-
కాళేశ్వర గంగ వచ్చేసింది..
మంథని: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం గంగా జలాలు పెద్దపల్లి జిల్లా మంథనిని తాకాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదారమ్మ ఎదురుగా పారుతూ.. బుధవారం సాయంకాలం నాటికి మంథని మండలశివారు ప్రాంతమైన గోదావరిలో బొక్కలవాగు కలిసే ప్రాంతం దాటింది. మంథని నియోజకవర్గంలోని కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి చేరిన నీటిని సుందిళ్లకు రివర్స్ పంపింగ్ చేస్తున్నారు. అన్నారం బ్యారేజీ సామర్థ్యం 10.52 టీఎంసీలు కాగా.. ఇప్పటికే 2.5 టీఎంసీల నీరుచేరింది. కన్నెపల్లి వద్ద నాలుగో పంపును ప్రారంభించడంతో ప్రవాహం మరింత పెరిగే అవకాశముంది. ఏడు టీఎంసీల నీరు అన్నారం బ్యారేజీకి చేరితే సుందిళ్ల పంపుహౌస్కు వస్తుందని నీటిపారుదల అధికారులు చెబుతున్నారు. గౌతమేశ్వర తీరమైన మంథనికి కాళేశ్వర గోదావరమ్మ చేరుతున్న క్రమంలో స్వాగత పూజలు నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమధు పూజలు నిర్వహించనున్నారు. ఇన్నాళ్లు ఎడారిని తలపించి తొలి ఏకాదశికి ఒక రోజు ముందే గోదారమ్మ మంథనికి చేరుకోవడంతో భక్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. -
నేడు రాజయ్య రాక
టీఆర్ఎస్ శ్రేణుల స్వాగత సన్నాహాలు - పెంబర్తి నుంచి ర్యాలీ..అమరుల స్థూపాలకు నివాళి - హన్మకొండలో పార్టీ కార్యకర్తలతో సమావేశం - రేపు అధికారులతో వివిధ శాఖలపై సమీక్ష వరంగల్: డిప్యూటీ సీఎంగా నియామకమైన తర్వాత డాక్టర్ రాజయ్య తొలిసారి ఆదివారం జిల్లాకు వస్తున్నారు. ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నా రు. రాజయ్య హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి 10గంటలకు పెంబర్తికి వస్తారు. అక్కడి నుంచి జనగామ, రఘునాథపల్లి మీదుగా సొంత నియోజకవర్గ కేంద్రమైన స్టేషన్ఘన్పూర్ చేరుకుంటారు. అక్కడ స్థానిక కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం 4గంటలకు కాజీపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి సాయంత్రం 5గంటలకు కలెక్టరేట్, అదాలత్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపాలకు నివాళులు అర్పిస్తారు. అదేవిధంగా బాలసముద్రం లోని జయశంకర్ విగ్రహానికు పూలమాల వేస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారని టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు నరేందర్ తెలిపారు. రాజయ్య సోమవారం జిల్లా అధికారికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. రాజయ్యపైనే భారం రాజయ్య డిప్యూటీ సీఎం కావడంతో జిల్లా టీఆర్ఎస్ రాజకీయూల్లో కీలకంగా మారారు. రాష్ట్ర మంత్రివర్గంలో సైతం ఇప్పటి వరకు ఆయనకొక్కడికే అవకాశం దక్కింది. జిల్లా నుంచి సీనియర్ నాయకులు చందూలాల్, వినయభాస్కర్, కొండా సురేఖ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ప్రస్తుతానికి బెర్త్ దక్కలేదు. ఇక స్పీకర్గా భూపాలపల్లి ఎమ్మెల్యే మధుసూదనాచారికి అవకాశం కల్పించినప్పటికీ ఆయనకు పరిమితులు నెలకొన్నాయి. ఈ దశలో ప్రస్తుతానికి రాజకీయూల్లో రాజయ్యదే ఆధిపత్యంగా చెప్పవచ్చు. కలిసిసాగడం పరీక్షే.. గులాబీ పార్టీ నేతలను, జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎలా కలుపుకుపోతారన్న అంశం పార్టీ లో చర్చనీయాంశంగా మారింది. నిర్మాణపరంగా పార్టీ అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. ఎన్నికల ముందు లోటుపాట్లు బహిర్గతం కానప్పటికీ పార్టీని జిల్లాలో క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడం ఇప్పుడు ప్రధానం కానున్నది. ఎన్నికల ముందున్న విభేదాలు పక్కనపెట్టి జిల్లా ప్రజాప్రతినిధులను ఒక్కతాటిపై నడపాల్పి ఉంటుంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధిగా జిల్లాను వివిధ రంగాల్లో ప్రగతిబా ట పట్టించాల్సి ఉంది. ముఖ్యంగా జిల్లా ప్రజలు పె ట్టుకున్న కోటి ఆశలను నిజం చేసే బాధ్యత ఆయన భుజస్కందాలపై ఉంది. జిల్లాలో విపక్ష ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నారు. వీరి నుంచి రాజకీయ విమర్శలను ఎదుర్కొవడం అంతసులువైంది కాదు. పార్టీని, ప్రభుత్వాన్ని జోడెడ్లబండిగా నడపడం ఇప్పుడు రాజయ్యకు సవాల్గా మారనున్నది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement