-
ప్చ్.. వాల్మార్ట్ ఇండియాకు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: బెస్ట్ప్రైస్ ఫ్లిప్కార్ట్ స్టోర్ల నిర్వాహక దిగ్గజం వాల్మార్ట్ ఇండియా మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో రూ. 299 కోట్ల నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది (2020-21)లో రూ. 201 కోట్ల నష్టం ప్రకటించింది. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ టోఫ్లర్ వివరాల ప్రకారం కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం 6 శాతంపైగా పుంజుకుని రూ. 5,362 కోట్లకు చేరింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 8 శాతం పెరిగి రూ. 5,660 కోట్లను తాకాయి. వాల్మార్ట్ ఇండియాలో 100 శాతం వాటాను ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ 2020 జులైలో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాల్మార్ట్ ఇండియా దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలలో 29 బెస్ట్ప్రైస్ ఫ్లిప్కార్ట్ హోల్సేల్ స్టోర్లు, 2 ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలను నిర్వహిస్తోంది. కాగా ఫ్లిప్కార్ట్ గ్రూప్ను యూఎస్ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ 2018 మే నెలలో 16 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం విదితమే. -
భారత్కు మారిన ఫోన్పే ప్రధాన కార్యాలయం
న్యూఢిల్లీ: త్వరలో పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) రానున్న నేపథ్యంలో ఫిన్టెక్ సంస్థ ఫోన్పే తమ కార్యాలయ చిరునామాను సింగపూర్ నుంచి భారత్కు మార్చుకుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తయినట్లు సంస్థ తెలిపింది. గత ఏడాది కాలంగా ఫోన్పే సింగపూర్కు చెందిన ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసులు, వెల్త్ బ్రోకింగ్ మొదలైన వ్యాపారాలు, అనుబంధ సంస్థలు అన్నింటిని ఫోన్పే ప్రైవేట్ లిమిటెడ్–ఇండియాకు బదలాయించినట్లు వివరించింది. మరోవైపు, 3,000 మంది ఉద్యోగులకు ఫోన్పే ఇండియా కొత్త ప్లాన్ కింద కొత్త ఎసాప్ (ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్)లను జారీ చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఫ్లిప్కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్లు సమీర్ నిగమ్, రాహుల్ చారి, బుర్జిన్ ఇంజినీర్ కలిసి ఫోన్పేను ప్రారంభించారు. దీన్ని ఫ్లిప్కార్ట్ 2016లో కొనుగోలు చేసింది. అటుపైన 2018లో ఫ్లిప్కార్ట్ను అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ కొనుగోలు చేయడంతో ఫోన్పే కూడా వాల్మార్ట్లో భాగంగా మారింది. ప్రస్తుతం 8–10 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్తో పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉంది. -
పోటీ కన్నా కస్టమర్లకే ప్రాధాన్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ–కామర్స్లో ఇతర సంస్థలతో పోటీ కన్నా మెరుగైన సేవలందిస్తూ కస్టమర్లకు మరింత చేరువ కావడానికే ప్రాధాన్యమిస్తామని ఫ్లిప్కార్ట్ హోల్సేల్, వాల్మార్ట్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆదర్శ్ మీనన్ తెలిపారు. కిరాణా, చిన్న.. మధ్య తరహా సంస్థలు, రైతులకు తోడ్పాటు అందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. గురువారం తిరుపతిలో బెస్ట్ప్రైస్ స్టోర్ ప్రారంభం సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. దేశీయంగా ఇది 29వ బెస్ట్ప్రైస్ స్టోర్ కాగా, ఆంధ్రప్రదేశ్లో ఇది ఆరోదని మీనన్ చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 10 బెస్ట్ప్రైస్ స్టోర్స్ ఉన్నాయని తెలిపారు. స్థానికంగా కొనుగోళ్లు జరపడం, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా స్థానిక ఎకానమీ వృద్ధికి తమ స్టోర్స్ ఇతోధికంగా తోడ్పడగలవని వివరించారు. తిరుపతిలో కొత్త స్టోర్తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదని మీనన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఈ స్టోర్ను ప్రారంభించారు. సుమారు 56,000 చ.అ.ల విస్తీర్ణంలో ఇది ఏర్పాటైంది. ‘సులభతరంగా వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితులు కల్పించే విషయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటోంది. ఫ్లిప్కార్ట్ గ్రూప్తో రాష్ట్రానికి దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయి. కొత్త స్టోర్తో తిరుపతిలో కొత్తగా ఉద్యోగాల కల్పన, ఇతరత్రా అవకాశాలు రాగలవు‘ అని రామచంద్రా రెడ్డి తెలిపారు. మరోవైపు, ఫ్లిప్కార్ట్ హోల్సేల్ విభాగం సర్వీసులు 16 నగరాల్లో అందుబాటులో ఉన్నాయని మీనన్ చెప్పారు. -
ఫ్లిప్కార్ట్.. ఇక హోల్సేల్
న్యూఢిల్లీ: దేశీ ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తాజాగా హోల్సేల్ వ్యాపార విభాగంలోకి అడుగుపెడుతోంది. ఇందులో భాగంగా వాల్మార్ట్ ఇండియాను కొనుగోలు చేసింది. అయితే ఈ డీల్ విలువ ఎంతన్నది మాత్రం వెల్లడించలేదు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఫ్లిప్కార్ట్ హోల్సేల్ పేరిట వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సంస్థ గురువారం తెలిపింది. ప్రధానంగా బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) విభాగంలో కార్యకలాపాల కోసం ఫ్లిప్కార్ట్ హోల్సేల్ ఏర్పాటైనట్లు వివరించింది. వాల్మార్ట్ సారథ్యంలోని ఇన్వెస్టర్ గ్రూప్ నుంచి 1.2 బిలియన్ డాలర్లు సమీకరించిన వారానికే ఫ్లిప్కార్ట్ తాజా ప్రకటన చేయడం గమనార్హం. ‘ఒకవైపు విక్రేతలు, తయారీదారులను మరోవైపు కిరాణా దుకాణదారులు, చిన్న మధ్యతరహా సంస్థలను (ఎంఎస్ఎంఈ) అనుసంధానం చేసేలా ఈ మార్కెట్ప్లేస్ ఉంటుంది‘ అని ఫ్లిప్కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆదర్శ్ మీనన్ చెప్పారు. కిరాణా దుకాణదారులు, ఎంఎస్ఎంఈల అవసరాలను తీర్చే సామర్థ్యాలను పెంచుకునేందుకు వాల్మార్ట్ ఇండియా కొనుగోలు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ‘ఫినిష్డ్ ఉత్పత్తులకు సంబంధించి బీ2బీ మార్కెట్ విలువ సుమారు 650 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ఇందులో ముందుగా ఫ్యాషన్, నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ వంటి కేటగిరీలు ఉన్న సుమారు 140 బిలియన్ డాలర్ల మార్కెట్పై మేం దృష్టి సారిస్తున్నాం‘ అని మీనన్ చెప్పారు. భారత్లో వాల్మార్ట్ ఇలా.. ప్రపంచంలోనే అతి పెద్ద రిటైల్ సంస్థ అయిన అమెరికన్ కంపెనీ వాల్మార్ట్ గతంలో భారతీ ఎంటర్ప్రైజెస్ భాగస్వామ్యంతో భారత్లో హోల్సేల్ కార్యకలాపాలు ప్రారంభించింది. 2013లో రెండు సంస్థలు విడిపోయినప్పటికీ వాల్మార్ట్ మాత్రం సొంతంగా బెస్ట్ ప్రైస్ పేరిట క్యాష్–అండ్–క్యారీ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. ఇందులో సుమారు 3,500 మంది ఉద్యోగులు ఉన్నారు. బెస్ట్ ప్రైస్కు తొమ్మిది రాష్ట్రాల్లో 28 స్టోర్స్, 15 లక్షల పైచిలుకు సభ్యులు ఉన్నారు. త్వరలోనే తిరుపతిలో కొత్తగా క్యాష్–అండ్–క్యారీ స్టోర్ ఏర్పాటు చేస్తోంది. వాల్మార్ట్కి పూర్తి అనుబంధ సంస్థగా వాల్మార్ట్ ఇండియా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2018లో సుమారు 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్కార్ట్లో వాల్మార్ట్ 77 శాతం వాటాలు కొనుగోలు చేసింది. కొత్త సంస్థ స్వరూపం..: ఫ్లిప్కార్ట్ హోల్సేల్ వ్యాపార విభాగానికి మీనన్ సారథ్యం వహిస్తారు. ప్రస్తుతం వాల్మార్ట్ ఇండియా సీఈవోగా వ్యవహరిస్తున్న సమీర్ అగర్వాల్.. బాధ్యతల బదలాయింపు సజావుగా పూర్తయ్యే దాకా ఉంటారు. ఆ తర్వాత వాల్మార్ట్లోనే మరో హోదాకు మారతారు. వాల్మార్ట్ ఇండియాలోని ఉద్యోగులు ఫ్లిప్కార్ట్ గ్రూప్లోకి మారతారు. వాల్మార్ట్ టెక్నాలజీ విభాగం తమ వాల్మార్ట్ ల్యాబ్స్ ఇండియాను విడిగా నిర్వహించడం కొనసాగిస్తుంది. కిరాణా షాపులు కీలకం.. కరోనా వైరస్ పరిణామాల నేపథ్యంలో కిరాణా దుకాణదారులు గతంలో కన్నా మరిన్ని మార్గాల్లో కొనుగోళ్లు జరుపుతున్నారని, బెస్ట్ ప్రైస్ విషయానికొస్తే తమ ఈ–కామర్స్ వ్యాపార విభాగం లావాదేవీలు నాలుగు రెట్లు పెరిగాయని సమీర్ అగర్వాల్ తెలిపారు. కిరాణా దుకాణదారులు ఇటు ఆన్లైన్, అటు ఆఫ్లైన్ మార్గంలో కూడా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న సంగతి దీని ద్వారా తెలుస్తోందని పేర్కొన్నారు. రిటైల్ వ్యాపారంలో కిరాణాలు, సంఘటిత బీ2బీ సంస్థలు కీలకమని తెలిపారు. ఇందులో ఆన్లైన్ వ్యా పార విభాగం వృద్ధి గణనీయంగా ఉంటుందన్నారు. ఫ్లిప్కార్ట్తో భాగస్వామ్యం ద్వారా కిరాణా దుకాణదారులు, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) సులభ రుణ సదుపాయాలు, వ్యాపారం.. ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు మరిన్ని లభించగలవని అగర్వాల్ చెప్పారు. -
వాల్మార్ట్తో కలిసి... హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెచ్డీఎఫ్సీ భాగస్వామ్యంతో వాల్మార్డ్ ఇండియా తన కస్టమర్ల కోసం కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను విడుదల చేసింది. వాల్మార్ట్ తాలూకు బెస్ట్ప్రైస్ హోల్సేల్ క్యాష్ అండ్ క్యారీ స్టోర్ల సభ్యుల కోసం ఈ కార్డులను విడుదల చేస్తున్నట్లు వాల్మార్ట్ ఇండియా సీఈఓ క్రిష్ అయ్యర్ చెప్పారు. వీటితో కస్టమర్లకు 18– 50 రోజుల ఫ్రీ క్రెడిట్ లభిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా బెస్ట్ప్రైస్లో రిజిస్టరైన సభ్యులు ఈ కార్డులకు అర్హులని తెలియజేశారు. రెండు రకాల క్రెడిట్ కార్డులు (బెస్ట్ప్రైస్ సేవ్స్మార్ట్, బెస్ట్ప్రైస్ సేవ్ మాక్స్) అందుబాటులో ఉంటాయని, బీ2బీ కస్టమర్లు తమ కొనుగోళ్లకు అనుగుణమైన కార్డును ఎంచుకోవచ్చునని చెప్పారాయన. ఈ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపితే క్యాష్బ్యాక్, రివార్డు పాయింట్ల లాంటి పలు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలుంటాయన్నారు. త్వరలో కర్నూలు, తిరుపతిల్లో బెస్ట్ప్రైస్ దుకాణాలు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా క్రిష్ అయ్యర్ చెప్పారు. ఎకానమీలో మందగమనం త్వరలో సమసిపోతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అన్ని బెస్ట్ప్రైస్ స్టోర్లలో ఈ కార్డులను అందుబాటులోకి తెస్తామన్నారు. సిబిల్ స్కోరుతో సంబంధం లేకుండా బెస్ట్ప్రైస్లో కస్టమర్లు జరిపిన లావాదేవీలను మదింపు చేసి కార్డులు జారీ చేస్తామని కార్యక్రమంలో పాల్గొన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు పేమెంట్స్ బిజినెస్ విభాగం కంట్రీ హెడ్ పరాగ్ రావ్ చెప్పారు. ఈ కార్డుల వార్షిక ఫీజు రూ. 500– 1000 మధ్యలో ఉంటుందన్నారు. ‘‘సేవ్స్మార్ట్ కార్డుతో దాదాపు ఏటా రూ.14,250 మేర, మాక్స్ కార్డుతో ఏటా దాదాపు రూ.40,247 మేర సభ్యులు ఆదా చేసుకోవచ్చు. ఎస్ఎంఈ విభాగం దేశీయ ఎకానమీకి వెన్నెముక. ఈ విభాగానికి చేయూతనిచ్చే దిశగా ఈ కార్డులను తీసుకొచ్చాం’’ అని వివరించారు. ఎకానమీలో మందగమనం పూర్తిగా పోతుందనే సంకేతాలున్నాయని, ఇకపై రికవరీ చూడవచ్చని అంచనా వేశారు. కార్యక్రమంలో డైనర్స్ క్లబ్ ప్రతినిధి యానీ జాంగ్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement