-
ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో నైట్ వాచ్ మన్లు..
-
అగ్ని ప్రమాదంలో వృద్ధుడి సజీవ దహనం
హనుమాన్ జంక్షన్ రూరల్, న్యూస్లైన్ : ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో ఓ వృద్ధుడు సజీవ దహనమైన ఘటన బాపులపాడు మండలం కానుమోలు గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. తలుపుల రామకోటయ్య (85) పాఠశాలలో వాచ్మెన్గా చేసి రిటైరయ్యారు. కుటుంబ సభ్యులుండే ఇంటికి సమీపంలో రేకుల షెడ్డు గదిలో ఒంటరిగా విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో చుట్ట వెలిగించుకోబోతుండగా, ప్రమాదవశాత్తు అగ్గిపుల్ల మంచంపైన పడి, దుప్పటికి, మంచానికి ఉన్న ప్లాస్టిక్ వైరుకు మంటలు అంటుకున్నాయి. కదలలేని స్థితిలో ఉన్న కోటయ్య మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. స్థానికులు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసే లోగానే అగ్నికి ఆహుతైపోయాడు. హనుమాన్ జంక్షన్ సీఐ వైవీ రమణ, ట్రైనీ డీఎస్పీ అనిల్కుమార్, పోలీస్ సిబ్బంది సంఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఘటనా స్థలంలోనే వైద్యులు పోస్టుమార్టం నిర ్వహించారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
వాచ్మన్ దారుణహత్య
హైదరాబాద్, న్యూస్లైన్ : శ్రీనగర్కాలనీలోని ఓ కళాశాలలో వాచ్మన్ దారుణహత్యకు గురయ్యాడు. గొంతుకోసి, తల పగులగొట్టి దుండగులు అతడిని అతికిరాతంగా చంపేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా దుబ్బాక మండలానికి చెందిన మోతి రాజిరెడ్డి (55) శ్రీనగర్కాలనీ లోని నారాయణ కాలేజీలో పది నెలలుగా వాచ్మన్గా పని చేస్తున్నాడు. ఇతని భార్య అనారోగ్యంతో మృతి చెందింది. రాజిరెడ్డికి ముగ్గురు కొడుకులున్నారు. ఇదిలా ఉండగా.. శ్రీనగర్కాలనీ ప్రధాన రహదారిలో నర్సింహారెడ్డి అనే వ్యక్తికి ఐదంతస్తుల భవనం ఉంది. ఇందులో నా లుగు అంతస్తులు నారాయణ కాలేజీకి అద్దె కు ఇవ్వగా... 5వ అంతస్తులో ఇంటి యజమాని ఉంటున్నాడు. వాచ్మన్ రాజిరెడ్డి పగటిపూట సెల్లార్లోని ఓ గదిలో ఉంటూ.. రాత్రి కాలేజీ మొదటి అంతస్తులోని కార్యాలయంలో పడుకుంటాడు. రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి కళాశాల కార్యాలయంలో నిద్రపోయాడు. సో మవారం ఉదయం 7 గంటలకు స్వీపర్ రమాదేవి 2వ అంతస్తులోని క్లాస్రూంను ఊడ్చేందు కు వెళ్లగా రాజిరెడ్డి రక్తపు మడుగులో హత్యకు గురై ఉన్నాడు. భయాందోళనకు గురైన ఆమె వెంటనే కిందకు వచ్చి ఆఫీస్ బాయ్ అమర్కు చెప్పింది. అతడి ద్వారా విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ రవిశంకర్ పంజగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీసీపీ సత్యనారాయణ, అడిషనల్ డీసీపీ నాగరాజు, ఏసీపీ వెంకటనర్సయ్య, ఇన్స్పెక్టర్ తిరుపతిరావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కళాశాల కార్యాలయంలోని రూ.48 వేలు, 2 కంప్యూటర్ సీపీయూలు, ప్రింటర్ మాయమైనట్టు గుర్తించారు. కాలేజీలోని నగదు, సీపీయూలు మాయం కావడం తో రాజిరెడ్డిని చంపి దొంగలు వాటిని తీసుకెళ్లారా ? లేక మరేదైనా కారణం ఉందా? మొద టి అంతస్తులో పడుకున్న రాజిరెడ్డి 2వ అంతస్తులోని క్లాస్ రూంలో ఎలా హత్యకు గురయ్యాడు అనే కోణాల్లో దర్యాప్తుచేస్తున్నారు. భవన యజమాని కుమారుడు బాల్రెడ్డి నిత్యం మద్యం తాగివచ్చి వాచ్మన్ రాజిరెడ్డితో గొడవపడేవాడని తెలిసి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే కళాశాలలో వాచ్మచ్గా పని చేసి మానేసిన కృష్ణతో పాటు కళాశాల ఫిజిక్స్ లెక్చరర్ భీముడు, ఆఫీస్బాయ్ అమర్ను కూడా విచారిస్తున్నారు. తెలిసిన వారే వాచ్మన్ను హత్య చేశారని, రెం డు రోజుల్లో నిందితులను అరెస్టు చేస్తామని డీసీపీ సత్యనారాయణ తెలిపారు. ఇద్దరు లేదా ముగ్గురు హత్యలో పాల్గొని ఉంటారని పోలీ సులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆందోళన : తన తండ్రి దారుణ హత్యకు గురైతే కళాశాల యాజమాన్యం వచ్చి కనీసం చూడలేదని, తమ కు న్యాయం చేసే వరకూ మృతదేహాన్ని తరలించడానికి వీలులేదని మృతుడి బంధువులు కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో భారీ సంఖ్యలో చేరుకున్న పోలీసులు వారిని పక్కకు నెట్టేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలిం చారు. బాధితులు ప్రధాన రహదారిపై ఆందోళన చేయగా స్వల్పంగా లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. తండ్రి చనిపోయిన బాధలో ఉన్న తమ పై పోలీసులు దౌర్జన్యం చేయడం సరికాదని రాజిరెడ్డి కుమారులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రజినీకాంత్ టీజర్పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement