breaking news
Vindhya Visakha
-
మానవత్వం చాటుకున్న యాంకర్ వింధ్య విశాఖ.. రూ. లక్ష సాయం!
సాక్షి, సిటీబ్యూరో: ప్రాణానికి ప్రామాణికమైన కిడ్నీ, లివర్ పనిచేయకపోవండంతో.. ఆపన్నహాస్తం కోసం ఎదురు చూస్తున్న నిరుపేద బాలుడికి ఆర్థిక సహాయమందించి తనమానవత్వాన్ని చాటుకుంది ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్, టీవీ యాంకర్ వింధ్య విశాఖ. ఆ బాలుడు ప్రణీత్కు తాను అందించిన లక్ష రూపాయలు సరిపోవని, సోషల్ మీడియాలో సహాకారం అందించాలని కోరుతోంది. జన్యుపరమైన కారణాలతో కిడ్ని, లివర్ రెండూ పనిచేయకుండాపోయిన ప్రణీత్ సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అదే ఆసుపత్రిలో తన తండ్రి డయాలసిస్ కోసం తరచుగా వెళుతున్న వింధ్య విశాఖ తమ పక్క బెడ్ పైనే ఉన్న ప్రణీత్ పరిస్థితిని ఆరా తీసి తనవంతు సహాయం అందించింది. ఆరోగ్య శ్రీ వర్తించని బాలుడి కిడ్నీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స కోసం సహాకారం అందించాలని ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో.. తనకు క్రికెట్ అంటే ఇష్టమని, తన ఫేరెట్ కోహ్లి, తన జెర్సి నెంబర్ 18 అంటూ సాగిన సంభాషన అందరినీ కలచి వేస్తోంది.చికిత్స కోసం ఉన్న ఆస్తి అమ్మేశా..మాది సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని గిరిపల్లి గ్రామం. తోమ్మిదేళ్ల నా కొడుకును వారంలో 3 రోజులు డయాలసిస్ కోసం నగరంలోని హాస్పిటల్కు రావల్సివస్తుంది. అర్థ ఎకరం భూమి అమ్మి 20 లక్షలు ఖర్చు పెట్టి చికిత్స చేయించాను. ట్రాన్స్ప్లాంటేషన్ కోసం జీవన్దాన్లో దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చింది. కానీ ఈ ట్రాన్స్ప్లాంటేషన్కు 40 లక్షల రూపాయలు ఖర్చవుతాయంట. నా ఇద్దరు కొడుకులు జెనికల్ డిసార్డర్తోనే పుట్టారు. దాతలు సహాయాన్ని నా 9849520535 నెంబర్కు ఫోన్పే, గూగుల్ పే చేయవచ్చు. -ఎంకమొల్ల స్వామి, ప్రణీత్ తండ్రి.ప్రణీత్ను కాపాడుకుందాం..డయాలసిస్ వల్ల బీపీ పెరిగిపోయి అవస్థలు పడుతున్న సమయంలో ప్రణీత్ని తన తండ్రి ఒడిలో పెట్టుకున్నప్పుడు మొదటి సారి చూశాను. సహాయంగా నావంతు లక్ష అందించాను, కానీ అది సరిపోదు. దయచేసి ఎవరికి తోచినంత వారు సహాయం చేయాలని కోరుతున్నాను. తనకు మంచి భవిష్యత్ ఉంది, చాలా యాక్టివ్గా, నేర్చుకోవాలనే తపనతో ఉంటాడు. ప్రణీత్ను గత 3 నెలలుగా గమనిస్తున్నాను. డబ్బులు సమకూరితే నిండు ప్రాణాన్ని కాపాడిన వారమౌతాము. -వింధ్య విశాఖ, స్పోర్ట్స్ ప్రజెంటర్. View this post on Instagram A post shared by Vindhya Vishaka (@vindhya_vishaka) -
ఆ యాంకర్లు భ్రష్టు పట్టిస్తున్నారు.. యాంకర్ వింధ్య షాకింగ్ కామెంట్స్
యాంకర్ అనే పేరు చెప్పగానే తెలుగు వాళ్లకు సుమ గుర్తొస్తుంది. ఎందుకంటే దాదాపు 20 ఏళ్ల నుంచి యాంకరింగ్ ఇండస్ట్రీలో తనదైన మార్క్ సృష్టించింది. ప్రస్తుత జనరేషన్లో చాలామందిని ఈమెని స్ఫూర్తిగా తీసుకుని ఈ ఫీల్డ్లోకి వస్తున్నారని చెప్పొచ్చు. అలా వచ్చిన అమ్మాయే వింధ్య విశాఖ. షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్తో పాటు ఐపీఎల్లోనూ తెలుగు కామెంటరీతో ఈమె చాలా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటిది ఇప్పుడు తోటి యాంకర్స్పై షాకింగ్ కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: చిరు, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడు ఆవేదన)'సుమక్క అంటే నాకు చాలా ఇష్టం. ఆమెని కలిసినప్పుడల్లా.. మాకు కొన్ని షోలు విడిచిపెట్టొచ్చు కదా అని ఫన్నీగా సతాయిస్తుంటాం. సుమక్క విషయానికొస్తే ఆమె టైమింగ్ సూపర్. ఉదయభాను ఇన్నేళ్ల నుంచి యాంకరింగ్ చేస్తున్నారు. గ్లామర్, లుక్స్ మాత్రం ఫెర్ఫెక్ట్గా మెంటైన్ చేస్తున్నారు. ఝాన్సీ గారికి సమాజం పట్ల నాలెడ్జ్ చాలా ఉంది. ఆమెతో కాసేపు మాట్లాడితే చాలా విషయాలు నేర్చుకోవచ్చు''ఇంకొందరు యాంకర్స్ ఉన్నారు. తెలుగు సరిగ్గా మాట్లాడలేరు. ఓ రకంగా చెప్పాలంటే వాళ్లు యాంకరింగ్ని భ్రష్టు పట్టిస్తున్నారు. కొన్ని షోల్లో బూతులని, డబుల్ మీనింగ్ కామెడీని వాళ్లు జనాలకు అలవాటు చేస్తున్నారా అనిపిస్తుంది' అని యాంకర్ వింధ్య చెప్పుకొచ్చింది. ఈమె చెప్పిన దానిబట్టి చూస్తుంటే 'జబర్దస్త్' షో, అందులోని యాంకర్స్ గురించే సెటైరికల్ కామెంట్స్ చేసిందా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: వీడియో: గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్) -
ఐపీఎల్లో సత్తా చాటుతున్న తెలుగు యాంకర్.. స్పోర్ట్స్ ప్రజెంటర్ వింధ్య విశాఖ (ఫొటోలు)


