-
బాలీవుడ్ నటి అమిషా పటెల్పై అరెస్ట్ వారెంట్
బాలీవుడ్ బ్యూటీ అమిషా పటెల్పై రాంచి సివిల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చెక్ బౌన్స్ కింద ఆమెపై 420, 120 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో అమిషా, అమె బిజినెస్ పార్ట్నర్ క్రునాల్కు వ్యతిరేకంగా సివిల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. వివరాలు.. అమీషా పటేల్కు చెందిన ‘దేశీ మ్యాజిక్’ చిత్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్గా రాంచీ జిల్లాలోని హర్ము ప్రాంత నివాసి అజయ్ కుమార్ సింగ్ను ఆమె సంప్రదించింది. చదవండి: యూట్యూబ్ను షేక్ చేస్తున్న ‘పుష్ప 2’ టీజర్.. హిందీలోనే ఎక్కువ వ్యూస్.. దీంతో అజయ్ కుమార్ రూ.2.5కోట్లను అమీషా ఖాతాకు బదిలీ చేశాడు. మేకింగ్తో పాటు ప్రచార కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలని ఆయన అమిషాను కోరాడు. ఈ ఒప్పందం ప్రకారం ఆమె 2013లో ప్రాజెక్టును పట్టాలెక్కించింది. సినిమా షూటింగ్ను మాత్రం పూర్తి చేయలేదు. ఫలితంగా అజయ్ డబ్బును వెనక్కి ఇవ్వాలని నటిని పలు మార్లు కోరాడు. అక్టోబర్ 2018లో అమీషా రూ.2.5కోట్లకు ఒకటి, రూ.50లక్షలకు మరో చెక్ను ఇచ్చింది. చదవండి: ‘మీటర్’ మూవీ ఓటీటీ పార్ట్నర్ ఇదే! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే కానీ, ఆ చెక్స్ బౌన్స్ అయ్యాయి. దీంతో అజయ్ సింగ్ ఆమెపై రాంచీ సివిల్ కోర్టులో అమిషా, ఆమె బిజినెస్ పార్ట్నర్ క్రునాల్పై కేసు నమోదు చేశాడు. ఈ క్రమంలో తాజాగా ఈ కేసు విచారణకు అమిషా హజరు కాగా ఆమె తరపు న్యాయవాది మాత్రం కోర్టుకు ముందు హాజరు కాలేదు. దీంతో కోర్టు ఈ కేసు విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. అలాగే గతంలో రూ. 32.25 లక్షల చెక్ బౌన్స్ కేసులో భోపాల్ కోర్టు అమిషాకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. -
కోర్టు ధిక్కరణ? నిర్మాత ఎక్తాకపూర్, ఆమె తల్లికి బిహార్ కోర్టు షాక్!
బాలీవుడ్ దర్శక-నిర్మాత ఎక్తాకపూర్, ఆమె తల్లి శోభ కపూర్పై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు వారిపై బిహార్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. వివరాలు.. ఎక్తా కపూర్ నిర్మించిన ట్రిపుల్ ఎక్స్-సీజన్ 2 వెబ్ సిరీస్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిటైర్ట్ సర్విస్మ్యాన్ శంబు కుమార్ 2020లో బీహార్ కోర్టులో పటిషన్ దాఖలు చేశారు. ఆ సిరీస్లో జవాన్ల భార్యలను అవమానపరిచారని, వారిని ఉద్దేశిస్తూ ఉన్న పలు సీన్స్ వారి కుటంబాలను కించపరిచే విధంగా ఉన్నాయని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. శంబు కుమార్ ఫిర్యాదు మేరకు ఎక్తాకపూర్, ఆమె తల్లి శోభ కపూర్లకు కోర్టు నోటీసులు ఇచ్చింది. చదవండి: మిస్ యూ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలి..: సితార ఎమోషనల్ పోస్ట్ అంతేకాదు ఈ విషయమై వారు కోర్టులో హాజరు కావాలని కూడా ఆదేశించింది. అయితే సిరీస్లో అభ్యంతరకరంగా ఉన్న సన్నివేశాలు తొలగించినప్పటికి, వారు కోర్టు ఆదేశాలని ధిక్కరించారని, నోటిసులు