మరో అద్బుతమైన టెక్నాలజీ ఆవిష్కరించనున్న షావోమీ..! | Xiaomi Patents Earthquake Monitoring Mobile Tech | Sakshi
Sakshi News home page

Xiaomi : మరో అద్బుతమైన టెక్నాలజీ ఆవిష్కరించనున్న షావోమీ..!

Sep 18 2021 6:57 PM | Updated on Sep 18 2021 6:58 PM

Xiaomi Patents Earthquake Monitoring Mobile Tech - Sakshi

Xiaomi Patents For New Tech: షావోమీ త్వరలోనే మరో అద్భుతమైన టెక్నాలజీని ఆవిష్కరించనుంది..

ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమీ త్వరలోనే మరో అద్భుతమైన టెక్నాలజీని ఆవిష్కరించనుంది. స్మార్ట్‌ఫోన్లనుపయోగించి ముందుగానే భూకంపాలను గుర్తించగల టెక్నాలజీని షావోమీ అభివృద్ధి చేస్తోంది. అందుకు సంబంధించిన పేటెంట్‌ హక్కులను షావోమీ రిజిస్టర్‌ చేసింది. ‘ మెథడ్‌ అండ్‌ ఎక్విప్‌మెంట్‌  ఫర్‌ రియలైజింగ్‌ సెసిమిక్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ మొబైల్‌ డివైజెస్‌’ పేరిట ఒక రిపోర్ట్‌ను షావోమీ ప్రచురించింది. భూకంపాలను గుర్తించడంలో ఈ టెక్నాలజీ ఉపయోగించబడుతుందని గిజ్మోచైనా నివేదించింది.
చదవండి: SpaceX: చీకటి పడటాన్ని ఆకాశం నుంచి చూశారా?


ఈ టెక్నాలజీలో భాగంగా స్మార్ట్‌ఫోన్స్‌ గుర్తించిన డేటాను భూకంప ప్రాసెసింగ్‌ యూనిట్‌కు బదిలీచేస్తోంది. అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్లలో ఏర్పాటుచేసిన టెక్నాలజీతో ముందుగానే భూకంపాలను గుర్తించడంతో పాటు, హెచ్చరికలను కూడా జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ టెక్నాలజీతో భూకంప తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.  గతంలో షావోమీ సౌండ్‌నుపయోగించి స్మార్ట్‌ఫోన్లను ఛార్జ్‌ చేసే పేటెంట్‌ను కూడా తీసుకున్న విషయం తెలిసిందే.

చదవండి: క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement