బస్టాండ్లో పర్సు లాక్కెళ్లారు..
ప్రకాశం : బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళ చేతిలోనుంచి పర్సు లాక్కొని పోయిన సంఘటన ప్రకాశం జిల్లా చీరాల బస్స్టాండ్లో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కుంతలమర్రికి చెందిన జ్యోతి అనే మహిళ చీరాల వెళ్లింది.
సోమవారం ఆమె తిరిగి ఇంటికి బయలుదేరడానికి బస్స్టాండ్లో నిల్చున్న సమయంలో ఓ దుండగుడు ఆమె చేతిలోనుంచి పర్సు లాక్కొని పారిపోయాడు. వెంటనే ఆమె వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. పర్సులో నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలతో పాటు ఒక సెల్ఫోన్ ఉన్నట్లు తన ఫిర్యాదులో పేర్కొంది.