-
ఏసీబీకి చిక్కిన వీటీడీఏ సీపీవో
వేములవాడ/సుల్తాన్బజార్: వేములవాడ ఆలయ అభివృద్ధి అథారిటీ (వీటీడీఏ) చీఫ్ ప్లానింగ్ అధికారి లక్ష్మణ్గౌడ్ సోమవారం ఏసీబీకి చిక్కారు. లే అవుట్ అనుమతి కోసం రూ.6.50 లక్షలు లంచం తీసుకుంటుండగా ఆయన్ను పట్టుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్న జవ్వాజి సంపత్, వినికంటి సందీప్లు త్రిశూల్ డెవలపర్స్ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇటీవల వేములవాడ రుద్రవరంలో కొనుగోలు చేసిన ఓ స్థలం లే అవుట్ కోసం వీటీడీఏ చీఫ్ ప్లానింగ్ అధికారి లక్ష్మణ్గౌడ్కు దరఖాస్తు చేసుకున్నారు. వారి నుంచి రూ.8 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు రూ.6.50 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. అనంతరం సంపత్, సందీప్లు కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ వీరభద్ర, ఇన్స్పెక్టర్ సంజీవ్లను ఆశ్రయించారు. వారు ఇచ్చిన సూచనల మేరకు ఫోన్ ద్వారా లక్ష్మణ్గౌడ్తో మాట్లాడి డబ్బులు సిద్ధం చేశామని, ఎక్కడ ఇవ్వాలని అడగగా.. హైదరాబాద్ కోఠి గుజరాతిగల్లీలోని తన నివాసం వద్దకు రావాలని సూచించారు. వారు వచ్చాక తన కుమారుడు రోహిత్ను పంపిస్తున్నానని, అతనికి నగదు ఇవ్వాలని లక్ష్మణ్గౌడ్ చెప్పాడు. నగదును తీసుకుని బ్యాగ్లో పెట్టుకున్న రోహిత్ను అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లక్ష్మణ్గౌడ్ నుంచి వాగ్మూలం తీసుకుని అతనితో పాటు కుమారుడు రోహిత్ను అదుపులోకి తీసుకున్నారు. -
'వేములవాడను టూరిజం సెంటర్గా తీర్చిదిద్దాలి'
హైదరాబాద్: పిలిగ్రిమ్ టూరిజం సెంటర్గా వేములవాడను తీర్చిదిద్దాలని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. వేములవాడ ఆలయ అభివృద్ధిపై మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఆర్కిటెక్టులు రూపొందించిన ఆలయ నమూనాను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి అధికారులు వివరించారు. వాస్తుదోషాలు లేకుండా ఆగమశాస్త్ర ప్రకారం నిర్మాణాలు చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులకు సూచించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement