-
పదేళ్ల తర్వాత జిల్లాలో పులుల సంచారం!
సాక్షి, ములుగు: పదేళ్ల తర్వాత ములుగు జిల్లాలో పులి అడుగు జాడలు కనిపించాయి. దాదాపు రెండు నెలల క్రితం భూపాలపల్లి, మహాముత్తారం, కాటారం అడవుల్లో పులులు సంచరించాయి. అదే సమయంలో జిల్లాలో పులి సంచరించినట్లు పుకార్లు వినిపించారు. అయితే ఈ పుకార్లను కొట్టిపారేస్తూ గత నెల 12వ తేదీన ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ పరిధి కన్నాయిగూడెం మండలంలోని అటవీ ప్రాంతాల్లో పులి సంచరించినట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అనంతరం 20 రోజుల సమయంలో ఏటూరునాగారం అడవుల్లో పులి జాడ ఎక్కడా కనిపించలేదు. అయితే వారం పది రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లా గూడురు, కొత్తగూడ అడవుల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించగా.. తాజాగా ఈ నెల 6న వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలంలోని బండమీది మామిడితండా అడవుల్లో పులి సంచరించినట్లు అడుగు జాడలు కనిపించాయి. కాగా ఏటూరునాగారం అభయారణ్యానికి కొత్తగూడ, పాకాల అభయారణ్యాలకు కనెక్టివిటీ ఉండడంతో ఒకే పులి ఆయా అడవుల్లో సంచరిస్తుందా లేదా మరోటి ఉందా అనే అనుమానంలో అధికారులు ఉన్నారు. ఈ మేరకు స్థానికంగా ఉన్న గిరిజనులు, గొత్తికోయ గూడేల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా గోదావరి సరిహద్దు ప్రాంతాల్లో నాలుగు పులులు సంచరిస్తున్నట్లుగా రెండు నెలలుగా వార్తలు వినిపిస్తుండడంతో పులుల సంఖ్య అంశం సమస్యగా మారింది. సీసీ కెమెరాలపై ప్రత్యేక దృష్టి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల నుంచి రాష్ట్రంలోని అభయారణ్యాల్లోకి పులులు ప్రవేశించాయానే సమాచారం మేరకు జిల్లా అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గత 10 సంవత్సరాల క్రితం జిల్లాలోని ఏటూరునాగారం వైల్డ్లైఫ్ అటవీ ప్రాంతంలో పులి సంచరించినట్లుగా సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. గత 25 రోజులుగా కెమెరాలను పరిశీలిస్తున్నా అధికారులకు పులి సంచారం విషయంలో స్పష్టత రావడంలేదని తెలిసింది. రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి రాష్ట్ర సరిహద్దుల్లోకి ఐదు నెలల కాలంలో ఆరు పులులు వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ విషయంలో అధికారులు స్ప ష్టతనివ్వడం లేదు. ప్రతీ 10 రోజుల సమయంలో పులులు ఆయా జిల్లాల అభయారణ్యంలో కన్పించడంతో స్పష్టమైన వివరాలు తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. బిక్కుబిక్కుమంటున్న ఏజెన్సీ.. పులి సంచారం విషయంలో ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ప్రజలు తీవ్ర బయాందోళనకు గురవుతున్నారు. ఇదే క్రమంలో ఏటూరునాగారం ఆభయారాణ్యాన్ని టైగర్ జోన్గా మార్పు విషయంలో అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టేందుకు ముందుకు సాగుతుండటంతో ఏజెన్సీ అటవీ గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పోటెత్తిన పత్తి
వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్కు సోమవారం పత్తి పోటెత్తింది. రైతులు విక్రయించడానికి 30 వేల బస్తాలకు పైగా పత్తిని తీసుకురావడంతో యార్డు కిటకిటలాడింది. ఈ సీజన్లో ఇంత సరుకు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. వరుసగా 2 రోజులు సెలవులు, పత్తిలో కొంత తేమ తగ్గడంతో భారీగా పత్తి వచ్చినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. అయితే సరుకు అధికంగా రావడం తో ఇదే అదనుగా వ్యాపారులు ధర తగ్గించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 18న క్వింటాలుకు గరిష్ట ధర రూ.5,000 ఉండగా రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. గరిష్ట ధర నిర్ణయించినప్పటికీ ఎక్కువ పత్తిని రూ.4,400 నుంచి రూ.3,500 ధరకే కొనుగోలు చేస్తున్నారు. ఇదేమిటని అడిగితే ‘ఎక్కువ ధర పెట్టలే సీసీఐ దగ్గరకు పోండి’ అని వ్యాపారులు అంటున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర రూ.5,555తో కొనుగోలు చేయడానికి సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసినా ఈనెల 7 నుంచి 23 వరకు 9340.55 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేశారు. తేమ శాతాన్ని బట్టి ధర చెల్లిస్తున్నారు. -
పత్తి రైతుకు శరాఘాతం
సాక్షి, హైదరాబాద్: వరంగల్ వ్యవసాయ మార్కెట్కు మంగళవారం 13,504 క్వింటాళ్ల పత్తి రాగా, అందులో మూడో వంతు అంటే 4,193 క్వింటాళ్ల పత్తికి రూ.3,800 లోపే ధర పలికింది. గతేడాది ఇదే నెల 26న వరంగల్ మార్కెట్లో అత్యంత తక్కువగా రూ.4,400 ధర పలికింది. అది కనీస మద్దతుధర (ఎంఎస్పీ) కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. తడిసిన పత్తిని ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీ క్వింటాలుకు రూ.4,320 ఉండగా, వ్యాపారులు అంతకంటే తక్కువకే కొనుగోలు చేస్తున్నారు. ప్రమాణాలు లేకే ధర పతనం.. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అనేకచోట్ల పత్తి తడిసిపోవడం, తేమ శాతం ఎక్కువ ఉండటంతో పత్తి ధర పడిపోతోంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తడిసిన పత్తికి ఎంఎస్పీ ఇచ్చే పరిస్థితి ఉండదని వ్యాపారులు, ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 8 శాతం తేమ ఉంటే పత్తి క్వింటాల్కు రూ.4,320కు, 9 శాతం ఉంటే రూ.4,277కు, 10 శాతముంటే రూ.4,234, 11 శాతం తేమ ఉంటే రూ.4,190కి, 12 శాతం తేమ ఉంటే రూ.4,147కు కొనుగోలు చేయాలి. ప్రస్తుతం వర్షాల కారణంగా అనేకచోట్ల 20 శాతం వరకు తేమ ఉండటం, తడిసిపోవడంతో వ్యాపారులు అత్యంత తక్కువకు కొంటున్నారు. ప్రమాణాల ప్రకారం పత్తి లేకుంటే సీసీఐ కూడా కొనుగోలు చేయదు. కాబట్టి ఆ మేరకు రైతులు నష్టపోయే ప్రమాదముంది. ఒక్క రోజు 45 వేల క్వింటాళ్లు కొనుగోలు రాష్ట్రంలో ఈ నెల 16న 45,151 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగినట్లు మార్కెటింగ్ శాఖ వెల్లడించింది. ఆ రోజు పత్తికి గరిష్టంగా రూ.3,680 నుంచి రూ.5,010 ధర పలికినట్లు ఆ శాఖ ఒక నివేదికలో తెలిపింది. గజ్వేల్ మార్కెట్లో గరిష్టంగా క్వింటాల్కు రూ.3,680 ధర పలుకగా, కనిష్టంగా రూ.3,100 ధర పలికింది. సరాసరి ఆ మార్కెట్లో రూ.3,500 ధర పలికింది. ఆదిలాబాద్ మార్కెట్లో అదే రోజు గరిష్టంగా ఎంఎస్పీ కంటే ఎక్కువగా రూ.4,580 పలుకగా, కనిష్టంగా రూ. 4,030 ధర పలికింది. సరాసరి ఎంఎస్పీ కంటే తక్కువగా రూ.4,259 ధర పలికింది. అదే రోజు వరంగల్ మార్కెట్లో గరిష్ట ధర ఎంఎస్పీ కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. గరిష్ట ధర రూ.5,010 పలుకగా, కనిష్ట ధర రూ.3,600 పలికింది. సరాసరి అక్కడ రూ.4,500 పలికింది. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఇప్పటివరకు దాదాపు లక్షన్నర ఎకరాల్లో పత్తి తడిసిపోయింది. ఇదిలావుండగా రాష్ట్రంలో మంగళవారం నాటికి సీసీఐ ఆధ్వర్యంలో 20 పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. -
మళ్లీ మిర్చి మంట
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మళ్లీ ఉద్రిక్తత వరంగల్ సిటీ: ప్రభుత్వాలు మద్దతు ధర అందేలా చూస్తామని ప్రకటించినా మిర్చికి తక్కువ ధరలే అందుతుండడంతో రైతులు మళ్లీ కన్నెర్ర చేశారు. శుక్రవారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఆందోళన చేశారు. మార్కెట్కు వచ్చి 3 రోజులైనా కొనే వారు లేరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పైగా మార్కెట్లో బస్తాలు పెట్టుకున్నందుకు కిరాయి వసూలు చేస్తున్నారంటూ మార్కెట్ మీద దాడికి సిద్ధమయ్యారు. వారికి పలువురు రైతు సంఘం నాయకులూ మద్దతు పలికారు. కానీ మార్కెట్లో నే ఉన్న పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని.. కొందరు రైతులను, రైతు సంఘం నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. దీన్ని అలుసుగా తీసుకున్న వ్యాపారులు.. క్వింటాల్ మిర్చికి గరిష్ట ధర రూ.4 వేలు, కనిష్ట ధర రూ.2,500తో కొనుగోళ్లు సాగించారు. మూడు రోజులుగా మార్కెట్లో విధులు నిర్వర్తిస్తున్న వరంగల్ ఆర్డీవో వెంకారెడ్డి, తహసీల్దార్ గుజ్జుల రవీందర్లు రైతులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించడమే తప్ప.. వ్యాపారులు మిర్చికి తక్కువ ధరే ఇస్తున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. రైతు సంఘం నాయకులపై కేసు నమోదు వరంగల్ మిర్చి మార్కెట్లో కొద్దిరోజులుగా ఉద్రిక్తత, పోలీసు పహారా మధ్య కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. మార్కెట్లో పోలీస్ పికెట్ ఎత్తివేయాలని శుక్రవారం ఆందోళన చేసిన రైతు జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఇంతేజార్గంజ్ స్టేషన్కు తరలించారు. జేఏసీ నాయకులు పెద్దారపు రమేష్, చల్ల నర్సిం హారెడ్డి, ఎం.మల్లయ్య, ఎరుకల రాజన్న, అ జ్మీరా సారయ్య, మేకల మొగిలి, సారయ్య తది తరుల మీద కేసు నమోదు చేశారు. రైతులను రెచ్చగొడుతూ, దాడికి ఉసిగొల్పుతున్నందున రైతు జేఏసీ నాయకులపై కేసులు నమోదు చేశామని.. రైతులెవరి మీదా కేసులు పెట్టలేదని ఏసీపీ చైతన్యకుమార్ తెలిపారు. అయితే తాము మార్కెట్లో ఎలాంటి గొడవలకు పాల్పడలేదని, అయినా అన్యాయంగా అరెస్టు చేశారని రైతు సంఘం నాయకులు తెలిపారు. జాడలేని ప్రభుత్వ రంగ ఏజెన్సీలు ప్రభుత్వ రంగ సంస్థ మార్క్ఫెడ్ ద్వారా ఈనెల 3వ తేదీ నుంచే మద్దతు ధరకు మిర్చి కొనుగోళ్లు మొదలవుతాయని ఆశపడిన రైతులకు మార్కెట్లో తీవ్ర నిరాశే ఎదురవుతోంది. దానిపై ఆదేశాలు రాలేదని పాలక వర్గం, అధికారులు చెబుతున్నారు. మద్దతు ధర