అందిన ఎక్తా కపూర్, ఆమె తల్లి కోర్టుకు హాజరు కాకుండా బాధ్యత రహితంగా వ్యవహరించారని శంబు కుమార్ తరపు న్యాయవాది హ్రిషికేశ్ పతక్ తెలిపారు. దీంతో వారిపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యిందని ఆయన వెల్లడించారు. కాగా 2020లో ఎక్తా కపూర్ దర్శకత్వం వహించిన ట్రిపుల్ ఎక్స్-సీజన్ 2 వెబ్ సిరీస్ను తన సొంత ఓటీటీ సంస్థ ఎఎల్టీబాలజీ (బాలజీ టెలిఫిలింస్ లిమిటెడ్) వేదికగా రిలీజ్ చేశారు. అయితే ఈ ఓటీటీ సంస్థ వ్యవహారాలను ఆమె తల్లి శోభ కపూర్ కూడా చూసుకుంటారు. -
అరెస్ట్ వారెంట్పై స్పందించిన జీవితా రాజశేఖర్
సినీ నటి, దర్శకురాలు జీవితపై నగరి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. జీవిత, రాజశేఖర్ దంపతులు గరుడవేగ సినిమా కోసం తమ నుంచి రూ. 26 కోట్ల అప్పు తీసుకుని ఎగవేతకు పాల్పడినట్టు జోష్టర్ ఫిలిం సర్వీసెస్ యాజమాన్యం తీవ్ర ఆరోపణలు చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. తాజాగా ఈ ఆరోపణలపై జీవిత వివరణ ఇచ్చారు. శనివారం జరిగిన శేఖర్ మూవీ ప్రెస్మీట్లో ఆమె మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. ఈ మేరకు జీవిత.. తనకు సమన్లు వచ్చిన విషయం నిజమే అన్నారు. కానీ తాను అరెస్ట్ కాలేదన్నారు. రెండు నెలలకుపైగా నగరి కోర్టులో ఈ కేసు నడుస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఇప్పుడు వారు మీడియా ముందుకు ఎందుకు వచ్చారో తెలియదని, ఇంతకు ముందు కూడా తనపై వారెంట్ వచ్చిందని చెప్పారు. అయితే ఆ కేసు తానే గెలిచినట్లు జీవిత తెలిపారు. రూ. 26 కోట్లు మోసం చేశారని జోష్టర్ ఫిలిం సర్వీసెస్ అధినేత కోటేశ్వర్రావు అంటున్నారని, అవి ఏ కోట్లో అర్థం కావడం లేదన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, అవన్ని తప్పుడు ఆరోపణలని ఆమె స్పష్టం చేశారు. అలాగే కోటేశ్వరావు వల్ల తమ మేనేజర్లు ఇబ్బంది పడ్డారని జీవిత ఆరోపించారు. -
Jeevitha Rajasekhar: సినీ నటి జీవితకు అరెస్ట్ వారెంట్
నగరి: సినీ నటి, దర్శకురాలు జీవితకు నగరి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్పై జీవిత రీకాల్ పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ పెండింగ్లో ఉంది. జీవిత ప్రత్యక్షంగా కోర్టుకు రావా ల్సిందేనంటూ ప్రత్యర్థి న్యాయవాది మురళీధర్ దాఖలు చేసిన పిటిషన్పై వచ్చే నెల 8న విచారణ జరగనుంది. తిరుపతి జిల్లా విజయపురం మండలానికి చెందిన సాయిశక్తి ఇంజనీరింగ్ కళాశాల నిర్వాహకుడు కోటీశ్వరరాజు భార్య హేమరాజ గరుడవేగ చిత్ర నిర్మాణం కోసం జీవితకు రెండుదఫాలుగా రూ.26 కోట్లు ఇచ్చారు. దీనికి గాను చెన్నై పూనమల్లి వద్ద ఉన్న మూడెకరాల స్థలాన్ని తాకట్టు ఉంచడంతోపాటు చెక్కులు ఇచ్చారు. తాకట్టు ఉంచిన స్థలాన్ని జీవిత మరొకరికి అమ్మేశారు. ఆ స్థలం కొనుగోలు చేసిన వారు స్థలంలో పనులు మొదలుపెట్టిన విషయం హేమ రాజకు తెలిసింది. ఈ విషయమై ఆమె జీవితను ప్రశ్నించగా మంచి ధర రావడంతో అమ్మేశానని, డబ్బును సెటిల్ చేస్తానని చెప్పి ఆ మొత్తాన్ని చెల్లించలేదు. జీవిత ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవడంతో నగరి కోర్టులో రూ.13 కోట్లకు, తిరువళ్లూరు కోర్టులో రూ.13 కోట్లకు హేమరాజ కేసు వేశారు. నగరి కోర్టు నుంచి జారీ అయిన 4 వారెంట్లకు హాజరు కాకపోవడంతో ఎన్ఐ యాక్ట్ కింద కోర్టు రెండు నెలల క్రితం అరెస్ట్ వారెంట్ జారీచేసినట్లు సీఐ మద్దయ్య ఆచారి తెలిపారు. ఈ వారెంట్పై ఆమె రీకాల్ పిటిషన్ దాఖలు చేశారు. చదవండి: (ఏది నిజం?: విద్యుత్ వెలుగులపై చీకటి రాతలు) -
కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్పై అరెస్ట్ వారెంట్
సాక్షి, కోలకతా : కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్పై అరెస్ట్ వారెంట్జారీ అయింది. గత ఏడాది (2018, జులై) జరిగిన కార్యక్రమంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కోల్కతా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 'హిందూ పాకిస్తాన్' అంటూ శశి థరూర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తిరువనంతపురానికి చెందిన న్యాయవాది సుమీత్ చౌదరి కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారించిన కోర్టు, థరూర్కు నోటీసులు జారీ చేసింది. కోర్టు సమన్లను ఖాతరు చేయకపోవడంతో, ఆయనపై అరెస్ట్ వారెంట్ ను జారీ చేస్తూ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దీపాంజన్ సేన్ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి విచారణను సెప్టెంబరు 24కి వాయిదా వేశారు. కోలకతాలో జరిగిన కార్యక్రమంలో థరూర్ చేసిన ప్రకటన వివాదానికి దారితీసింది. 2019 ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే, దేశాన్ని 'హిందూ పాకిస్తాన్'గా మారుస్తుందని శశి థరూర్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడున్న ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రద్దు చేసి..కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తుందని, ఫలితంగా ప్రజాస్వామ్యం మనుగడ సాగించడం అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, అదే జరిగితే దేశంలో మైనారిటీలకు రక్షణ ఉండదని...అంతిమంగా సరికొత్త ‘హిందూ పాకిస్థాన్’గా దేశాన్ని మారుస్తారంటూ ఘాటుగా విమర్శించారు. థరూర్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రధానంగా 'హిందూ పాకిస్తాన్' అని పేర్కొనడం అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. దీనిపై మండిపడిన బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ కార్యాలయంపై దాడి కూడా చేశాయి. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం తెలిసిందే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రజకులకు అండగా ఉంటాం
రాష్ట్రానికి కేంద్ర నిధులపై చర్చిద్దామా?
‘నీట్’ మాల్ ప్రాక్టీస్కు చెక్!
నేతన్నల బాధలు సీఎంకు కనిపించలేదా..?
ఎమ్మెల్యే నివాసంలో కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశం
ఓటుహక్కుపై ‘ఉపాధి’ కూలీలకు చైతన్యం
శ్రీమద్రామాయణ మహాక్రతువుకు అంకురార్పణ
విద్యార్థులకు అభినందన
వేసవి పూట.. జలకాలాట
రోహిత్ కేసును పునర్విచారించాలి
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement