breaking news
warning is issued
-
వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ. 86 వేలు కట్టండి
వాషింగ్టన్: దేశంలో తిష్టవేసిన లక్షలాది మంది అక్రమ వలసదారులను వేర్వేరు ప్రభుత్వ శాఖలు, భిన్న దర్యాప్తు సంస్థల ద్వారా గుర్తించి స్వదేశానికి వెనక్కి పంపుతున్న డొనాల్డ్ ట్రంప్ సర్కార్ వారికి మరో హెచ్చరిక జారీ చేసింది. తామే స్వయంగా గుర్తించి, బలవంతంగా పంపేసేలోపు స్వీయ బహిష్కరణ ద్వారా దేశాన్ని వీడాలని సూచించింది. సున్నితంగా సూచిస్తూ ఇచ్చిన ఆదేశాలను పెడచెవిన పెడితే పెద్ద జరిమానా చెల్లించుకోక తప్పదని అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టంచేసింది. ఇప్పటికే దేశ బహిష్కరణ ఆదేశాలను అందుకున్న అక్రమవలసదారులు ఇంకా అమెరికా గడ్డపైనే నివసిస్తుంటే వారికి రోజుకు 998 డాలర్ల(దాదాపు రూ.86,469) చొప్పున జరిమానా విధిస్తామని, పట్టుబడ్డాక వారి నుంచి ఈ మొత్తం నగదును ముక్కుపిండి మరీ వసూలుచేస్తామని హోమ్ల్యాండ్ విభాగం ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదలచేసింది. చెల్లించకుంటే ఆస్తుల జప్తు బహిష్కరణ నోటీసు అందుకున్న రోజు నుంచి ప్రతిరోజూ 998 డాలర్ల చొప్పున జరిమానా విధించనున్నారు. అంతటి భారీ మొత్తాలను చెల్లించని, చెల్లించలేని అక్రమ వలసదారుల ఆస్తులను జప్తుచేస్తామని సంబంధిత ఈ–మెయిల్స్లో ప్రభుత్వం ప్రస్తావించింది. ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ జరిమానాలకు సంబంధించి 1996లో తీసుకువచ్చిన చట్టాన్ని తొలిసారిగా అమలు చేశారు. ఇలా బహిష్కరణ నోటీసు అందుకున్నాక అమెరికాలోనే నివసిస్తే వాళ్లకు గరిష్టంగా ఐదు సంవత్సరాలపాటు ఈ జరిమానా విధించే వీలుంది. రోజుకు 998 డాలర్ల చొప్పున జరిమానాను ఎదుర్కొంటే అలాంటి అక్రమవలసదారుడు ఐదేళ్లలో ఏకంగా 10లక్షల డాలర్ల జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది. ఇంతటి భారీ మొత్తాలను వాళ్లు ఎలాగూ కట్టలేరుకాబట్టి అలాంటి వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వం స్వా«దీనంచేసుకోనుందని ట్రంప్ యంత్రాంగంలోని ఒక సీనియర్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. గతంలోనూ పెనాల్టీలు ట్రంప్ తొలిసారిగా అధ్యక్షబాధ్యతలు నిర్వర్తించి కాలంలోనూ కొద్దిమంది అక్రమ వలసదారులపై ఇలా భారీ జరిమానాలు విధించారు. ఆనాడు శరణార్థులుగా వచ్చి చర్చిల్లో రహస్యంగా ఆశ్రయం పొందుతున్న 9 మంది అక్రమవలసదారులపై ట్రంప్ సర్కార్ ఏకంగా లక్షల డాలర్ల పెనాల్టీ విధించింది. తర్వాత కాస్త కనికరం చూపించి నలుగురిపై తలో 60 వేల డాలర్ల జరిమానా విధించింది. అయితే ఈ అంశం కోర్టుల దాకా వెళ్లింది. ఆ తర్వాత అధ్యక్షపగ్గాలు చేబట్టిన జో బైడెన్ వెంటనే జరిమానాల విధింపును రద్దుచేశారు. సంబంధిత విధానపర నిర్ణయాలనూ 2021లో ఉపసంహరించుకున్నారు. కోటికిపైగా అక్రమ వలసదారులు వలసదారుల సలహాల సంస్థ ‘ఎఫ్డబ్ల్యూడీ.యూఎస్’ గణాంకాల ప్రకారం అమెరికాలో దాదాపు 1,00,00,000కిపైగా అక్రమ వలసదారులు ఉన్నారు. వీళ్లంతా ఒంటరిగా ఉండట్లేరు. వీళ్ల రక్తసంబం«దీకులు, కుటుంబసభ్యులు, బంధువుల్లో కొందరికి చట్టబద్ధమైన స్థిరనివాస హోదా, పౌరసత్వం ఉన్నాయి. వాళ్లతో కలిసి ఈ అక్రమవలసదారులు జీవిస్తున్నారు. ఇలా ‘మిక్స్డ్ స్టేటస్’ ఉన్న కుటుంబాలు అమెరికాలో లక్షల్లో ఉన్నాయి. వలసదారుల్లో తక్కువ ఆదాయం ఉన్న వాళ్లే ఎక్కువ. -
Monkeypox: మరో మహమ్మారి.. !
కోవిడ్ మహమ్మారి సృష్టించిన మహావిలయం నుంచి ప్రపంచం పూర్తిగా తేరుకోకముందే ఎంపాక్స్ రూపంలో మరో వైరస్ భూతం భూమండలాన్ని చుట్టేస్తోంది. తొలుత ఆఫ్రికా దేశాలకే పరిమితమైన ఈ వైరస్ తాజాగా రూపాంతరాలు చెంది ప్రాణాంతకంగా పరిణమించింది. ఆఫ్రికాలో ఇన్నేళ్లలో వందలాది మంది మరణాలతో ప్రపంచదేశాలు ఇన్నాళ్లకు అప్రమత్తమయ్యాయి. నిర్లక్ష్యం వహిస్తే మరో మహమ్మారిని స్వయంగా ఆహా్వనించిన వారమవుతామని దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరికలు జారీచేసింది. ఈ మేరకు బుధవారం ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించింది. ఆఫ్రికా ఖండాన్ని దాటి వేరే ఖండాల దేశాల్లోనూ వేగంగా వ్యాపిస్తుండటంతో 2022 ఏడాది తర్వాత తొలిసారిగా డబ్ల్యూహెచ్ఓ ‘గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఆఫ్రికాలో ఈ 7 నెలల్లో∙15,600 కేసులు నమోదయ్యాయి. 537 మంది ఎంపాక్స్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా స్వీడన్, పాకిస్థాన్లకూ వైరస్ పాకింది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి, కట్టడి, నివారణ చర్యలుసహా వ్యాధి పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి తెల్సుకుందాం. ఏమిటీ ఎంపాక్స్ వైరస్? 1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్ను కనుగొన్నారు. అందుకే ఈ వైరస్కు మంకీపాక్స్ పేరు స్థిరపడిపోయింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ పరీక్షలు జరిపి ఈ వైరస్ ఉనికి కనిపెట్టారు. 1970లో కాంగో దేశంలో తొమ్మిదేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకడంతో తొలిసారిగా మనుషుల్లో ఈ వైరస్ను గుర్తించారు. మనుషులు, చిట్టెలుకలకూ వైరస్ సోకడంతో ‘మంకీ’పాక్స్కు బదులు ఎంపాక్స్ అనే పొట్టిపేరును ఖరారుచేశారు. ఆర్థోపాక్స్ వైరస్ రకానికి చెందిన ఎంపాక్స్ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులు వస్తాయి. సొన చేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న మశూచి వ్యాధికి కారణమైన వైరస్, ఎంపాక్స్ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గోమశూచి, వసీనియా వంటి వ్యాధులను కల్గించే వైరస్ కూడా ఈ రకానిదే. వైరస్ ఎలా సోకుతుంది? → అప్పటికే వైరస్ సోకిన మనుషులు లేదా జంతువులను తాకినా, వారితో దగ్గరగా గడిపినా వైరస్ సోకుతుంది. → కుక్క లేదా ఇతరత్రా పెంపుడు జంతువులకు వైరస్ సోకితే అవి మనుషులను కరిచినా, తాకినా, వాటి లాలాజలం, రక్తం, ఇతర స్రావాలు అంటుకున్నా వైరస్ సోకుతుంది. → చర్మంపై గాయాలు, శరీర స్రావాలు, తుమ్మినపుడు పడే తుంపర్లు, నోటి లాలాజలం ఇలా వైరస్కు ఆవాసయోగ్యమైన ప్రతి తడి ప్రాంతం నుంచి వైరస్ సోకుతుంది → ఎక్కువసేపు ముఖాన్ని ముఖంతో తాకినా, ముద్దుపెట్టుకున్నా సోకొచ్చు → రోగి వాడిన దుస్తులు, వస్తువులను ముట్టుకున్నా, వాడినా వైరస్ సోకే అవకాశాన్ని కొట్టిపారేయలేం వేటి ద్వారా వ్యాధి వ్యాపిస్తుంది? రోగి వినియోగించిన దుస్తులు, మంచం, టవల్స్, పాత్రలు సాధారణ వ్యక్తి వాడితే అతనికీ వైరస్ వస్తుం లాలాజలం తగిలినా, కరచాలనం చేసినా సోకుతుంది. తల్లి నుంచి బిడ్డకు వైరస్ సంక్రమించవచ్చు. కొత్తగా