అందిస్తామని ప్రభుత్వాలు ప్రకటించి ఇప్పటికే వారం రోజులు గడిచిపోయింది. మే చివరి వరకు మరో వారం రోజులు సెలవులు ఉంటాయి. అంటే మిగిలిన 15 రోజుల్లోనే మద్దతు ధరతో రైతుల వద్దనున్న మిర్చి మొత్తాన్ని కొనుగోలు చేయడం సాధ్యమవుతుందా.. అసలు రైతులకు మద్దతు ధర అందుతుందా అన్నది సందేహాస్పదంగా మారింది. ప్రశ్నిస్తే పట్టుకెళ్తున్నారు మద్దతు ధర గురించి అడిగినా, 3 రోజుల నుంచి కొను గోళ్ల కోసం పడిగాపులు కాస్తున్నామని తెలిపినా పోలీసులు వినడం లేదు. దేని గురించి ప్రశ్నించినా పట్టుకుని తీసుకెళ్తున్నారు. ఇంత అన్యాయమా? మరి మా ఇబ్బం దులను ఎవరికి చెప్పుకోవాలి? – పొంచిక సతీశ్, చిట్యాల, మిర్చి రైతు సగం సచ్చిన రైతుల్ని పూర్తిగా సంపుతరా? మిర్చి అమ్ముకోని స్తలేరు.. దాచుకో నిస్తలేరు.. మద్దతు ధర పెడ్తలేరు. అడిగితే పోలీసులు పట్టుకెళ్తున్నారు. మరేం చేయాలి. మార్కె ట్కు మిర్చిని తీసుకొచ్చి ఉత్త పుణ్యానికి (ఫ్రీగా) దానం చేసి పొమ్మంటే అలాగే చేస్తాం. సగం సచ్చిన రైతులను పూర్తిగా సంపుతరా.. – బొర్ర శంకర్, గణపురం, మిర్చి రైతు -
మెరిసిన ఎర్ర బంగారం
క్వింటాకు రూ.18వేల ధరతో రికార్డు మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక ధర వరంగల్ సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మిర్చికి రికార్డు ధర పలికింది. మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా దేశి(టమాటా, దొడ్డు) రకం మిర్చికి పలికిన ధరతో రైతుల్లో ఆనం దం వెల్లువెత్తుతోంది. వరంగల్ వ్యవసాయ మార్కెట్కు గురువారం భూపాలపల్లి మండలం పుల్లూరు రామయ్యపల్లెకి చెందిన రైతు పి.సంపత్ మొదటిసారి చేతికొచ్చిన దేశీ రకం మిర్చిని 13బస్తాల్లో భగవాన్ అడ్తికి తీసుకువచ్చాడు. ఈ మిర్చిని ఖరీదు దారుడు రాంగణేష్ క్వింటాకు రూ.18వేలతో కొనుగోలు చేశాడు. గతంలో మార్కెట్ చరిత్రలోనే ఏ రకం మిర్చికి కూడా ఈ ధర పలికిన దాఖ లాలు లేవని మార్కెట్ వర్గాలు తెలిపాయి. 2013లోనే అత్యధికం దేశీ రకం మిర్చి క్వింటాకు వరంగల్ మార్కెట్లో 2013 సంవత్సరంలో రూ.15,100 ధర పలికింది. ఇప్పటి వరకు ఇదే రికార్డు ధరగా చెబుతున్నా రు. ఇక గత సంవత్సరం దేశీ రకం మిర్చికి రూ.12వేల ధర పలకగా, అంతకుముందు ఏడాది రూ.13వేల ధర పలికింది. మామూలుగా ఫిబ్రవరి చివరి వారం నుంచి మార్చి మొదటి వారంలో మాత్రమే అమ్మకానికి వచ్చే దేశి రకం మిర్చి ఈసారి 15రోజుల ముం దే రావడం.. అత్యధిక ధర పలక డం విశేషం. ఈ సంవత్సరం వర్షాభావంతో పాటు చీడపీడల కారణంగా మిర్చి దిగుబడి తగ్గుతుందని భావి స్తుం డగా.. ధర మాత్రం మెరుగుగా ఉండడంతో రైతు ల్లో ఆనందం వ్యక్తమవుతోంది. నేను ఉహించలేదు... మా గ్రామంలో రైతులందరం దేశీ రకం మిర్చి పండిస్తాం. ముందుగా మార్కెట్కు వస్తే మంచి ధర పలుకుతుందని అందరికీ తెలుసు. కానీ క్వింటాల్కు రూ.18వేలు పలుకుతుందని మాత్రం నాతో పాటు ఎవరూ ఊహించలేదు. గతంలో మా ఊరి రైతు తెచ్చిన మిర్చి క్వింటాకు రూ.15,100 ధర పలికింది. ఇప్పటి వరకు ఇదే రికార్డు ధరగా చెప్పుకుంటున్నారు. ఇక నుంచి నాకు లభించిన ధరే రికార్డుగా చెబుతారు. - పి.సంపత్, పుల్లూరు రంగయ్యపల్లె
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement