breaking news
World Cup Archery Stage 4
-
భారత్కు రజత పతకం
మాడ్రిడ్: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–4 టోర్నమెంట్లో భారత జట్టుకు రజత పతకం దక్కింది. మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్), తానిపర్తి చికిత (తెలంగాణ), ప్రీతిక (మహారాష్ట్ర)తో కూడిన భారత జట్టు ఫైనల్లో పరాజయం పాలైంది. శనివారం జరిగిన తుది పోరులో ప్రపంచ మూడో ర్యాంక్ జ్యోతి–చికిత–ప్రీతిక త్రయం 228–232 పాయింట్ల తేడాతో ప్రపంచ 14వ ర్యాంక్ కొలంబియా జట్టు చేతిలో ఓడింది. కీలక సమయంలో స్టార్ ఆర్చర్ జ్యోతి సురేఖ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోవడంతో... భారత్ జట్టు రజతానికి పరిమితమైంది. ప్రీతిక ఆరుసార్లు పదేసి పాయింట్లు సాధించి జట్టును నడిపించగా.. జ్యోతి మూడుసార్లు మాత్రమే ‘పర్ఫెక్ట్–10’ సాధించింది. సీజన్ ప్రారంభ ఆర్చరీ వరల్డ్కప్ స్టేజ్–1 టోర్నీలో ఈ ముగ్గురితో కూడిన భాతర మహిళల కాంపౌండ్ జట్టు పసిడి పతకం గెలిచింది. ప్రీతిక డబుల్ ధమాకా... టీమ్ విభాగంలో రజతం దక్కించుకున్న భారత టీనేజ్ ఆర్చర్ ప్రీతిక... వ్యక్తిగత విభాగంలో సంచలన ప్రదర్శనతో పతకం సాధించింది. ప్రపంచ 11వ ర్యాంకర్ను ఓడించి కాంస్య పతకం ఖాతాలో వేసుకుంది. 17 ఏళ్ల ప్రీతికకు వరల్డ్కప్లో ఇదే తొలి వ్యక్తిగత పతకం. ఆదివారం కాంస్య పతక పోరులో ప్రీతిక 145–142 పాయింట్ల తేడాతో హజల్ బురున్ (టర్కీ)ను చిత్తుచేసింది. కాంపౌండ్ టీమ్ ఫైనల్లో భారత జట్టు పతకం గెలవడంలో కీలక పాత్ర పోషించిన ప్రీతిక... వ్యక్తిగత విభాగంలో అదే జోరు కొనసాగిస్తూ పోడియంపై నిలిచింది. కాంపౌండ్ విభాగంలో భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరగా... ఇక రికర్వ్ విభాగంలో మరో రెండు పతకాల కోసం ఆదివారం భారత ఆర్చర్లు పోటీపడనున్నారు. భారత నంబర్వన్, ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కృతి శర్మతో కలిసి నేడు బరిలోకి దిగనున్నాడు. రికర్వ్ మహిళల వ్యక్తిగత విభాగంలో ఫైనల్కు చేరలేకపోయిన కృతి... నేడు కాంస్య పతకం కోసం పోటీ పడనుంది. -
Archery World Cup Stage 1: భారత జట్లకు నిరాశ
అంటాల్యా (తుర్కియే): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత మహిళల, పురుషుల జట్లకు నిరాశ ఎదురైంది. మహిళల టీమ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, అదితి, అవ్నీత్ కౌర్లతో కూడిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. క్వాలిఫయింగ్లో టాప్ ర్యాంక్లో నిలిచిన భారత జట్టుకు నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడే అవకాశం లభించింది. మాడిసన్ కాక్స్, డానిలె లుట్జ్, కాసిడి కాక్స్లతో కూడిన అమెరికా జట్టు 233–225 పాయింట్ల తేడాతో భారత జట్టును ఓడించింది. ఓజస్ ప్రవీణ్ దేవ్తలె, రజత్ చౌహాన్, ప్రథమేశ్ సమాధాన్ జావ్కర్లతో కూడిన భారత పురుషుల కాంపౌండ్ జట్టు రెండో రౌండ్లో 234–236 పాయింట్ల తేడాతో చైనీస్ తైపీ జట్టు చేతిలో ఓడిపోయింది. -
టాప్-3లో భారత్
ఆర్చరీ ప్రపంచ ర్యాంకింగ్స్ కోల్కతా: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-4లో స్వర్ణం సాధించిన దీపిక కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణిలతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్లో నాలుగు స్థానాలు ఎగబాకింది. గతంలో ఏడో స్థానంలో ఉన్న టీమిండియా ప్రస్తుతం మూడో స్థానానికి చేరుకొని టాప్-3లో నిలిచింది. ఇదే టోర్నీలో రజతంతో సరిపెట్టుకున్న పురుషుల జట్టు నాలుగో ర్యాంక్కు చేరుకుంది. భారత్కు రజతం మరోవైపు చైనీస్ తైపీలో జరిగిన ఆసియా గ్రాండ్ ప్రి ఆర్చరీ పోటీల్లో భారత పురుషుల రికర్వ్ జట్టు రజతంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో సంజయ్ బోరో, ధనిరామ్, అతుల్ వర్మల బృందం 0-6తో కొరియా చేతిలో ఓటమి పాలైంది. క్వాలిఫయింగ్ రౌండ్లో ఆరో స్థానంలో నిలిచిన భారత్... ప్రిక్వార్టర్స్లో 6-2తో ఇరాన్పై; క్వార్టర్స్లో 5-1తో చైనీస్తైపీపై; సెమీస్లో 6-2తో జపాన్పై నెగ్గింది. ఈ పోటీలకు భారత ఆర్చరీ సంఘం ద్వితీయ శ్రేణి జట్టును పంపింది.


