breaking news
wife lover
-
పట్టపగలే భార్య ప్రియుడి హత్య, భార్యకు వార్నింగ్,షాకింగ్ వీడియో
ప్రస్తుత సమాజంలో భార్యను భర్త, భర్తను భార్య నిర్దాక్షిణ్యంగా హత్య చేయడం పరిపాటిగా మారిపోయింది. స్వల్ప విషయాలకు , చట్టపరంగా తేల్చుకోవాల్సిన విషయాలకు మనుషుల ఉసురు తీయడం సునాయాసంగా జరిగిపోతోంది. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో అలాంటి దారుణం ఒకటి వెలుగు చేసింది.పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పట్టపగలే, నలుగురూ చూస్తుండగానే అతిదారుణంగా ఒక వ్యక్తి తన భార్య ప్రియుడిని కాల్చి చంపేశాడు. బుధవారం మధ్యాహ్నం మీరట్-ముజఫర్నగర్ జిల్లా సరిహద్దు సమీపంలో ఉన్న సందడిగా ఉండే మార్కెట్లో చోటుచేసుకుంది. బాధితుడిని 28 ఏళ్ల సురేంద్ర (సునీల్)గా గుర్తించారు.In a chilling daylight killing in Meerut's Ramraj market, Pradeep Dhiman allegedly shot dead Sunil Gaba — his wife Poonam's lover — with multiple bullets (reports cite 3 shots from different bores: .12, .32 & .315) yesterday. Poonam had eloped with Gaba ~1.5 years ago, leaving… pic.twitter.com/AkhR2gKCSo— Megh Updates 🚨™ (@MeghUpdates) February 26, 2026 ఈ దారుణానికి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాంరాజ్లోని జగ్జీవన్ పురి ప్రాంతంలో నివసిస్తున్న సురేంద్ర తన మోటార్సైకిల్పై మార్కెట్ గుండా వెళుతుండగా దాడి జరిగింది వెనుక నుండి వచ్చిన ప్రదీప్, నడుము దిగువ భాగంలో తొలికాల్పులు జరిపాడు. అనంతరం నిందితుడిపై అతి సమీపంనుంచి కాల్పులు జరిపాడు. అడ్డు వచ్చిన వారిపై కూడా బెదిరింపులకు పాల్పడటం తీవ్ర దిగ్బ్రాంతి రేపింది. దీంతో తీవ్ర భయాందోళనలతో దుకాణదారులు , విక్రేతలు మార్కెట్ నుంచి పారిపోయారు .ఇదీ చదవండి: ViRosh అచ్చమైన దేవతలా ఆమె, ఆభరణాలతో కొత్త ట్రెండ్పాత పగలే దీనికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సుమారు 18 నెలల క్రితం, ప్రదీప్ భార్య పూనం ఇద్దరు చిన్నపిల్లల్ని వదిలేసి సురేంద్రతో పారిపోయింది.అప్పటినుంచీ కలిసే ఉంటున్న వీరు కోర్టు ద్వారా వారి సంబంధాన్ని అధికారికం చేసుకోవాలని యోచిస్తున్నారని సమాచారం. ఈ వ్యవహారంలో ప్రదీప్, సుధీర్ గతంలో బహిరంగ ఘర్షణకు దిగారు. దీంతో ఆగ్రహం పెంచుకున్న ప్రదీప్ ఈ హత్యకి పాల్పడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.ఇదీ చదవండి: తొమ్మిదేళ్లకు గుర్తొచ్చి గొల్లుమన్న భార్య, మరి భర్త పరిస్థితి ఏంటో?కాల్పుల తర్వాత, ప్రదీప్ నాలుగు నిమిషాల వీడియోను రికార్డ్ చేశాడు. ఈ హత్యకు తానే బాధ్యుడునని ఒప్పుకున్నాడు. నెక్ట్స్ టార్గెట్ నువ్వే అంటూ మాజీ భార్యకు కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. అంతేకాదు 18 నెలలనుంచి తన మాటను పోలీసులు పట్టించుకోలేంటూ ఈ వీడియోను సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP)తో పంచుకోవాలని కోరాడు. మరో వైరల్ వీడియోలో నిందితుడి చుట్టూ అధికారులుండగానే ఎలాంటి పశ్చాత్తాపం లేని ప్రదీప్, ప్రశాంతంగా బీడీ వెలిగించి పొగ త్రాగుతున్నట్లు కనిపించాడు.బాధితుడి కుటుంబం ఫిర్యాదు ఆధారంగా, నిందితుడు ప్రదీప్ను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. ఎలాంటి ఘర్షణలు చెలరేగ కుండా ముందస్తు జాగ్రత్తగా అదనపు బలగాలను మోహరించారు. ప్రస్తుతం చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. -
ప్రియుడితో భర్తను చంపించి.. చావుకేక ఫోన్లో వింది!
ఏడాది క్రితమే ఆమెకు పెళ్లయింది. కానీ అంతకంటే చాలా ముందు నుంచే ఒక ప్రియుడున్నాడు. తన కంటే ఆరేళ్లు పెద్దవాడైన భర్తకు బదులు రెండేళ్లు చిన్నవాడైన ప్రియుడితో కలిసి ఉండటమే ఆమెకు నచ్చింది. అందుకే అతడితో కలిసి భర్తను హతమార్చేందుకు ప్లాన్ చేసింది. సమయానికి తాను ఇంట్లో ఉండే అవకాశం లేకపోవడంతో.. భర్త చావుకేకలను ఫోన్లో విని సంతోషించింది. మనువా మజుందార్ (28) అనే ఆ మహిళ పశ్చిమబెంగాల్లోని బరసాత్ మునిసిపాలిటీలో క్యాజువల్ వర్కర్గా పనిచేస్తోంది. ఆమె భర్త అనుపమ్ సిన్హా (34) ఒక ట్రావెల్ ఏజెన్సీలో మేనేజర్. కానీ, అజిత్ రాయ్ (26) ఆమెకు కాలేజి రోజుల నుంచి తెలుసు. అతడితో కలిసి ఉండాలని నిర్ణయించుకుని, భర్త హత్యకు పక్కాగా ప్లాన్ చేసింది. అనుపమ్ ఉండే ఫ్లాట్లోకి ముందుగానే మనువా ఇచ్చిన తాళాలతో చేరుకున్న అజిత్.. అతడు లోపలకు రాగానే ఒక ఇనుప రాడ్తో తలమీద కొట్టాడు. ఆ తర్వాత అదే రాడ్ను అతడి గొంతులోకి పోనిచ్చి, మనువాకు ఫోన్ చేశాడు. చావు భయంతో అతడు పెడుతున్న కేకలను విన్న మనువా.. మిగిలిన పని కూడా కానించేయమని ప్రియుడికి చెప్పింది. దాంతో అతడు మెదడులో నరాలను కత్తితో కోసి మరీ దారుణాతి దారుణంగా అనుపమ్ సిన్హాను హతమార్చాడు. అనుపమ్ మరణించాక, అపార్టుమెంటు అంతటినీ అజిత్ శుభ్రం చేశాడు. తర్వాతిరోజు గంగానదిలో స్నానం చేసి, రక్తంతో తడిసిన తన దుస్తులను, అనుపమ్ సెల్ఫోన్ను నదిలోకి విసిరేశాడు. తాము ఇలాంటి హత్యలు చాలా చూశాం గానీ, ఇది మాత్రం తమకు పెద్ద షాకని పోలీసులు చెప్పారు. హత్య జరిగిన రెండు వారాల తర్వాత ప్రేయసీ ప్రియులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. కావాలంటే ఆమె విడాకులు తీసుకుని తన ప్రియుడిని పెళ్లి చేసుకుని ఉండచ్చు గానీ, భర్తను అంత క్రూరంగా చంపించడం ఎందుకని పొరుగున ఉండే రాత్రి రాయ్ అనే మహిళ ప్రశ్నించారు. తన భార్య ప్రేమ విషయం అనుపమ్కు తెలిసిందని, ఆమెను తాను పెళ్లి చేసుకుని ఉండాల్సింది కాదంటూ తరచు వాపోయేవాడని అనుపమ్ సహోద్యోగి అభిషేక్ చటర్జీ అన్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా మనువా మాత్రం చాలా కూల్గా ఉండటం అందరినీ షాక్కు గురిచేసింది. -
భార్య, ఆమె ప్రియుడ్ని చితకబాదేశాడు..
ఓ యువకుడు తన భార్యను చూడకూడని స్థితిలో చూశాడు. అంతే ఆవేశం కట్టలు తెంచుకుంది. భార్యను, ఆమె ప్రియుడ్ని పట్టుకుని ఇంట్లోనే వరండాలో రెండు స్తంభాలకు వేర్వేరుగా తాడుతో కట్టేశాడు. అతను కట్టె, తాడు తీసుకుని ఇద్దరిని చితకబాదాడు. పిల్లలు, చుట్టుపక్కల వాళ్లు చూస్తుండగానే అతను ఆవేశంతో పలుమార్లు కొట్టాడు. దెబ్బల నుంచి తప్పించుకునేందుకు స్తంభం చుట్టు తిరిగినా అతను వెంటబడి కొట్టాడు. ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న వివరాలు కచ్చితంగా తెలియవు. అయితే బిహార్ రాష్ట్రంలో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఆమె చీర కట్టుకుని భారత సంప్రదాయ దుస్తుల్లో ఉండగా, ఆమె ప్రియుడు ఫ్యాంట్, టీ షర్ట్ ధరించి ఉన్నాడు. ఈ దృశ్యాలను ఎవరు వీడియో తీశారో తెలియదు కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. ఇదో చర్చనీయాంశంగా మారింది. కొంతమంది బాధిత భర్తకు మద్దతు తెలపగా, మరికొందరు గృహహింస కింద అతణ్ని శిక్షించాలని డిమాండ్ చేశారు. కుటుంబం పరువు కోసమే భర్త.. తన భార్య, ఆమె ప్రియుడ్ని కొట్టాడని, దీన్ని గృహహింసగా పరిగణించరాదని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా అతని హింసాత్మక చర్యలను ఎలా సమర్థిస్తారంటూ మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.


