-
నాన్న చనిపోయాడని బాధతో..
సాక్షి, చైతన్యపురి: మానసిక స్థితి సరిగాలేని ఓ మహిళ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం. సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మన్మధకుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విజయవాడ, గాంధీనగర్కు చెందిన గుర్రం సురేష్కు, కరీంనగర్ జిల్లా, గండీరావుపేటకు చెందిన బ్యాంక్ ఉద్యోగి విజయకుమార్, శశికళ దంపతుల కుమార్తె శ్రీలేఖ (38)తో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ధీరజ్(11). సురేష్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా ఉద్యోగం చేసేవాడు. కుమారుడికి సెలవులు ఇవ్వటంతో ఈనెల 1న కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చిన వీరు కొత్తపేట హుడా కాలనీలోని వైశ్యాస్ అపార్టుమెంట్లోని మూడో అంతస్తులో ఉన్న శ్రీలేఖ తండ్రికి చెందిన ఫ్లాట్లో ఉంటున్నారు. మంగళవారం తాను పనిచేసే కంపెనీ కార్యాలయానికి వెళ్లిన సురేష్ అర్ధరాత్రి ఇంటికి వచ్చి నిద్రపోయాడు. ఉదయం వాచ్మన్ వచ్చి శ్రీలేఖ భవనం పైనుంచి పడి చనిపోయిందని తెలిపాడు. మూడవ అంతస్తు నుంచి దూకడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ మన్మధకుమార్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మానసిక స్థితి సరిగాలేకనే... నాలుగేళ్ల క్రితం తండ్రి చనిపోవటంతో శ్రీలేఖ డిప్రెషన్తో బాధపడుతోందని, మతిమరుపు, మానసిక ఆందోళనకు గురైందని మృతురాలి భర్త సురేష్ పోలీసులకు తెలిపాడు. అమెరికాలోనూ చనిపోతాననిని బీచ్కు వెళ్లేదని, ఎవరో వస్తున్నారు...ఏదో చేస్తారనే ఆందోళనతో ఉండేదన్నాడు. కొంత కాలంగా చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపాడు. శ్రీలేఖ తల్లి ప్రస్తుతం అమెరికాలోని మరో కుమార్తె వద్ద ఉందని, మంగళవారం కూడా తల్లితో శ్రీలేఖ ఫోన్లో మాట్లాడినట్లు తెలిపాడు. మానసిక స్థితి సరిగాలేకనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
వివాహిత ఆత్మహత్య
కవిటి: తలగానపుట్టుగకు చెందిన కాళ్ల సుజాత(33) మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కవిటి పోలీ సులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య నెలకొన్న మాటపట్టింపులు, భర్త చెడు తిరుగులకు అలవాటు పడడం, భార్య ను పట్టించుకోకపోవడం తదితర కారణాల నేపథ్యంలో మనస్తాపానికి గురై భార్య సుజా త ఆత్మహత్యకు పాల్పడింది. కాళ్ల కృష్ణారావుతో సుజాతకు పదేళ్ల క్రితం వివాహం అయిం ది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతురాలి సోదరుడు కోరాడ షణ్ముఖరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ పారినాయుడు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మరణంపై అనుమానాలు తన సోదరికి వివాహం జరిగిన నుంచి భర్త కృష్ణారావుతో తరచూ చిన్నచిన్న ఘర్షణలు వచ్చేవని షణ్ముఖరావు పోలీసు స్టేషన్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. అయితే ఈ మృతికి ఘర్షణలే కారణమా లేక ఇతర కారణాలు ఉన్నాయన్న విషయం సందేహాస్పదంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే బాధను తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చన్న అనుమానాల్ని ఫిర్యాదుదారుడు షణ్ముఖరావు, ఆమె బంధువులు వ్యక్తం చేశారు. పోలీసులు లోతుగా పరిశీలించి తన సోదరి మృతికి కారణాలు అన్వేషించి ఆమె పిల్లలు ఇద్దరికీ న్యాయం చేయాలని కోరుతున్నారు. -
వడ్డీ వ్యాపారి వేధింపులు: మహిళ ఆత్మహత్య
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని జేఎస్ఎన్ కాలనీకి చెందిన కనకదుర్గ(43) అనే మహిళ వడ్డీవ్యాపారుల వేధింపులకు తాళలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంచిలి మండలానికి చెందిన వెంకట లక్ష్మీ అనే వడ్డీ వ్యాపారి వద్ద ఇంటి పత్రాలు కుదువపెట్టి రూ. 5 లక్షల అప్పు తీసుకుంది. ఇప్పటి దాకా రూ. 7 లక్షల రూపాయల దాకా అసలు, వడ్డీ చెల్లించినా వడ్డీ వ్యాపారులు పత్రాలు ఇవ్వకపోగా ఇంకా డబ్బు కట్టాలని వేధించడంతో మనస్థాపానికి గురైన కనకదుర్గ బుధవారం ఉదయం బాత్రూమ్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా అప్పటితే మృతి చెందింది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement