-
మేస్త్రీ దాడిలో కార్మికురాలి మృతి
అచ్యుతాపురం (యలమంచిలి): జంగులూరులో అపార్ట్మెంట్ నిర్మాణ పనులు చేస్తున్న పూజారి రోజా (20) కేజీహెచ్లో వైద్యం పొందుతూ శుక్రవారం మృతి చెందినట్టు ఎస్ఐ లక్ష్మణరావు తెలిపారు. ఆయన అందించిన వివరాలిలా ఉన్నాయి. అరకుకి చెందిన రోజా రెండేళ్లక్రితం కూలిపని కోసం ఇక్కడికి వచ్చింది. నిర్మాణ పనులు చేస్తూనే అక్కడ మేస్త్రీగా పని చేస్తున్న శ్రీకాకుళం జిల్లా గారమండలం శ్రీకూర్మం మండలానికి చెందిన సురేష్తో పరిచయం పెంచుకుంది. మే 29న ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవటంతో ఘర్షణ పడ్డారు. ఆమె మొదటి అంతస్తునుంచి కిందపడడంతో తీవ్రంగా గాయపడింది. గాయపడ్డ రోజాను హుటాహుటిన కేజీహెచ్కి తరలించారు. ఆమె వైద్యం పొందుతూ శుక్రవారం మృతి చెందింది. తండ్రి లచ్చన్న ఇచ్చిన íఫిర్యాదు మేరకు సురేష్పై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. ఆమెను అత్యాచారయత్నం చేయడంలో ఇరువురి మధ్యతోపులాట జరిగిందని మేడపై నుంచి తోసేయడంతో గాయపడి చనిపోయినట్టు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. సీఐ విజయనాథ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. గిరిజన మహిళ కావడంతో అట్రాసిటీ కేసు నమోదు చేశామని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తారని ఆయన చెప్పారు. రోజా మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. -
గోడ కూలి ముగ్గురు కూలీల దుర్మరణం
-
గోడ కూలి ముగ్గురు కూలీల దుర్మరణం
వరంగల్: వరంగల్ శివారులోని ఎనమాముల గ్రామం వద్ద ఉన్న వేరుశెనగ మిల్లు గోడ కూలి ముగ్గురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం జరిగింది. మిల్లులో పనిచేస్తున్న కూలీలు ప్రహరీ గోడ వద్ద కూర్చుని ఉండగా గోడ ఒక్కసారిగా కూలిపోయింది. దాంతో కొమ్ము స్వరూప, ఎం.స్వరూప, ఉల్లి రేణుక అనే మహిళా కూలీలు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను 108లో ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతులందరూ ఎనమాముల గ్రామానికి చెందినవారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగనన్నను మళ్లీ సీఎం చేద్దాం
కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
4 రోజులు సిట్ కస్టడీ
కాల్చివేసిన మహిళ మృతదేహం గుర్తింపు
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
హడలెత్తిస్తున్న అగ్ని ప్రమాదాలు
పంటల బీమా వర్తించలేదని రైతుల నిరసన
లాభం చూపెట్టి రూ.కోట్లు కొల్లగొట్టారు
వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ఆశీర్వదించండి
హోసూరు వార్తలు..
తప్పక చదవండి
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
Advertisement