ఏఏ దేశాల్లో విస్తరించిందికొత్తగా 13 ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తోందని గత వారం గణాంకాల్లో వెల్లడైంది. క్రితంతో పోలిస్తే ఇక్కడ కేసులు 160 శాతం, మరణాలు 19 శాతం పెరగడం గమనార్హం. కొత్త కేసుల్లో 96 శాతం కేసులు ఒక్క కాంగోలోనే గుర్తించారు. ఎంపాక్స్ కొత్త వేరియంట్ రోగుల్లో మరింతగా వ్యాధిని ముదిరేలా చేసి జననాంగాల వద్ద చర్మగాయాలకు కారణమవుతోంది. దీంతో తమకు ఈ వైరస్ సోకిందన్న విషయం కూడా తెలీక చాలా మంది కొత్త వారికి వైరస్ను అంటిస్తున్నారు. 2022 ఏడాదిలో ఎంపాక్స్ క్లాడ్2 రకం వేరియంట్ విజృంభిస్తే ఈసారి క్లాడ్1 వేరియంట్ వేగంగా సంక్రమిస్తోంది. ఈ వేరియంట్ అత్యంత ప్రమాదకరం. లక్షణాలు ఏమిటీ?→ చర్మంపై దద్దుర్లతోపాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. ఒళ్లంతా నీరసంగా ఉంటుంది. గొంతు ఎండిపోతుంది. → మధ్యస్థాయి పొక్కులు పైకి తేలి ఇబ్బంది కల్గిస్తాయి.→ మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి, వణ్యప్రాణుల నుంచి సోకుతుంది. 90 శాతం కేసుల్లో ముఖంపైనా, 75 శాతం కేసుల్లో అరచేతులు, పాదాల మీద, 30 శాతం కేసుల్లో జననాంగాల మీద పొక్కులు వస్తాయి. నీటి బొడిపెలుగా చిన్నగా మొదలై పెద్దవై తర్వాత సొన చేరి ఎర్రగా, నల్లగా మారి పగులుతాయి. వ్యాక్సిన్ ఉందా? అత్యల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఎంపాక్స్ సోకిన వారికి నిర్ధష్టమైన చికిత్స విధానంగానీ వ్యాక్సిన్గానీ లేవు. మశూచి చికిత్సలో వాడే యాంటీ వైరల్ ఔషధమైన టికోవిరమాట్(టీపీఓఎక్స్ ఎక్స్)ను ఎంపాక్స్ రోగులకు ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. అమెరికాలో మశూచికి వాడే జెనియోస్ డ్రగ్స్నే 18 ఏళ్లు, ఆపైబడిన వయసు రోగులకు ఇస్తున్నారు. కోవిడ్ దెబ్బకు సంపన్న, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాధులు ప్రబలేలోపే నివారణ చర్యలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఆరోగ్యపరంగా నిఘా కార్యక్రమాలు కొనసాగుతున్నాయిగానీ వెనుకబడిన ఆఫ్రికా దేశాల్లో అవేం లేవు. దీంతో వైరస్ వ్యాప్తి ఆగట్లేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మరోసారి తల నరికితే.. తీవ్ర ప్రతిస్పందన
తొలిరోజే పాక్కు ఆర్మీ కొత్త చీఫ్ హెచ్చరిక న్యూఢిల్లీ: భారత సైనిక దళాల ప్రధానాధికారిగా విధులకు హాజరైన తొలి రోజే దల్బీర్సింగ్ సుహాగ్ పాకిస్థాన్కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. భవిష్యత్తులో జవాన్ల తల నరకడం లాంటి చర్యలకు దిగితే భారత్ స్పందన తగిన రీతిలో ఉంటుందన్నారు. ఆ స్పందన చాలా తీవ్ర స్థాయిలో వెంటనే ఉంటుందని స్పష్టంగా చెప్పారు. ఆర్మీ కొత్త చీఫ్గా శుక్రవారం ఇక్కడ సైనిక దళాల నుంచి గౌరవ వందనం అందుకున్న అనంతరం సుహాగ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గతేడాది జనవరి 8న పూంచ్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద ఓ భారత జవాను లాన్స్నాయక్ హేమరాజ్ తలను పాక్ సేనలు నరికి వేసిన ఘటనను విలేకరులు ప్రస్తావించగా సుహాగ్ పైవిధంగా స్పందించారు. తనపై నమ్మకం ఉంచినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.