breaking news
vinodreddy
-
‘ప్రీమియర్’ ఎదుట కార్మికుల ధర్నా
యాదగిరిగుట్ట : మండలంలోని రామాజీపేట పరిధిలో ఉన్న ప్రీమియర్ వైర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ పరిశ్రమ యాజమాన్యం ప్రాంతీయ విభేదాలతో కార్మికులను వేధిస్తున్నారని హెచ్ఎంఎస్, సీఐటీయూ నాయకులు అన్నారు. దీనిని నిరసిస్తూ బుధవారం పరిశ్రమ ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ కార్మికులను వేధింపులకు గురి చేస్తున్న మేనేజర్లను పరిశ్రమ నుంచి తొలగించి కార్మికులకు న్యాయం చేయాలన్నారు. ఈ ధర్నాలో హెచ్ఎంఎస్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శిలు వెంకటేష్, మహేష్, కార్మికులు మల్లేష్, భాస్కర్, స్వామి, వెంకటేష్, కష్ణ, గణేష్, దశరథ, సత్తయ్య, ప్రసాద్, నర్సింహులు, కుమార్, సంజీవ, శ్రీనివాస్, శ్రీశైలం, రమేష్ తదితరులున్నారు. -
గుట్ట సూపరింటెండెంట్గా వినోద్రెడ్డి
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట మండల పరిషత్ సూపరింటెడెంట్గా వినోద్రెడ్డి బాధ్యతలను బుధవారం స్వీకరించారు. గతంలో వినోద్రెడ్డి సంస్థాన్ నారాయణపురం ఎంపీడీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసి పదోన్నతిపై యాదగిరిగుట్టకు వచ్చారు. ఇటీవల స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్గా విధులు నిర్వహించిన విజయ్భాస్కర్రెడ్డి ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన వినోద్రెడ్డిని ఎంపీడీఓ సాంబశివరావు అభినందించారు.