-
టాప్ ర్యాంక్లో రెజ్లర్ బజరంగ్
న్యూఢిల్లీ: యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ర్యాంకింగ్స్లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా తన నంబర్వన్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 61 కేజీల విభాగంలో బజరంగ్ 58 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గతేడాది బజరంగ్ కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు గెలవడంతోపాటు ప్రపంచ చాంపియన్షిప్లో రజతం నెగ్గాడు. గత నెలలో బల్గేరియాలో జరిగిన డాన్ కొలోవ్–నికోలా పెట్రోవ్ టోర్నీలోనూ స్వర్ణం నెగ్గిన బజరంగ్ ఈనెల 23 నుంచి చైనాలో జరిగే ఆసియా చాంపియన్షిప్ పోటీలకు సన్నద్ధమవుతున్నాడు. -
ప్రపంచ సంపన్నుల్లో ముకేశ్ అంబానీ పదో స్థానం
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ సంపద పరంగా ప్రపంచంలో టాప్–10కు చేరుకున్నారు. ఆయన సంపద విలువ 54 బిలియన్ డాలర్లు (రూ.3.83 లక్షల కోట్లు) అని హురూన్ ప్రపంచ సంపన్నుల జాబితా 2019 వెల్లడించింది. ముకేశ్ తమ్ముడు అనిల్ అంబానీ మాత్రం తన నికర విలువలో 65 శాతాన్ని కోల్పోయినట్టు ఈ నివేదిక తెలిపింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఈ జాబితాలో వరుసగా రెండో ఏడాది మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 147 బిలియన్ డాలర్లు. ఇక హురూన్ ప్రపంచ సంపన్నుల జాబితాలో భారత్ ఐదో స్థానానికి జారినట్టు నివేదిక పేర్కొంది. రిలయన్స్ షేరు ఇటీవలి కాలంలో ర్యాలీ చేయడంతో మార్కెట్ విలువ పెరిగిన విషయం తెలిసిందే. కంపెనీలో ముకేశ్ అంబానీకి 52 శాతం వాటా ఉంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ.7.73 లక్షల కోట్ల దగ్గర ఉంది. మరోవైపు అనిల్ అంబానీ నెట్వర్త్ ఏడు సంవత్సరాల క్రితం 7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటే ఈ ఏడాది 1.9 బిలియన్ డాలర్లకు పడిపోయింది. రిలయన్స్ గ్రూపు వ్యాపారాలను సోదరులు ఇద్దరూ పంచుకున్న సమయంలో ఇరువురి కంపెనీల మార్కెట్ విలువ ఇంచుమించు ఒకే స్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. ‘‘కుటుంబ సంపదను విభజించిన తర్వాత ఇద్దరూ ఒకే స్థాయిలో ప్రయాణం ఆరంభించగా.. ముకేశ్ అంబానీ గడిచిన ఏడేళ్ల కాలంలో 30 బిలియన్ డాలర్ల మేర తన సంపదను పెంచుకున్నారు. కానీ, అనిల్ మాత్రం ఇదే కాలంలో 5 బిలియన్ డాలర్లను కోల్పోయారు’’ అని హరూన్ నివేదిక వివరించింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ 96 బిలియన్ డాలర్లు, బెర్క్షైర్ హాత్వే చైర్మన్ వారెన్ బఫెట్ 88 బిలియన్ డాలర్లు, ఎల్వీఎంహెచ్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ 84 బిలియన్ డాలర్లు, ఫేస్బుక్ జుకెర్బర్గ్ 80 బిలియన్ డాలర్లతో టాప్ 5లో ఉన్నారు. భారత్లో కుబేరులు... ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న భారత కుబేరుల్లో... తొలి స్థానంలో ముకేశుడు ఉండగా, హిందుజా గ్రూపు చైర్మన్ ఎస్పీ హిందుజా 21 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో ఉన్న విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ సంపద 17 బిలియన్ డాలర్లుగా ఉంది. పూనవాలా గ్రూపు (సెరమ్ ఇనిస్టిట్యూట్) చైర్మన్ సైరస్ ఎస్ పూనవాలా 13 బిలియన్ డాలర్ల సంపదతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన ప్రపంచంలోని టాప్–100 సంపన్నుల్లోకి చేరినట్టు హరూన్ జాబితా తెలిపింది. ఆర్సెలర్ మిట్టల్ అధిపతి లక్ష్మీ నివాస్ మిట్టల్ ఐదో స్థానంలో, కోటక్ మహింద్రా ఉదయ్ కోటక్ (11 బిలియన్ డాలర్లు), గౌతం అదానీ (9.9 బిలియన్ డాలర్లు), సన్ఫార్మా దిలీప్ సంఘ్వి(9.5 బిలియన్ డాలర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. సైరస్ పల్లోంజి మిస్త్రీ, షాపూర్జీ పల్లోంజీ మిస్త్రీ ఉభయుల సంపద 9.5 బిలియన్ డాలర్ల చొప్పున ఉండగా, ఇరువురు 9, 10వ స్థానాల్లో నిలిచారు. టాటాగ్రూపులో వీరికి 18.4 శాతం వాటా ఉండడం సంపద వృద్ధికి కలిసొచ్చింది. మహిళా‘మణు’లు గోద్రేజ్ కుటుంబంలో మూడో తరానికి చెందిన స్మితా కృష్ణ మహిళా బిలియనీర్లలో టాప్లో ఉన్నారు. ఆమె సంపద 6.1 బిలియన్ డాలర్లు. బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా 3.5 బిలియన్ డాలర్లతో హరూన్ జాబితా లో 671వ స్థానంలో ఉన్నారు. సొంతంగా సంపద సృష్టిం చుకున్న మహిళామణిగా ఆమెను హరూన్ పేర్కొంది. 5వ స్థానానికి జారిన భారత్ ‘‘2012 నుంచి చూస్తే భారత్ మొదటిసారిగా హరూన్ ప్రపంచ సంపన్నుల జాబితాలో ఐదో స్థానానికి దిగజారింది. రూపాయి బలహీనత, స్టాక్ మార్కెట్ కాంతిహీనంగా ఉండటం దీనికి కారణం’’ అని హరూన్ రిపోర్ట్ ఇండియా ఎండీ అనాస్ రెహ్మాన్ జునైద్ తెలిపారు. జీ గ్రూపు సుభాష్చంద్ర, సన్టీవీ కళానిధి మారన్లకు ఈ ఏడాది ప్రతికూల సంవత్సరమని, వీరిద్దరూ గణనీయంగా సంపద కోల్పోయారని పేర్కొంది. 2018తో పోలిస్తే ఈ ఏడాది జాబితాలో సంపన్నుల సంఖ్య 224 తగ్గి 2,470కు చేరింది. ఈ 2,470 మంది ఉమ్మడి సంపద విలువ 9.5 లక్షల కోట్ల డాలర్లు. ప్రపంచ జీడీపీలో 12%కి సమానం. -
సానియాకు అభినందనల వెల్లువ
సోమవారం విడుదల చేసిన మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్స్లో సానియా అధికారికంగా నంబర్వన్ ర్యాంక్ను హస్తగతం చేసుకోవడంతో వివిధ రంగాలకి చెందిన ప్రముఖులు ట్విట్టర్లో సానియాని అభినందించారు. ప్రపంచ మహిళల డబుల్స్ విభాగంలో నంబర్వన్ ర్యాంక్ సొంతం చేసుకొన్నందుకు అభినందనలు అంటూ మోదీ ట్వీట్ చేశారు. యువతరానికి సానియా విజయాలు ఆదర్శం అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొనియాడారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనందిబెన్ పటేల్, దేబేంద్ర ఫడ్నవీస్, మమతాబెనర్జీ, సినీ ప్రముఖులు నాగార్జున, రవీనాటాండన్ సోనూసూద్, సుశాంత్, ఫరాన్ అక్తర్, ఫరాఖాన్, క్రీడాకారులు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, సచిన్, లియాండర్ పేస్, రాజకీయ ప్రముఖులు కేటీఆర్, దిగ్విజయ్ సింగ్ లతో పాటు మరికొందరు ప్రముఖులు అభినందనలు తెలిపారు. An excellent accomplishment @MirzaSania! Congrats on being World Number 1 in doubles. — Narendra Modi (@narendramodi) April 12, 2015 Congratulations @MirzaSania on becoming World No. 1 in doubles tennis! Keep it up! — Anandiben Patel (@anandibenpatel) April 13, 2015 Stay focused RT @MirzaSania: @MamataOfficial thank you for ur wishes Madam
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement