breaking news
veda pathaasala
-
వేద పాఠశాలలో దారుణం.. మైనర్ బాలురకు వాతలు
సాక్షి, పర్వతగిరి(వరంగల్): వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో మూడేళ్లుగా వేద పాఠశాల నిర్వహిస్తున్నారు. దాతల నుంచి సేకరించిన విరాళాలతో నిర్వహిస్తున్న ఈ పాఠశాలలో ఎనిమిది నుంచి 30 ఏళ్ల వయసు విద్యార్థులు తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు చదువుతున్నారు. కరోనా సమయంలోనూ పాఠశాలను కొనసాగిస్తున్న నిర్వాహకులు మైనర్ బాలురను కఠినంగా శిక్షిస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఎనిమిది నుంచి 14 ఏళ్ల పిల్లలను కఠినంగా శిక్షిస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన విద్యార్థులను కర్రలతో విచక్షణా రహితంగా వాతలు వచ్చేలా కొట్టడంతో వారి తల్లిదండ్రులు ఆ చిత్రాలను ఆదివారం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇలాంటి సంఘటనలు పలుమార్లు చోటు చేసుకున్నప్పటికి ట్రస్ట్ సభ్యులు పట్టించుకోకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినట్లు బాధితుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఇలాంటి పాఠశాలను కొనసాగించడానికి వీలు లేదని కోరుకుంటూ తమ పిల్లలను ఉత్తరప్రదేశ్కు తీసుకెళ్లినట్లు తెలిపారు. -
వేద పాఠశాలలో టీచర్ కిరాతకం
బెంగళూరు: కర్నాటకలోని ఓ వేద పాఠశాలలో ఓ ఎనిమిదేళ్ల బాలుడి పట్ల అక్కడ పనిచేసే టీచర్ అతి కిరాతకంగా వ్యవహరించాడు. ఓ చేయి ఫ్రాక్చర్ అయిన ఆ బాలుడిని పట్టుకుని చెవి మెలేస్తూ... చితక్కొట్టాడు. నిజానికి ఈ ఘటన చాలా రోజుల క్రితం జరిగింది. అయితే ఆ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సామాజిక మాధ్యమంలో పెద్ద సంచలనమే సృష్టిస్తున్నాయి. నువ్వు బ్రాహ్మణుడివా, లేక క్షత్రియుడివా అంటూ బాలుడిని ఆ టీచర్ చావగొట్టినట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం కర్నాటకలోని బంట్వాల్లో వున్న ఓ వేద పాఠశాలలో జరిగిన ఓ సంఘటన.. ఇప్పుడు సామాజిక మాధ్యమంలో పెద్ద సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలోనే కలకలం రేపుతోంది. దీనిపై స్థానిక దళిత్ సేవాసమితి నాయకుడు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఘటనపై బుధవారం కేసు నమోదైంది.