ఈవెంట్ వేదికగా.. కంపెనీ తన సరికొత్త ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించింది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఆవిష్కరించిన ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

షావోమి కంపెనీ మార్కెట్లో విడుదల చేయనున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు 'SU7' (స్పీడ్ అల్ట్రా7). ఇది ప్రపంచ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న అగ్ర సంస్థల ఎలక్ట్రిక్ కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉండనున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తప్పకుండా గొప్ప గుర్తింపు పొందటానికి కంపెనీ కృషి చేస్తున్నట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.

SU7 అనేది నాలుగు డోర్స్ కలిగిన ఎలక్ట్రిక్ కారు. ఇది అద్భుతమైన డిజైన్ కలిగి, ఆధునిక ఫీచర్స్ పొందనుంది. పరిమాణం పరంగా ఉత్తమంగా ఉండే ఈ కారు 73.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి, ఒక సింగిల్ చార్జితో గరిష్టంగా 800కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది.

2025నాటికి లాంచ్
షావోమి ఎలక్ట్రిక్ కారు 2025 నాటికి మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కార్లు మొత్తం చైనాలోని బీజింగ్‌ తయారీ కర్మాగారంలోనే తయారవుతాయని కంపెనీ వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే ఈ కార్లు చైనా నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదీ చదవండి: రతన్ టాటా గురించి ఐదు ఆసక్తికర విషయాలు

అంచనా ధర
SU7 ధరలు 200000 యువాన్‌ల నుంచి 300000 యువాన్‌ల వరకు ఉండే అవకాశం ఉంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ. 25 లక్షల నుంచి రూ. 35 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ కారు భారతీయ మార్కెట్లో విడుదలవుతుందా.. లేదా అనేదానిపైన అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement