viral video message
-
100 మందిని ఒకేసారి మోసం చేసిన బిచ్చగాడు
అంగవైకల్యం ఉన్నప్పటికీ చాలా మంది కష్టపడి పనిచేసుకుని జీవిస్తుంటారు. కొందరు మాత్రం ఏ సమస్య లేకపోయినా అంగవైకల్యం ఉన్నట్లు నటిస్తూ అడుక్కుతింటుంటారు. అటువంటి వ్యక్తే నడిరోడ్డుపై ఓ కెమెరాకు దొరికిపోయాడు. ఘర్ కే కాలేశ్ అనే ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను తాజాగా పోస్ట్ చేశారు. దీంతో, ఇది పాత వీడియోనా? లేదా కొత్త వీడియోనా? అన్నది తెలియకయినప్పటికీ ఆన్లైన్లో బాగా ట్రెండ్ అవుతోంది.ఈ దృశ్యాలు ఒక కార్ డ్యాష్క్యామ్లో రికార్డ్ అయ్యాయి. వీడియోలో ఒక భిక్షగాడు నడిరోడ్డుపై కర్రల సాయంతో కుంటుతూ ముందుకు వస్తూ జనాల వద్దకు వెళ్లి తన కాలు బాగోలేదని చెప్పి భిక్ష అడుగుతున్నట్టు కనిపిస్తుంది. ఆ రోడ్డుపై దాదాపు 100 మంది ఉంటారు. వాళ్లంతా అతడిని చూసి నిజంగానే ఒక కాలు లేదేమోనని అనుకుంటారు. సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడడంతో అతను స్కూటీపై ఉన్న జంట దగ్గరకు వెళ్లి భిక్ష అడుగుతాడు. వారు డబ్బులు ఇచ్చేదాక అక్కడే ఉంటాడు. చివరకు స్కూటీపై ఉన్నవారు డబ్బు ఇస్తారు. గ్రీన్ పడగానే వాహనదారులు అందరూ అక్కడి నుంచి వెళ్లడం ప్రారంభిస్తారు. అప్పుడు ఆ భిక్షగాడి నిజస్వరూపం బయటపడుతుంది. అందరూ వెళ్లిన తర్వాత అతడు కర్రల సాయంతో కాకుండా సాధారణంగా నడుస్తూ వెళ్లడం కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోను వేలాది మంది చూశారు. ఇలాంటి బిచ్చగాళ్లు ప్రతి రెడ్ లైట్ దగ్గర కనిపిస్తారని నెటిజన్లు అంటున్నారు. వికలాంగులుగా నటిస్తూ చాలా మంది భిక్ష అడుగుతారని కామెంట్లు చేస్తున్నారు. నిజంగా కాలు సమస్య ఉన్నట్టు నటించి, కుంటుతూ జనాల్ని మోసం చేయడం చాలా తప్పని కొందరు కామెంట్లు చేశారు. బిచ్చగాళ్లపై ప్రజల నమ్మకాన్ని అతడు దెబ్బతీస్తున్నాడని చెప్పారు. Fake injury scam caught on dashcam A man was seen dramatically limping on the road, using a stick and pretending to have a badly injured leg while begging for money. Sympathetic people gave him cash, feeling sorry for him.Moments later, after collecting the money, he dropped… pic.twitter.com/owIrs6dRa3— Ghar Ke Kalesh (@gharkekalesh) April 25, 2026 -
మాస్క్ మినహాయింపుల్లేవ్.. ఒక్కసారి ఈ వీడియో చూడండి
VIRAL VIDEO: ‘వేర్ ఏ మాస్క్-సేవ్ ఏ లైఫ్’.. కరోనా టైం మొదలైనప్పటి నుంచి వినిపిస్తున్న నినాదం ఇది. దశల వారీగా, వేరియెంట్లతో మానవాళిపై వైరస్ విరుచుకుపడుతున్నా.. మాస్క్లు వీడొద్దంటూ వైద్య నిపుణులు మొత్తుకుంటున్నారు. కరోనా వచ్చి తగ్గినా.. వ్యాక్సినేషన్ నడుస్తున్నా.. పూర్తిస్థాయి రక్షణ కోసం మాస్క్.. వీలైతే డబుల్ మాస్కులు ధరించాల్సిందేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆంక్షల సడలింపుతో చాలామంది ముఖానికి మాస్క్లు ధరించడం లేదు. ధరించినా కొందరు అసంపూర్తిగా పెట్టుకుంటున్నారు. రద్దీ మార్కెట్లు, ప్రయాణాల్లో, ఆఫీసుల్లో.. చాలామందిలో ఈ నిర్లక్క్ష్యం పెరిగిపోయింది. అడిగితే దురుసు-నిర్లక్క్ష్యపు సమాధానాలు వినిపిస్తున్నాయి. పైగా థర్డ్ వేవ్ ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నా.. చాలామందిలో ఈ ధోరణి మారడం లేదు. ఈ తరుణంలో ఓ పాత వీడియోను తెరపైకి తెచ్చారు కొందరు. పైగా సందర్భానికి తగ్గ వీడియో కావడంతో చాలామంది వాట్సాప్ స్టేటస్ల ద్వారా మళ్లీ వైరల్ చేస్తున్నారు. వైకల్యం ఉన్నా తమనే మాస్క్ ధరించడం నుంచి మినహాయింపు ఇవ్వకండని, తామే మాస్క్లు ధరించినప్పుడు అన్నీ సక్రమంగా ఉన్నవాళ్లూ ధరించడం తప్పనిసరని గుర్తు చేసే ఆ వీడియో కిందటి ఏడాది ఫస్ట్ వేవ్ తర్వాత బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియోను మేరీల్యాండ్ యూనివర్సిటీ డాక్టర్ ఫహీమ్ యూనస్ ట్విటర్ అకౌంట్ నుంచి కిందటి ఏడాది సెప్టెంబర్ 16న పోస్ట్ అయ్యింది. కావాలంటే మరోసారి మీరూ చూసేయండి. బాధ్యతను గుర్తు చేసుకుని దయచేసి సక్రమంగా మాస్క్లు ధరించండి. -
మాస్క్ మినహాయింపుల్లేవ్.. ఒక్కసారి ఈ వీడియో చూడండి
-
కేంద్రమంత్రికి చేరిన జవాను వీడియో
-
కేంద్రమంత్రికి చేరిన జవాను వీడియో
న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్లో జవానుల ధీన స్థితిపై బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ ఫేస్ బుక్లో పోస్ట్ చేసిన వీడియో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను చేరింది. సరిహద్దులో అత్యంత చలిలో విధులు నిర్వహిస్తున్న తమకు నాసిరకం ఆహారాన్ని పెడుతున్న వైనాన్ని వీడియోల్లో చిత్రీకరించి బయటి ప్రపంచానికి తెలిసేలా చేశాడు. సోషల్ మీడియాల్లో ఈ వీడియోను చూసిన వారందరూ తేజ్ బహదూర్ యాదవ్కు మద్దతుగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం జవాన్ల ఆహారం కోసం ఎన్ని సదుపాయాలు కల్పించినా మధ్యలో అధికారులు పందికొక్కుల్లా మింగేస్తున్నారని యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాడిన రొట్టె, పసుపు రసం, సాంబార్ మాత్రమే ఆహారంగా ఇస్తున్నారని వీడియోలో చిత్రీకరించి మరీ ఫేస్ బుక్లో పోస్ట్ చేశారు. తమ దీనగాథపై ప్రధాని మోదీ స్పందించాలని యాదవ్ కోరారు. యాదవ్ పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ అవ్వడంతో కొద్దిసేపటికే ఆ వీడియోలు మీడియాల్లో దర్శనమిచ్చాయి. ఈ వీడియోలు ప్రసారమయ్యే సమయానికే తనపై సీనియర్ అధికారులు వేటు వేసే అవకాశం ఉందనే అనుమానాన్ని కూడా యాదవ్ వ్యక్తం చేశారు. మీడియాలో యాదవ్ వీడియోలు ప్రసారమైన వెంటనే రాజ్నాథ్ స్పందించారు. దర్యాప్తు జరిపి వివరాలు తెప్పించాలని దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


