breaking news
Vandemataram
-
కాంగ్రెస్కు మిత్రపక్షం నుంచే ఘాటు కౌంటర్
ఇండియా కూటమి మిత్రపక్షాల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇంతకాలం ఎన్నికలు.. సీట్ల పంపిణీ కారణం కాగా.. ఈసారి కాంగ్రెస్–నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య మరో కారణం మాటల యుద్ధానికి దారి తీసింది. ఇదే అదనుగా బీజేపీ రంగంలోకి దిగి కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ‘వందేమాతరం’ చుట్టూ మొదలైన వివాదం.. ఇప్పుడు కూటమి మిత్రపక్షాల మధ్య రాజకీయ పోరుగా మారింది.జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో సోమవారం జరిగిన తొలి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో జాతీయ గీతం ‘జనగణమన’కు ముందు ‘వందేమాతరం’ పూర్తి రూపాన్ని ఆలపించారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సహా పలువురు నేతలు మొత్తం గీతం పూర్తయ్యే వరకు గౌరవంగా నిలబడ్డారు. ఈ పరిణామంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం రాజుకుంది. కాంగ్రెస్–ఎన్సీ రెండూ ఇండియా కూటమిలో భాగస్వాములే కావడంతో ఈ అంశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.‘పూర్తి గీతం మా వైఖరికి విరుద్ధం’శ్రీనగర్ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘వందేమాతరం’ పూర్తి రూపం స్వాతంత్య్ర సమరయోధులు కోరుకున్నదానికి అనుగుణంగా లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 1937లో ఆమోదించిన రూపాన్నే పాటించాలని, మిత్రపక్షాలు కూడా ఆ నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, మౌలానా ఆజాద్ తదితర స్వాతంత్య్ర సమరయోధుల అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని వేణుగోపాల్ పేర్కొన్నారు. మతపరమైన విభేదాలకు తావులేకుండా ఉండేందుకే కాంగ్రెస్ రెండు చరణాల రూపాన్ని అనుసరిస్తోందని ఆయన గుర్తు చేశారు. అయితే దీనికి ఎన్సీ ఘాటుగా స్పందించింది.అంతమాత్రాన ఆదేశిస్తారా?కేసీ వేణుగోపాల్ ట్వీట్కు ఎన్సీ నేత బషీర్ అహ్మద్ బదులిచ్చారు. మిత్రపక్షంగా ఉన్న తమను ఏం పాడాలి, ఎంతవరకు పాడాలి అని కాంగ్రెస్ నిర్దేశించలేదని స్పష్టం చేశారు. ‘‘ఆయనకు తన అభిప్రాయాన్ని ‘ఎక్స్’లో వెల్లడించే హక్కు ఉంది. అయితే దాన్ని మిత్రపక్షాలపై విధించలేరు. ప్రజలపై ఏదైనా విషయాన్ని బలవంతంగా రుద్దడాన్ని మేం వ్యతిరేకిస్తాం అని స్పష్టం చేశారు.‘నాగ్పూర్ ఆదేశాలు పాటించొద్దు’ఎన్సీ స్పందనతో కాంగ్రెస్ కూడా వెనక్కి తగ్గలేదు. ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లాలు ఇండియా కూటమిలో భాగస్వాములని గుర్తుచేసిన కాంగ్రెస్ నేతలు.. కూటమి నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు. నాగ్పూర్ అంటే ఆర్ఎస్ఎస్ నిర్ణయాలను అనుసరించవద్దంటూ ఎన్సీ నేతలపై విమర్శలు చేశారు.కాంగ్రెస్పై బీజేపీ ఎదురుదాడిఈ వివాదాన్ని బీజేపీ కూడా అందిపుచ్చుకుంది. పూర్తి ‘వందేమాతరం’పై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్ వైఖరి ఆ పార్టీని 21వ శతాబ్దపు ‘ముస్లిం లీగ్’గా మార్చిందని బీజేపీ ఎంపీ, అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది విమర్శించారు. కాంగ్రెస్ ఈ అంశంలో పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయిందని ఆయన అన్నారు. మరో బీజేపీ నేత ఆర్ఎస్ పఠానియా కూడా కాంగ్రెస్పై మండిపడ్డారు. కశ్మీర్లో వేర్పాటువాదులు సైతం ‘వందేమాతరం’పై అభ్యంతరం వ్యక్తం చేయలేదని వ్యాఖ్యానించారు.కూటమిలో కొత్త రగడ?ఒకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ ‘వందేమాతరం’ విషయంలో భిన్న వైఖరులు తీసుకోవడం ఇండియా కూటమి అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టింది. శ్రీనగర్ ఫిల్మ్ ఫెస్టివల్లో చోటుచేసుకున్న ఈ పరిణామం.. ఇప్పుడు జాతీయ స్థాయిలో రాజకీయ దుమారం రేపుతోంది.రెండు చరణాలకే కాంగ్రెస్ కట్టుబాటు‘వందేమాతరం’ విషయంలో కాంగ్రెస్ ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేసింది. 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం పార్టీ కార్యక్రమాల్లో రెండు చరణాల రూపాన్నే ఆలపించాలని గత నెలలో సీడబ్ల్యూసీ నిర్ణయించింది. పూర్తి గీతం విషయంలో బీజేపీ విమర్శలు పెరగడంతో ఈ నిర్ణయం మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.మరోవైపు కేంద్రం కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలలు, అధికారిక వేడుకల్లో పూర్తి ‘వందేమాతరం’ను ఆలపించే అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తన 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉండగా.. అదే ఇండియా కూటమిలోని ఎన్సీ నేతలు శ్రీనగర్లో పూర్తి గీతానికి నిలబడటం చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: సర్ప్రైజ్!! బీజేపీకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? -
వందేమాతరం: కాంగ్రెస్పై అమిత్ షా ఆగ్రహం
వందేమాతరం పూర్తి గీతాన్ని ఆలపించాలన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కాంగ్రెస్ తిరస్కరించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని నిర్ణయించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఆ పార్టీ విధానం వల్లే దేశం రెండు ముక్కలైందంటూ మండిపడ్డారాయన. గురువారం ఆయన మాట్లాడుతూ.. వందేమాతరం విషయంలో కాంగ్రెస్ వైఖరి దేశాన్ని అవమానించడమే. రెండు చరణాలే పాడాలని సీడబ్ల్యూసీలో ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం జాతికి వ్యతిరేకం. ఆ పార్టీ వైఖరికి నిరసనగా ప్రజలు ఉద్యమించాలని షా పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ 1937లో వందేమాతరాన్ని రెండు భాగాలుగా విభజించడం వల్లే దేశ విభజనకు బీజాలు పడ్డాయని ఆయన ఆరోపించారు. ముస్లిం మైనారిటీలను సంతృప్తిపరిచేందుకు అప్పటి కాంగ్రెస్ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఆ తర్వాత ద్విజాతి సిద్ధాంతం బలపడి చివరకు దేశ విభజన, పాకిస్థాన్ ఆవిర్భావానికి దారితీసిందని ఆయన వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తోందని చెప్పారు.స్వాతంత్య్ర సమరయోధులను అవమానించారువందేమాతరం ఆలపిస్తూ జైళ్లకు వెళ్లిన, ఉరికంబాలు ఎక్కిన లక్షలాది మంది స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను కాంగ్రెస్ అవమానిస్తోందని షా విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బంకించంద్ర ఛటర్జీ రచనను కూడా అవమానిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ మరోసారి బుజ్జగింపు రాజకీయాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. దేశ ప్రజలు దీనిపై గళమెత్తాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ కౌంటర్.. 1937 నిర్ణయానికే కట్టుబడి ఉంటాంఅమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్ తదితర అగ్రనేతల సమక్షంలో ఆనాడు తీసుకున్న నిర్ణయానికే తాము కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరంలోని తొలి రెండు చరణాలనే ఆలపిస్తామని తెలిపారు.ఇదంతా రాజకీయ రగడే: జైరాం రమేశ్1937 అక్టోబర్ 28న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో వందేమాతరంపై తీర్మానం ఆమోదించారని జైరాం రమేశ్ గుర్తుచేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ సూచన నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రస్తుతం వందేమాతరం అంశాన్ని బీజేపీ రాజకీయ వివాదంగా మారుస్తోందని, యువత, పరీక్షల పేపర్ లీకులు, చందా సేకరణ, విదేశాంగ వైఫల్యం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు.ప్రభుత్వ కార్యక్రమాల్లో పూర్తి గీతంమరోవైపు కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాల ప్రకారం నిర్దేశిత ప్రభుత్వ కార్యక్రమాల్లో వందేమాతరం పూర్తి ఆరు చరణాల వెర్షన్ను ఆలపించనున్నారు. దీని వ్యవధి సుమారు 3 నిమిషాల 10 సెకన్లు కాగా, జాతీయ గీతం ‘జనగణమన’ వ్యవధి 52 సెకన్లు. దీంతో ప్రభుత్వ కార్యక్రమాల్లో వందేమాతరం పూర్తి గీతం.. కాంగ్రెస్ కార్యక్రమాల్లో తొలి రెండు చరణాలకే పరిమితం చేయాలన్న నిర్ణయం మధ్య రాజకీయ వివాదం మరింత ముదిరింది. -
వందేమాతరం వివాదంపై భగ్గుమన్న మల్లికార్జున్ ఖర్గే
సాక్షి, ఢిల్లీ: ఇటీవల కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియాగాంధీ జాతీయగేయం వందేమాతరాన్ని పూర్తిగా ఆలపించకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారంటూ వివాదం చెలరేగింది. తాజాగా దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. తాము పాడిన వందేమాతరం గతంలో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పాడినదేనని ఆయన స్పష్టం చేశారు. అది నేరమైతే మహాత్మా గాంధీ, నెహ్రూలపైనా కేసులు పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఖర్గే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం వందేమాతరం ఆలాపన జరిగింది. అయితే గాయకులు వందేమాతరంలోని పూర్తి వెర్షన్ను ఆలపిస్తుండగా సోనియా గాంధీ ఖర్గే వైపు సైగ చేసి, అనంతరం గాయకులకు కూడా ఏదో చెప్పినట్లు కనిపించిందని బీజేపీ ఆరోపించింది. ఆమె వందేమాతరం పూర్తి ఆలాపనను ఆపించేందుకు ప్రయత్నించారని బీజేపీ నేతలు విమర్శించారు.అయితే కాంగ్రెస్ ఈ ఆరోపణలను ఖండించింది. ఖర్గే చాలాసేపు నిల్చోవడంతో ఆయనకు కుర్చీ ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ నిర్వాహకులకు సైగ చేశారని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ తెలిపారు. వందేమాతరం గీతాన్ని ఆపాలని ఆమె ఎలాంటి సూచన చేయలేదని స్పష్టం చేశారు. ఖర్గే ఆరోగ్యం బాగోలేదని, ఎక్కువసేపు నిల్చోలేరని ఆయన పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై సోమవారం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. వందేమాతరం గీతాలాపనను అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారంటూ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదుదారు కోరారు. తాజాగా దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా స్పందించారు. ఖర్గే మాట్లాడుతూ.. ‘‘మేము పాడిన వందేమాతరం మహాత్మా గాంధీ పాడినదే. జవహర్లాల్ నెహ్రూ పాడినదే. గత 18 ఏళ్లుగా మేము అదే వందేమాతరాన్ని పాడుతున్నాం. వాజ్పేయి ప్రభుత్వ హయాంలోనూ ఇదే పాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 ఏళ్లపాటు ఇదే వందేమాతరం పాడారు’’ అని అన్నారు.‘‘మేము చేసినదే నేరమైతే.. గత 18 ఏళ్లుగా ఇదే నేరం జరుగుతున్నట్లే. అదే నేరమైతే మహాత్మా గాంధీపై కేసు పెట్టండి. నెహ్రూపైనా కేసు పెట్టండి’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. జాతీయ గీతాలు, జాతీయ గీతాలాపనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అనేక దశాబ్దాల క్రితమే తీర్మానం చేసిందని, ప్రస్తుతం విమర్శలు చేస్తున్న వారిలో చాలామంది పుట్టకముందే కాంగ్రెస్ ఈ అంశంపై నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, వందేమాతరం వివాదం మరింత ముదిరింది. సోమవారం గోవాలో జరిగిన కాంగ్రెస్ కార్యక్రమంలో ఖర్గే స్వయంగా వందేమాతరాన్ని ఆలపించారు. అయితే ఈసారి గీతంలోని తొలి రెండు చరణాలను మాత్రమే పాడారు. గోవా కాంగ్రెస్ సదస్సు ప్రారంభానికి ముందు ఖర్గేతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు వందేమాతరం ఆలపించారు.మరోవైపు, ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం వందేమాతరం గీతాన్ని పూర్తి రూపంలో బహిరంగ సమావేశాలు, పాఠశాలలు, అధికారిక ప్రభుత్వ కార్యక్రమాలు తదితర సందర్భాల్లో ఆలపించడాన్ని తప్పనిసరి చేసింది. అంతేకాకుండా వందేమాతరం ఆలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, అంతరాయం కలిగించడం లేదా నిలిపివేయడం నేరంగా పరిగణించేలా పార్లమెంట్లో బిల్లును కూడా ఆమోదించింది.దీంతో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన వందేమాతరం ఆలాపనపై బీజేపీ చేసిన ఆరోపణలు, సోనియా గాంధీపై వచ్చిన ఫిర్యాదు, కాంగ్రెస్ ఇచ్చిన వివరణలతో ఈ అంశం రాజకీయంగా మరింత వివాదాస్పదంగా మారింది -
వందేమాతరం వివాదం.. సోనియాకు బీజేపీ కౌంటర్
న్యూఢిల్లీ: వందేమాతరం గీతం ఆలాపనపై కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తనను జైలుకు పంపేందుకు కుట్ర జరుగుతోందని, జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సోనియా వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. బీజేపీ తీవ్రంగా స్పందించింది. వందేమాతరం ఆలాపన విషయంలో కాంగ్రెస్ వైఖరిపై బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నలు సంధించారు.ఆగస్టు 15న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వందేమాతరం ఆలాపన సందర్భంగా సోనియాగాంధీ వ్యవహరించిన తీరు తమకు తీవ్రంగా అభ్యంతరకరంగా అనిపించిందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. వందేమాతరం మొత్తాన్ని ఆలపించడాన్ని ఆమె వ్యతిరేకించినట్లుగా కనిపించిందని వ్యాఖ్యానించారు. జాతీయ గీతం వంటి అంశంపై కాంగ్రెస్ కార్యాలయంలో చోటుచేసుకున్న పరిణామం అవమానకరమని విమర్శించారు.కాంగ్రెస్ మీడియా విభాగం దీనిపై ఇచ్చిన వివరణను కూడా రవిశంకర్ ప్రసాద్ తప్పుబట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోసం కుర్చీ ఏర్పాటు చేస్తున్నందుకే ఆ సమయంలో అలా జరిగిందన్న వివరణను ఆయన కొట్టిపారేశారు. అది సరైన వివరణ కాదని, వాస్తవాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంగా కనిపించిందని అన్నారు.గోవాలోనూ రెండు చరణాలే..ఆగస్టు 15న గోవాలో జరిగిన కాంగ్రెస్ కార్యక్రమాన్ని కూడా బీజేపీ నేత ప్రస్తావించారు. అక్కడ కూడా వందేమాతరంలోని రెండు చరణాలనే ఆలపించారని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. వరుసగా చోటుచేసుకున్న ఈ ఘటనలపై కాంగ్రెస్ పార్టీ మొత్తం వైఖరిని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.‘స్వాతంత్య్ర ఉద్యమంపై గుత్తాధిపత్యం చెప్పుకోవద్దు’వందేమాతరం విషయంలో కాంగ్రెస్ ఇదే విధమైన వైఖరిని కొనసాగిస్తే.. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి తామే ఏకైక వారసులమని చెప్పుకోవడం మానుకోవాలని రవిశంకర్ ప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశభక్తికి ప్రతీకగా భావించే వందేమాతరంపై కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని విమర్శించారు.సోనియా వ్యాఖ్యల నేపథ్యంలో..ఇదిలా ఉండగా.. తనను జైలుకు పంపేందుకు కుట్ర జరుగుతోందని, జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలోనే వందేమాతరం వివాదాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ కాంగ్రెస్పై దాడి చేసింది. -
భారతీయులకే అవమానం.. సోనియా క్షమాపణలు చెప్పాలిందే: అమిత్ షా
ఢిల్లీ: వందేమాతరం వివాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ దేశ ప్రజలను అవమానించిందని అమిత్ షా మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన అవమానాన్ని 140 కోట్ల మంది భారతీయులు కళ్లారా చూశారని అన్నారు. దేశభక్తికి ప్రతీకగా భావించే ‘వందేమాతరం’ విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు తీవ్రంగా ఖండించాల్సిన అంశమని ఆయన పేర్కొన్నారు.అసలేం జరిగిందంటే.. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఆగస్టు 15 సందర్బంగా శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల జరిగాయి. ఈ సందర్భంగా ‘వందేమాతరం’ పూర్తి రూపాన్ని ఆలపించారు. ఆ సమయంలో సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు వేదికపై ఉన్నారు. వందేమాతరం పాట ఆలపిస్తున్న సమయంలో సోనియా గాంధీ ఖర్గేతో మాట్లాడటం, కొన్ని సంజ్ఞలు చేయడం కనిపించిన వీడియో బయటకు రావడంతో వివాదం మొదలైంది. బీజేపీ ఆరోపణ ఏమిటంటే.. పూర్తి ‘వందేమాతరం’ ఆలాపనపై సోనియా గాంధీ అభ్యంతరం వ్యక్తం చేసి, దాన్ని ఆపేలా సంకేతాలు చేశారని మండిపడుతున్నారు.కాంగ్రెస్ ఏం చెబుతోంది?కాగా, బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ పూర్తిగా ఖండించింది. సోనియా గాంధీ పాటను ఆపాలని సూచించలేదని, ఆమె ఖర్గేకు కుర్చీ ఏర్పాటు చేయాలని మాత్రమే సూచించారని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. దీంతో, రాజకీయం దుమారం రేగింది. ఇక్కడ ఒక చారిత్రక అంశం ఉంది. 1937లో కాంగ్రెస్ వందేమాతరం తొలి రెండు చరణాలను మాత్రమే బహిరంగ కార్యక్రమాల్లో పాడే విధానాన్ని అనుసరించింది. అయితే, 2026లో వందేమాతరం పూర్తి రూపంపై కేంద్రం కొత్తగా ప్రాధాన్యత ఇవ్వడంతో, పూర్తి ఆరు చరణాల ఆలాపనపై రాజకీయ చర్చ మళ్లీ మొదలైంది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యక్రమంలో పూర్తి రూపం పాడుతున్న సమయంలో సోనియా గాంధీ చేసిన సంజ్ఞల వీడియో బీజేపీ చేతికి రాజకీయ ఆయుధంగా మారింది. బీజేపీ ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ మాత్రం తమ నేతలు వందేమాతరాన్ని అవమానించారనే ఆరోపణను తిరస్కరిస్తోంది. -
80 ఏళ్ల స్వాతంత్ర్య చరిత్రలో తొలిసారిగా.. ఎర్రకోటపై సరికొత్త చరిత్ర
ఢిల్లీ: భారత దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఢిల్లీలోని ఎర్రకోటపై సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా జాతీయ గేయం ‘వందే మాతరం’ను పూర్తిస్థాయిలో ఆలపించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా జాతీయ గీతం జనగణమనను ఆలపించారు. ఈ ఏడాది ‘వందే మాతరం’ 150 సంవత్సరాల చరిత్రను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వందేమాతరంపై ప్రత్యేక చట్టం తెచ్చిన సంగతి తెలిసిందే.ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘వందే మాతరం’కు అధికారిక కార్యక్రమాల్లో ప్రత్యేక ప్రాధాన్యం కల్పించే మార్గదర్శకాలను తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న (శుక్రవారం) స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ముందు, ముగింపులోనూ ‘వందే మాతరాన్ని గేయాన్ని ఆలపించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. స్వదేశీ ఉద్యమ కాలంలో ‘వందే మాతరం’ ప్రజల గీతంగా మారిందని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు. బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన ‘వందే మాతరం’ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయులను ఏకం చేసిన ప్రధాన దేశభక్తి గీతాల్లో దీని ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. దేశభక్తి, మాతృభూమిపై గౌరవం, స్వాతంత్ర్య స్ఫూర్తికి ప్రతీకగా ఈ గీతం ప్రజల్లో విశేష ఆదరణ పొందింది. 2026లో 150 ఏళ్ల సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో దీని చారిత్రక ప్రాధాన్యాన్ని దేశవ్యాప్తంగా గుర్తుచేస్తున్నారు. ఎర్రకోట స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా ‘వందే మాతరం’కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. -
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
సాక్షి, ఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ‘వందేమాతరం’ బిల్లుకు ఆమోదం తెలిపారు. దీంతో "ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ బిల్", 2026 ఇక చట్టంగా మారింది. ఇకపై జాతీయ గీతం ‘జనగణమన’కు ఉన్న చట్టపరమైన రక్షణే జాతీయ గేయం ‘వందేమాతరం’కు సైతం వర్తించనుంది.‘వందేమాతరం’ ఆలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, నిలిపివేయడం లేదా ఆ పాట పాడుతున్న సభకు అంతరాయం కలిగించడం ఇకపై నేరంగా పరిగణిస్తారు. గతంలో Prevention of Insults to National Honour Act కింద జాతీయ గీతం ఆలాపనను అడ్డుకోవడం లేదా అంతరాయం కలిగించడం మాత్రమే శిక్షార్హమైన నేరంగా ఉండేది. ఈ నిబంధనను ఇప్పుడు జాతీయ గేయం ‘వందేమాతరం’కు కూడా వర్తించేలా చట్టాన్ని సవరించారు.ఈ నేరాలకు గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. రెండోసారి, ఆ తర్వాత జరిగే ప్రతి నేరానికి కనీసం ఏడాది జైలు శిక్ష ఉంటుంది. గత చట్టంలో ‘వందేమాతరం’కు ఇలాంటి ప్రత్యేక చట్టపరమైన రక్షణ లేదు.ఈ బిల్లును రాజ్యసభ జూలై 29న, లోక్సభ జూలై 30న ఆమోదించాయి. అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో ఇది చట్టంగా మారింది. దీంతో ‘వందేమాతరం’కు జాతీయ గీతం ‘జనగణమన’తో సమానమైన చట్టపరమైన రక్షణ లభించింది. ఇదిలా ఉండగా, ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా ఎర్రకోట ప్రాకారాల నుంచి ‘వందేమాతరం’ ఆలపించనున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.జాతీయ గేయం, జాతీయ గీతం రెండింటినీ ఒకే కార్యక్రమంలో ఆలపించినప్పుడు ముందుగా ‘వందేమాతరం’, ఆ తర్వాత ‘జనగణమన’ ఆలపించాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరి 28న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాతీయ గేయం ఆలాపనకు సంబంధించి తొలిసారిగా ప్రత్యేక ప్రోటోకాల్ను జారీ చేసింది.అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్రపతి రాక, జాతీయ పతాకావిష్కరణ, గవర్నర్ల ప్రసంగాలు వంటి సందర్భాల్లో ‘వందేమాతరం’లోని మొత్తం ఆరు చరణాలను, సుమారు 3 నిమిషాల 10 సెకన్ల వ్యవధిలో ఆలపించాలని ఆదేశించింది. -
వందేమాతరంపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: పార్లమెంటులో ఇటీవల ఆమోదం పొందిన వందేమాతరం బిల్లుపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వందేమాతరాన్ని జాతీయగీతంగా ప్రకటించే అంశంలో అప్పటి రాష్ట్రపతి ఒక పెద్ద తప్పు చేశారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. వందేమాతరం దేవదేవతల ఆరాధనతో ముడిపడి ఉంటుందని. ఆయన ఎలాంటి అధికారిక తీర్మానం లేకుండానే దానిని 'జాతీయ గీతం'గా ప్రకటించారాని దాని కోసం ఒక తీర్మానం చేయాల్సిందన్నారు.వందేమాతరానికి చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన 'ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ (అమెండ్మెంట్) బిల్లు, 2026' ఇటీవలే ఉభయసభల్లో ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది. వందేమాతరం ఆలపించకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, లేదా దాని గానానికి భంగం కలిగించడం, లేదా అవమానించడం వంటి చర్యలను క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. అయితే తాజాగా ఈ బిల్లుపై అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు వ్యక్తం చేశారు.అసదుద్దీన్ మాట్లాడుతూ "మీరు 'జన గణ మన' పాడినప్పుడు, దానిలో మీకు ఏమి కనిపిస్తుంది? మీకు ఈ దేశం, దాని ప్రజలు కనిపిస్తారు. మీరు 'వందేమాతరం' పాడినప్పుడు, అది దేవదేవతల ఆరాధనతో ముడిపడి ఉంటుంది. ఇప్పుడు, దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన ఆ 'ముజాహిదీన్-ఎ-ఆజాదీ' (స్వాతంత్ర్య సమరయోధుల) గురించి మీరేం చెబుతారు? 'జన గణ మన' ప్రజల కోసం వ్రాయబడింది. 1950లో రాజేంద్ర ప్రసాద్ ఒక పెద్ద తప్పు చేశారని నేను నమ్ముతున్నాను. ఆయన ఎలాంటి అధికారిక తీర్మానం లేకుండానే దానిని 'జాతీయ గీతం'గా ప్రకటించారు, కానీ దాని కోసం ఒక తీర్మానం ఆమోదించి ఉండాల్సింది. 'జాతీయ గీతం' నిర్వచనం ఎక్కడా ఇవ్వబడలేదు. (కేంద్ర ప్రభుత్వం) రాజ్యాంగంలోని 25, 26, 29 అధికరణలను ఉల్లంఘిస్తున్నారు." అని అన్నారు. -
వందేమాతరానికి అవమానం జరిగితే ఇక జైలుకే..
సాక్షి,న్యూఢిల్లీ: ప్రజల్లో దేశభక్తిని మరింత బలపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ గేయం జనగణమనతో సమానంగా జాతీయ గీతం వందేమాతరానికి చట్టపరమైన రక్షణ కల్పించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందుకోసం త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ బిల్లును ప్రవేశపెట్టనుంది.ఈ బిల్లు ఆమోదం పొందితే వందే మాతరాన్ని అవమానించడం, జాతీయ గీతాన్ని ఆలపించే సమయంలో అడ్డుకోవడం, అంతరాయం కలిగించడం వంటి చర్యలకు మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇదే శిక్ష జాతీయ గానం, జాతీయ పతాకం, భారత రాజ్యాంగాన్ని అవమానించిన వారికి వర్తిస్తోంది. తాజా సవరణతో జాతీయ గీతం కూడా ఈ చట్ట పరిధిలోకి రానుంది.ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిన మార్గదర్శకాలలో అధికారిక కార్యక్రమాల్లో జనగణమన ఆలపించే సందర్భాల్లో వందే మాతరం తప్పనిసరిగా పాడాలని సూచించింది.తాజాగా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు పంపిన మరో లేఖలో, అధికారిక కార్యక్రమాల్లో వందే మాతరం, జనగణమన రెండూ ఆలపించే పరిస్థితిలో ముందుగా వందే మాతరమే పాడాలని కేంద్ర హోం శాఖ పేర్కొంది. అలాగే, వందే మాతరం మొత్తం ఆరు చరణాలు (సుమారు 3 నిమిషాల 10 సెకన్లు) ఆలపించాలని కూడా సూచించింది. -
వందేమాతరానికి ఆ హక్కు ఎలా ఇస్తారు.. అసదుద్దీన్
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ గీతం జనగణమనతో సమానంగా జాతీయ గేయం వందేమాతరంకు చట్టపరమైన హక్కులను ఇవ్వడాన్ని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు.వందేమాతరాన్ని జాతీయ గీతంతో సమానంగా పరిగణించలేమని ఒవైసీ స్పష్టం చేశారు.అసదుద్దీన్ మాట్లాడుతూ.."వందేమాతరం ఒక దేవతను స్తుతించే గేయం, భారతదేశం ఏ ఒక్క దేవుడి పేరు మీదో లేదా దేవత పేరు మీదో నడవదు ఈ గేయాన్ని రాసిన వ్యక్తి బ్రిటీష్ రాజ్కు సానుభూతిపరుడు, ముస్లింలను ద్వేషించేవారు. గాంధీ, నెహ్రూ, ఠాగూర్, సుభాష్ చంద్రబోస్ వంటి నేతలు కూడా దీనిని తిరస్కరించారు." అని ఆయన అన్నారు.భారత రాజ్యాంగ పీఠిక భారత ప్రజలమైన మేము అని మొదలవుతుంది తప్ప "భారతమాత" అని కాదని ఆయన వాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 ప్రకారం భారతదేశం అంటే రాష్ట్రాల కలయిక అని, ఇది ప్రజల దేశమని ఆయన పేర్కొన్నారు. గతంలో రాజ్యాంగ పరిషత్తులో కొందరు సభ్యులు పీఠికను దేవత పేరుతో లేదా దేవుడి పేరుతో ప్రారంభించాలని కోరారని, కానీ ఆ ప్రతిపాదనలన్నీ అప్పట్లోనే వీగిపోయాయని ఆయన గుర్తు చేశారు.కాగా దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మండిపడ్డారు. ఒవైసీ నాయకత్వం.. దేశ సాంస్కృతిక సమైక్యతను ముప్పుగా భావిస్తోందని, ఆయన వైఖరి గతంలో జిన్నా అనుసరించిన ధోరణిని పోలి ఉందని విమర్శించారు. జిన్నా కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు వందేమాతరాన్ని వ్యతిరేకించలేదని, పార్టీ విడిపోయాకే వ్యతిరేకత మొదలుపెట్టారని గుర్తు చేశారు... రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి అభ్యంతరాలు చెబుతున్నారని ఆరోపించారు.ఒవైసీ గతంలోనూ యూనిఫాం సివిల్ కోడ్ (UCC), త్రిపుల్ తలాక్ రద్దు వంటి జాతీయ సమగ్రతకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఒవైసీ వ్యతిరేకిస్తున్నారని బీజేపీ మండిపడింది.వందేమాతరంపై కేంద్రం నిర్ణయం వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. 'జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం, 1971' కు సవరణలను ఆమోదించింది. ఇకపై వందేమాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అగౌరవపరచినా లేదా దాని ఆలాపనకు ఆటంకం కలిగించినా మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధిస్తారు. అంతకుముందు ఈ రక్షణ కేవలం జా తీయ గీతం జాతీయ జెండా మరియు రాజ్యాంగానికి మాత్రమే ఉండేది. ఇప్పుడు వందేమాతరం కూడా అదే జాబితాలోకి చేరింది. -
ఎస్ఐఆర్పై లోక్సభలో వాడీవేడీగా చర్చ
Parliament Session Updates.. లోక్సభలో ఎస్ఐఆర్పై చర్చ.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే..ఎన్నికల సంస్కరణలపై కేంద్రం గొప్పలు చెబుతోంది: రాహుల్ గాంధీక్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదు: రాహుల్ గాంధీఆర్ఎస్ఎస్పై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలుఆర్ఎస్ఎస్ అన్ని వ్యవస్థలనూ తన గప్పిట్లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తోంది: రాహుల్ గాంధీఎన్నికల వ్యవస్థ ఆర్ఎస్ఎస్ చేతుల్లోనే ఉందిరాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీల అభ్యంతరంరాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజురాహుల్ గాంధీ అనవసరంగా పార్లమెంట్లో ఆర్ఎస్ఎస్ టాపిక్ లేవనెత్తుతున్నారు: కిరెణ్ రిజిజురాహుల్ వ్యాఖ్యలతో బీజేపీ-విపక్ష ఎంపీల పోటాపోటీ నినాదాలు.. స్వల్ప ఉద్రిక్తతవిపక్షాల తీరుపై స్పీకర్ ఆగ్రహంస్పీకర్ చెయిర్ను మీరు బెదిరించలేరు: స్పీకర్ ఓం బిర్లానేను ఏదీ తప్పుగా మాట్లాడలేదు: రాహుల్ గాంధీనేను ఆరోపణలు చేయడం లేదు.. అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నా: రాహుల్ గాంధీఎన్నికల వ్యవస్థ, సీబీఐ, ఈడీలను ప్రభుత్వం తన గుప్పిట పెట్టుకుంది: రాహుల్ గాంధీసీబీఐ చీఫ్ను సీజేఐ ఎందుకు ప్రతిపాదించడం లేదు?: రాహుల్ గాంధీవిద్యావ్యవస్థను కూడా ఆర్ఎస్ఎస్ తన గుప్పిట పెట్టుకుంది : రాహుల్ గాంధీఇప్పటికే విద్యా వ్యవస్థను మార్చేశారు: రాహుల్ గాంధీమెరిట్తో సంబంధం లేకుండా యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తున్నారు: రాహుల్ గాంధీప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం ఈసీని అస్త్రంగా ఉపయోగించకుంటున్నారు: రాహుల్ గాంధీఎన్నికల సీసీ ఫుటేజీని ధ్వంసం చేశారు: రాహుల్ గాంధీఉత్తర ప్రదేశ్, హర్యానాలో ఓట్చోరీ జరిగింది: రాహుల్ గాంధీఫేక్ ఓట్లపై ఈసీ క్లారిటీ కూడా ఇవ్వలేదు: రాహుల్ గాంధీఆర్ఎస్ఎస్ వ్యతిరేకులను ప్రభుత్వం టార్గెట్ చేసింది: రాహుల్ గాంధీ లోక్సభలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై చర్చప్రసంగిస్తున్న విపక్ష నేత రాహుల్ గాంధీ సర్ చర్చలో పాల్గొన్న ఎంపీ మిథున్రెడ్డిఎస్ఐఆర్పై లోక్సభలో చర్చచర్చలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డిఏపీలో జరిగిన ఎన్నికల తీరుపై ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయిఅనేక నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్పై ప్రజలకు అనేక డౌట్లు ఉన్నాయిఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని అనేకమంది టెక్నికల్ ఎక్స్పర్ట్లు చెబుతున్నారుపేపర్ బ్యాలెట్ సిస్టంలో ఎన్నికలు నిర్వహించాలిపేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తే అనుమానాలన్నీ తొలగిపోతాయిఅందరికీ సౌకర్యంగా ఉంటే, ఎస్ఐఆర్ తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదుఅన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలివెబ్ కాస్టింగ్ ఫుటేజీ అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో తీసుకురావాలిఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలనేదే మా అభిమతంఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సా.6 గంటల తర్వాత అకస్మాత్తుగా ఓటింగ్ శాతం పెరిగిందిసాయంత్రం 6.. తర్వాత 51 లక్షల ఓట్లు రికార్డయ్యాయి మేము ఇచ్చిన ఫిర్యాదుల పైన ఈసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదువిజయనగరం పార్లమెంటులో కౌంటింగ్ సమయంలో 99 శాతం, పోలింగ్ సమయంలో 60 శాతం చార్జింగ్ ఉందిఈవీఎంలో చార్జింగ్ ఎలా పెరిగిందని అడిగితే సమాధానం లేదువివి ప్యాట్ స్లిప్పులు అడిగితే అప్పటికే తగలబెట్టామని చెప్పారువెరిఫికేషన్ కోసం ఈవీఎంలు అడిగితే వేరే వాటిని ఇచ్చారుఈసీ అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఫిర్యాదులు చేసిన ఉపయోగం ఉండడం లేదుహిందూపురం పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బూత్ లో మా పార్టీ కికు 472 ఓట్లు వస్తే, అక్కడే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఒక్క ఓటు మాత్రమే వచ్చిందిఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని ఎలన్ మస్క్ సహా అనేక మంది నిపుణులు అంటున్నారుఅభివృద్ధి చెందిన దేశాల్లో సైతం పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తున్నారుపేపర్ బ్యాలెట్ సిస్టంలో ఎన్నికలు నిర్వహించాలిపేపర్ బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహిస్తే అనుమానాలన్నీ తొలగిపోతాయిఅందరికీ సౌకర్యంగా ఉంటే, ఎస్ఐఆర్ తో మాకు ఎలాంటి ఇబ్బంది లేదుఅన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహించాలివెబ్ కాస్టింగ్ ఫుటేజీ అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో తీసుకురావాలిఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలనేదే మా అభిమతం SIRపై లోక్సభలో ప్రత్యేక చర్చఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) అమలుపై కాంగ్రెస్ అభ్యంతరంఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోనే ఎస్ఐఆర్ చేస్తున్నారు: కాంగ్రెస్ఈవీఎంలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి: కాంగ్రెస్ఈసీల నియామక ప్రక్రియ చేపట్టిండి: మనీశ్ తివారీఎన్నికల సంస్కరణలపై లోక్సభలో ప్రత్యేక చర్చ.కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ కామెంట్స్..బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగాలి.అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయి.ఎన్నికల సంస్కరణల్లో తొలుత జరగాల్సింది ఈసీల నియామక ప్రక్రియ.ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయండి.ప్రస్తుత ముగ్గురు సభ్యులతో పాటు రాజ్యసభలో విపక్ష నేత సీజేఐను చేర్చండి. Congress MP Manish Tewari speaks in Lok Sabha during debate on electoral reforms He says, "...The first reform that should happen is an amendment to the law governing the selection of members of the Election Commission. My suggestion is that LoP Lok Sabha and Chief Justice of… https://t.co/qt6rVkTu4d pic.twitter.com/ZZiLL1DzfN— ANI (@ANI) December 9, 2025ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను వాడాలి: అఖిలేష్ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో ప్రసంగించిన సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్అఖిలేష్ కామెంట్స్..ఎలక్ట్రానిక్ పరికరాల వాడకంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ప్రతిపక్షాలకు అనేక అనుమానాలు ఉన్నాయి.బ్యాలెట్ పేపర్లను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించాలిSpeaking in Lok Sabha on electoral reforms, Samajwadi Party MP Akhilesh Yadav says, "Elections should be conducted using ballot papers because many questions are being raised on the use of electronic devices." pic.twitter.com/QCO063kGIN— ANI (@ANI) December 9, 2025ప్రియాంక గాంధీ వ్యాఖ్యలకు అమిత్ షా కౌంటర్..రాజ్యసభలో వందేమాతరం 150వ వార్షికోత్సవంపై ప్రత్యేక చర్చ.కొందరు బెంగాల్ ఎన్నికల కోసమే వందేమాతరంపై చర్చిస్తున్నారని అంటున్నారు.బెంగాల్ ఎన్నికలకు చూపిస్తూ వందేమాతరాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దు.కాలంతో సంబంధం లేకుండా ‘వందేమాతరం’ దేశ ప్రజల్లో ఎప్పటికీ స్ఫూర్తి నింపుతూనే ఉంటుంది.ఆ గేయానికి గతంలోనూ ఎంతో ఔచిత్యం ఉంది.. భవిష్యత్తులోనూ ఉంటుంది. రామ్మోహన్ నాయుడు సమాధానంపై విపక్షాల అసంతృప్తిఇండిగో విమానాల రద్దుపై లోక్సభలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటనరామ్మోహన్ నాయుడు సమాధానంపై విపక్షాల అసంతృప్తితమ ప్రశ్నలకు జవాబు చెప్పాలని డిమాండ్ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో చర్చ..చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ.రాజీవ్ గాంధీ హయాంలో కీలక ఎన్నికల సంస్కరణ జరిగాయి.వన్ నేషన్-వన్ ఎలక్షన్ గురించి చర్చ జరుగుతోంది. #WinterSession2025 लोकसभा में ''ELECTION REFORMS'' पर चर्चा शुरु I#LokSabha @LokSabhaSectt @loksabhaspeaker #ParliamentWinterSession2025 Watch Live : https://t.co/16ABiCqhz5 pic.twitter.com/hICFXNVRot— SansadTV (@sansad_tv) December 9, 2025 ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..ప్రజలను వేధించడానికి నిబంధనలు వాడకూడదువ్యవస్థలను మెరుగుపరిచేందుకే నిబంధనలుఇండిగో సంక్షోభంపై ప్రధాని మాట్లాడారని వెల్లడించిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజుఎన్డీయే పక్ష సమావేశ వివరాలను వెల్లడించిన కిరణ్ రిజిజునేడు లోక్సభలో ఎస్ఐఆర్పై చర్చవిపక్షాల తరఫున చర్చను ప్రారంభించనున్న రాహుల్ గాంధీఎస్ఐఆర్ పై చర్చ జరపాలని గత వర్షాకాల సమావేశాల నుంచి డిమాండ్ చేస్తున్న విపక్షాలుఎట్టకేలకు ఎన్నికల సంస్కరణలు అనే అంశం కింద ఎస్ఐఆర్ చర్చకు ఒప్పుకున్న ప్రభుత్వంఎస్ఐఆర్తో ఓటు చోరీ జరుగుతుందని ఆరోపిస్తున్న విపక్ష పార్టీలుఎస్ఐఆర్తో బీఎల్వోలు ఆత్మహత్య చేసుకుంటున్నారని, పని భారం పెరుగుతుందని విపక్షాల ఆరోపణలుపెద్ద ఎత్తున ఓటర్లను తొలగించేందుకే ఎస్ఐఆర్ చేపట్టారని ఆరోపణలుప్రభుత్వం తరఫున జవాబు చెప్పనున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్వైఎస్సార్సీపి తరఫున చర్చలో పాల్గొననున్న ఎంపీ మిథున్ రెడ్డిరాజ్యసభలో వందేమాతరంపై చర్చనేడు రాజ్యసభలో వందేమాతరంపై చర్చవైఎస్సార్సీపీ తరఫున చర్చలో పాల్గొననున్న ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.కొనసాగుతున్న ఎన్డీయే సమావేశం..కొనసాగుతున్న ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంసమావేశానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భాగస్వామ్య పక్షాలు ఎంపీలుఎస్ఐఆర్ పై చర్చ నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న సమావేశం#WATCH | Delhi | NDA leaders felicitate PM Narendra Modi during the NDA Parliamentary Party meeting. pic.twitter.com/di7IGDBozP— ANI (@ANI) December 9, 2025 -
‘ఇదొక మంత్రం’.. ‘వందేమాతరం’చర్చలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: వందేమాతరం, వేదకాలాన్ని గుర్తు చేస్తుందివందేమాతరం గీతం మన స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన పాట...త్యాగం ,తపస్సుకు మార్గాన్ని చూపించిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ పోరాటం ఏదో ఒక భూమి కోసం మాత్రమే కాదని వందేమాతరం మనకు అర్థమయ్యేలా చేసిందన్నారు. వందేమాతరం మన వేద కాలాన్ని గుర్తుకు తెస్తుంది. ఈ భూమి నా తల్లి అని, నేను ఈ భూమికి పుత్రుడిని అని చెబుతుంది. వందేమాతరం మాతృభూమికి సంబంధించిన పాట అని ఆయన కొనియాడారు.వందేమాతరం రుణాన్ని సమిష్టిగా అభినందించేందుకే, ఈ పాట కారణంగానే మనమందరం ఇక్కడ ఉన్నాము. వందేమాతరం రుణాన్ని గుర్తించాల్సిన పవిత్ర సందర్భమిది అన్నారు మోదీ. 2047 నాటికి పూర్తి స్వావలంబన దిశగాదేశాన్ని నలుదిక్కులనుంచి ఏకంచేసింది. మళ్ళీ ఐక్యమై అందరితో కలిసి కదలాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ పాట మన స్వాతంత్ర్య సమరయోధుల కలలను నెరవేర్చడానికి మనకు స్ఫూర్తిని ,శక్తినివ్వాలి. 2047 నాటికి మన దేశాన్ని స్వావలంబనగా మరియు అభివృద్ధి చెందేలా చేయాలనే సంకల్పాన్ని మనం పునరుద్ఘాటించాలి" అని మోదీ పేర్కొన్నారు.జిన్నాకు వత్తాసు పలికారు, వందేమాతర గీతానికి ద్రోహం చేశారుభారత జాతీయ గీతాన్ని 50 సంవత్సరాల క్రితం ప్రతిపక్ష పార్టీ మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి విధించి రాజ్యాంగాన్ని అణచివేశారు. దేశభక్తులను జైళ్లలో నెట్టిన ఎమర్జెన్సీ మన దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం అన్నారు మోదీ. ఇప్పుడు మనకు వందేమాతరం గొప్పతనాన్ని పునరుద్ధరించే అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని వదులుకోకూడదని తెలిపారు.ముస్లింలకు నచ్చదనే కారణంగా జవహర్లాల్ నెహ్రూ - 'వందేమాతరం'ను వ్యతిరేకించడంలో ముహమ్మద్ అలీ జిన్నాను అనుసరించారని ఆరోపించారు. 1937లో మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్ వందేమాతరం గీతానికి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టిందనీ, అయితే దానిని వ్యతిరేకించాల్సిన కాంగ్రెస్ పార్టీ, నెహ్రూలు వత్తాసు పలికి ఈ గీతం నుంచి కొన్ని పంక్తులను తొలగించారని విమర్శించారు. ‘వందేమాతరం అనేది ఒక మంత్రం.. నినాదం.. ఇది స్వాతంత్ర్య ఉద్యమానికి శక్తిని, ప్రేరణను ఇచ్చింది. త్యాగానికి, తపనకు మార్గాన్ని చూపింది. వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకకు మనం సాక్షులుగా మారడం గర్వకారణం. ఇది ఒక చారిత్రక క్షణం. పలు చారిత్రక సంఘటనలను మైలురాళ్లుగా జరుపుకుంటున్న కాలం ఇది. ఇటీవలే మనం 75 ఏళ్ల రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నాం. దేశం.. సర్దార్ పటేల్, బిర్సా ముండా 150వ జయంతిని జరుపుకుంటోంది. గురు తేజ్ బహదూర్ 350వ అమరవీరుల దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనం వందేమాతరం 150 సంవత్సరాల వేడుకలను జరుపుకుంటున్నాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో వందేమాతర గీతంపై చర్చను ప్రారంభిస్తూ పేర్కొన్నారు. #WATCH | PM Narendra Modi says, "There is no leadership and opposition here. We are here to appreciate and accept the debt of Vande Mataram collectively. It is because of this song that we are all here together. It is a sacred occasion for all of us to acknowledge the debt of… pic.twitter.com/B4KvoXd5Wn— ANI (@ANI) December 8, 2025వలస పాలనలో బ్రిటిష్ వారు భారతీయులు ‘గాడ్ సేవ్ ది క్వీన్’ను పాడాలని ఆశించారు. కానీ దేశం ‘వందేమాతరం’ ద్వారా తన సొంత గొంతును వినిపించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మన దేశభక్తి గీతం బ్రిటిష్ ఆధిపత్యానికి శక్తివంతమైన ప్రతిస్పందన అని ఆయన అభివర్ణించారు. భవిష్యత్ తరం ఈ చర్చ నుండి ఎంతో నేర్చుకోవచ్చని అన్నారు. బ్రిటిష్ వారు తమ విభజించు-పాలించు విధానాన్ని బెంగాల్ నుండి ప్రారంభించారని, కానీ ‘వందేమాతరం’ స్ఫూర్తి వారి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసిందన్నారు. ‘వందేమాతరం’ బ్రిటిష్ పాలనకు తగిన సమాధానంగా మారింది. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. వందేమాతరం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు దేశం వలస పాలనలో ఉంది. 100వ వార్షికోత్సవంలో దేశం అత్యవసర పరిస్థితిలో ఉంది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2025లో జాతీయ గీతం 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. వందేమాతర గీతాన్ని 1870లలో బంకిం చంద్ర ఛటర్జీ సంస్కృతీకరించిన బెంగాలీలో రాశారు. ఇది తొలుత 1882లో ఛటర్జీ బెంగాలీ నవల ఆనంద్మఠ్లో భాగంగా ప్రచురితమయ్యింది. లక్షలాది మంది వందేమాతరం జపిస్తూ, స్వాతంత్ర్యం కోసం పోరాడినందునే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని ప్రధాని పేర్కొనన్నారు. ఈరోజు మనం జాతీయ గీతాన్ని గుర్తు చేసుకోవడం ఈ సభలో మనందరికీ గర్వకారణం అని ప్రధాని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలకులు తమ ‘గాడ్ సేవ్ ది క్వీన్’ అనే గీతాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ‘వందేమాతరం’ రాశారని ప్రధాని తెలిపారు.‘వందేమాతరం’ దేశభక్తి నినాదం కంటే మించినదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఇది స్వాతంత్ర్య పోరాట సమయంలో శక్తివంతమైన యుద్ధ నినాదంగా పనిచేసిందని, ఈ నినాదం భారతీయులలో ధైర్యం, ఐక్యత, ధిక్కారాన్ని రేకెత్తించిందని, వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేసే ర్యాలీలకు పిలుపుగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. ‘వందేమాతరం’ దేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. దానిలోని భావోద్వేగ, సాంస్కృతిక ప్రభావానికి ప్రపంచంలో మరొకటి సాటిలేదని ప్రధాని పేర్కొన్నారు. గాంధీజీ ‘వందేమాతరం’ను జాతీయ గీతంతో సమానం చేశారని, నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దీనిని వ్యతిరేకించారని, ముహమ్మద్ అలీ జిన్నా అభిప్రాయాలతో ఏకీభవించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ వందేమాతరంను రాజీ పడటం కింద భావించిందని ఆరోపించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సోమవారం 150 వసంతాల వందేమాతర గీతంపై ప్రత్యేక చర్చను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ చర్చ లోక్సభలో 10 గంటలపాటు సాగనుంది. ఈ పాట మూలాలు, స్వాతంత్ర్య పోరాట సమయంలో దాని ప్రాముఖ్యత, భారతదేశ సాంస్కృతిక, జాతీయ గుర్తింపుపై వందేమాతర గీతం ప్రభావాన్ని మరోమారు పరిశీలించనున్నారు. -
పాట వచ్చి 28 ఏళ్లైనా పవర్ ఏమాత్రం తగ్గలేదు
ఆ పాట.. మన దేశాన్ని ప్రేమించమని చెప్పే పాట. అందులోని సంగీతం.. దేశాన్ని చూపే చూపును మార్చేసిన ఒక భావోద్వేగం. అది వింటున్నప్పుడు ప్రతీ భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. దేశం పట్ల ప్రేమను పదే పదే గుర్తు చేస్తుంది. అందుకే అదొక కాలాతీత గీతమై.. కోట్లాది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. రెహమాన్ Vande Mataram ఆల్బమ్.. 28 ఏళ్ల తర్వాత కూడా నేటికి అదే ఉత్సాహంతో, అదే గర్వంతో దేశమంతటా మార్మోగుతోంది.అప్పటికే సినీ పరిశ్రమలోకి వచ్చిన ఏఆర్ రెహమాన్కు ఐదేళ్లు అయి ఉంటుంది. కానీ, ఆ తక్కువ కాలంలోనే అతని సంగీతానికి దేశం చికుబుక్ రైలే అంటూ చిందులేస్తోంది. సరిగ్గా.. అదే సమయంలో సోనీ మ్యూజిక్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. లోకల్ టాలెంట్ను ఇంటర్నేషనల్గా ప్రమోట్ చేసే ప్రయత్నంలో.. తొలిగా రెహమాన్తో మూడు ఆల్బమ్స్ కోసం ఒప్పందం చేసుకుంది. అలా పుట్టిందే.. వందేమాతరం ఆల్బమ్. స్నేహితుడి ఆలోచనతో.. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న ఆత్మలు.. యాడ్ ఫిల్మ్మేకర్లు భారత్ బాలా, కనికా. రెహమాన్కు బాలా బాల్యమిత్రుడు. అతని సలహా మేరకే సోనీ కంపెనీ తొలి అల్బమ్గా దేశభక్తి నేపథ్యాన్ని ఎంచుకున్నాడు రెహమాన్. పైగా బాలా తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు కావడం వల్ల, ఈ పాటకు ఆయన ఎమోషనల్గా ఎంతో కనెక్ట్ అయ్యారు. బాలా, కనికలు తల్చుకుంటే స్టైలిష్ ఆల్బమ్ అయ్యి ఉండేది. కానీ, 50 ఏళ్ల స్వతంత్ర భారతావని ఆత్మను చూపించాలని నిర్ణయించుకున్నారు వాళ్లు. అలా ఈ వీడియో కోసం దేశం నలుమూలలకు తిరిగారు. హిమాలయాల శిఖరాల నుంచి.. తమిళనాడులోని గ్రామాల వరకు.. భారతదేశం యొక్క అసలైన రూపాన్ని చూపించే ప్రయత్నం చేశారు. దేశం నలుమూలల అందాలను, ప్రజల జీవనశైలిని, సంస్కృతిని చూపిస్తూ ఈ పాటకు రూపం ఇచ్చారు. లండన్కు చెందిన యాక్ బోండీ ఈ పాటకు సహ నిర్మాతగా వ్యవహరించాడు. పాకిస్తానీ సూఫీ సింగర్ నుస్రాత్ ఫతేహ్ అలీ ఖాన్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం అయ్యాడు. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఆనాడు లేవు కాబట్టి రెహమాన్కు ఎలాంటి ఆటంకాలు.. విమర్శలు ఎదురు కాలేదు. ఈ ఆల్బమ్కు కాన్సెప్ట్ అందించడంతో పాటు దర్శకులుగా భారత్ బాలా, కనికాలు వ్యవహరించారు. రెహమాన్ సహదర్శకత్వం వహించాడు. పాటకు హిందీలో సాహిత్యాన్ని అప్పటికే తనతో రంగీలా, దావూద్ చిత్రాలకు పని చేసిన గేయ రచయిత మెహబూబ్కు అప్పగించాడు. అలాగే.. తమిళ్ వెర్షన్ థాయి మన్నే వణ్ణక్కంకు సీనియర్ గేయరచయిత వైరముత్తు సాహిత్యం అందించారు. పాటలో వినిపించే ప్రతి పదం.. సంగీతంలోని ప్రతి నోటు.. భారతదేశం పట్ల గౌరవాన్ని, ప్రేమను, గర్వాన్ని వ్యక్తపరిచేలా ఉండేలా చూడాలని రెహమాన్ ఆ ఇద్దరికి విజ్ఞప్తి చేశాడు. అలా ఆ పాట సిద్దమైంది.. కర్లీ జుట్టుతో ఆ పాటలో స్వయంగా రెహమానే నటించారు. కనిక, భరత్ బాలా(ఫైల్ ఫొటోలు) 1997 ఆగస్టు.. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన 50 ఏళ్ల సందర్భం. స్వాతంత్ర దినోత్సవానికి మూడు రోజుల ముందు.. మా తుజే సలాం అనే పాట క్యాసెట్ల రూపంలో విడుదలైంది. దేశభక్తికి ఒక శక్తివంతమైన ప్రతీకగా మారడానికి ఈ పాటకు ఎంతో సమయం పట్టలేదు. రోజుల వ్యవధిలోనే దేశంలోనే బెస్ట్ సెల్లర్గా నిలిచింది. ఇంకోవైపు.. విజువల్స్ ఆల్బమ్ ఆరోజుల్లో తక్కువ టైంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అదే సమయంలో.. దేశభక్తిని కమర్షియల్గా మార్చారనే విమర్శలు వచ్చాయి. పాటకాపీ రైట్పైనా కొన్ని వివాదాలు నడిచాయి. కానీ, వాటంటిన్ని దాటుకుని ‘మా తుజే సలాం’.. దేశ ప్రజల గుండెను తాకింది. అప్పటి నుంచి గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవాలప్పుడు టీవీ చానెల్స్ల్లో, విద్యాసంస్థల్లో, మైక్సెట్లలో, రేడియో..ఎఫ్ఎం స్టేషన్లలో, ఆఖరికి ఇప్పుడు రీల్స్ రూపంలో పిల్లల వాయిస్తో వినిపిస్తున్న రీమిక్స్గానూ మారుమోగుతోంది. విడుదలై 28 ఏళ్లు అవుతున్నా.. రెహమాన్ ‘వందేమాతరం’ పవర్ ఏమాత్రం తగ్గలేదు. ఇది కేవలం పాట, సంగీతం కాదు.. ఇది భారతీయతకు అద్దం.:::వెబ్ డెస్క్ స్పెషల్VIDEO Credits: SonyMusicIndiaVEVO -
మధ్యప్రదేశ్లో ‘వందేమాతరం’ వివాదం
భోపాల్: మధ్యప్రదేశ్లో వందేమాతరం గీతం విషయంలో వివాదం నెలకొంది. రాష్ట్ర సచివాలయంలో ప్రతి నెలా మొదటి పని దినం నాడు వందేమాతరం ఆలపించడం 13 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని మంగళవారం నిలిపివేసింది. దీంతో బీజేపీ నేతలు విమర్శలకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరుద్ధరించుకోవాలని.. లేని పక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలందరం కలిసి అసెంబ్లీ సెషన్ ప్రారంభమయ్యే (7వ తేదీ) నాడు వందేమాతరం పాడతామని మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. సీఎం కమల్నాథ్ సూచనల మేరకే వందేమాతరం పాడటం నిలిపివేశారని చౌహాన్ ఆరోపించారు. వందేమాతరం పాడకపోవడంపై వస్తున్న విమర్శలను కమల్నాథ్ ఖండించారు. -
‘ఆ తప్పు చేయకపోతే దేశ విభజన జరిగేది కాదు’
కోల్కతా : ‘కాంగ్రెస్ పార్టీ జాతీయ గేయం వందేమాతరాన్ని కూడా విడదీసి చూస్తుంది... తన రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయ గేయానికి మతం రంగు పులుముతుంద’ని విమర్శించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. గురువారమిక్కడ శ్యాంప్రసాద్ ముఖర్జీ రీసెర్చ్ ఫౌండేషన్ వారి అధ్వర్యంలో జాతీయ గేయం ‘వందేమాతరం’ సృష్టికర్త బంకించంద్ర ఛటర్జీ తొలి స్మారకోత్సవానికి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘జాతీయ గేయమైన వందేమాతరం మన దేశ భౌగోళిక సాంప్రదాయనికి నిదర్శనం. ఇది ఏ మతానికి సంబంధించినది కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. జాతీయతకు ప్రతిరూపమైన ఈ గేయానికి మతం రంగులు పులమడం మంచిది కాదు. 1937లో కాంగ్రెస్ వందేమాతరాన్ని జాతీయ గేయంగా గుర్తించింది. కానీ వందేమాతరం గేయంలోని తొలి రెండు చరణాలను మాత్రమే తీసుకుంది. ఆనాడు కాంగ్రెస్ నాయకులు ఆ తప్పు చేసి ఉండకపోతే దేశ విభజన జరిగేదే కాదు. కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం వందేమాతరంలోని రెండు చరణాలను మాత్రమే జాతీయ గేయంగా తీసుకుంది. కేవలం ఒక మతం వారిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ఇలా చేసింది. ఫలితంగా దేశం రెండుగా చీలిపోయింది. కాబట్టి దేశ విభజన పాపం కాంగ్రెస్దే. చాలా మంది చరిత్రకారులు దేశ విభజనకు కారణం ఖిలాఫత్ ఉద్యమం, విభజించు - పాలించు విధానం అనుకుంటూ వాటిని విమర్శిస్తారు. కానీ నా వరకూ మాత్రం కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం వందేమాతరంలోని రెండు చరణాలను మాత్రమే తీసుకుని దేశ విభజనకు కారణమయ్యింది’ అన్నారు. -
‘వందేమాతరం పాడమంటే పాడం’
లక్నో: ఎవరెన్ని చెప్పినా వందేమాతరం పాడమంటే పాడమని బీఎస్పీ మేయర్ సునీతా వర్మ స్పష్టం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాల ప్రారంభానికి ముందు వందే మాతరం పాడమని, జాతీయ గీతం జనగణమన ఆలపిస్తామని ఇటీవల ఆమె వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారాన్ని లేపాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. వందేమాతరం అంటే దండం పెట్టడమని, తల్లికి కాకుండా ఉగ్రవాదులకు దండం పెడుతారా.. అని ఆయన ఘాటుగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. సునీతా వర్మ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చినా ఆమె వెనక్కి తగ్గకుండా మళ్లీ పాడమని తెగేసి చెప్పడం చర్చనీయాంశమైంది. -
అమ్మకు కాకుండా.. అప్జల్గురుకు దండం పెడతారా..?
న్యూఢిల్లీ: వందేమాతరం ఆలపించడంపై నెలకొన్న వివాదంపై భారత ఉప రాష్ట్రప్రతి వెంకయ్యనాయుడు ఘాటుగా స్పందించారు. తల్లికి కాకుండా ఉగ్రవాది అయిన అప్జల్గురూకు దండం పెడతారా అని ప్రశ్నించారు. వందేమాతరం ఆలపించమని, జాతీయగీతమైన జనగణమననే పాడుతామని కొన్ని రాజకీయ పక్షాలు ప్రకటించిన విషయం తెలిసిందే. వీహెచ్పీ నిర్వహించిన ఓ పుస్తక రిలీజ్ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొని ప్రసంగించారు. వందేమాతరం పాడటం అంటే మాతృభూమికి దండం పెట్టడమేనన్నారు. మాతృభూమికి దండం పెట్టడంలో వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. ఇక స్కూళ్లలో విద్యార్థులు వందేమాతరం ఆలపించడంపై అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. ‘భారత్ మాతాకీ జై’ అనేది దేవున్ని పూజించడం కాదన్న ఆయన దేశంలో నివసిస్తున్న 125 కోట్ల మంది మతం, కులాలతో సంబంధం లేకుండా మేమంతా భారతీయులమని నివసిస్తున్నారని స్పష్టం చేశారు. ‘హైందవం అంటే గొప్ప ధర్మం. అది ఒక సంప్రదాయం. అదే భారతీయత. దీనిని మనం వారసత్వంగా పొందాం. హిందుత్వం అంటే ఓ జీవన విధానం’’ అని వెంకయ్యనాయుడు వివరించారు. -
వందేమాతరం పాడాల్సిందే: మద్రాస్ హైకోర్టు
చెన్నై: పాఠశాలల్లో వందేమాతర గేయాన్ని తప్పనిసరిగా పాడాల్సిందేనని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. కనీసం వారంలో రెండు రోజులైనా స్కూళ్లలో వందేమా తరాన్ని ఆలపించాల్సిందేనని స్పష్టం చేసింది. సోమ, శుక్రవారాల్లో జాతీయ గేయాన్ని విద్యార్థులతో పాడించాలని తమిళనాడులోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సూచించింది. మంగళవారం ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎంవీ మురళీధరన్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో నెలకు ఒకసారైనా వందేమాతర గేయాన్ని ఆలపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకవేళ బెంగాలీ, సంస్కృతంలో వందేమాతరాన్ని ఆలపించడం ప్రజలకు కష్టమైతే.. తమిళంలోకి అనువాదం చేసేందుకు చర్యలు చేపడతామని వివరించారు. -
జాతీయ భావం.. సమైక్య సంకల్పం
పెదవేగి రూరల్: వెయ్యి గళాలు ఒక్కటయ్యాయి.. ఐదు గంటల పాటు మదినిండా దేశభక్తి భావంతో చిన్నారులు జాతీయ గీతం, జాతీయ గేయం, దేశ ప్రతిజ్ఞను మూడు భాషల్లో ఆలపించారు. జాతీయ భావాన్ని, సమైక్య సంకల్పాన్ని ఎలుగెత్తి చాటారు. 75వ క్విట్ ఇండియా దినోత్సవం, 70వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని పెదవేగి ఎస్ఎంసీ పాఠశాలలో సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు విజన్ లయన్స్ క్లబ్, ఎస్ఎంసీ పాఠశాల సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో స్థానం కోసం ‘వందేమాతరం, జనగణమని, భారతదేశం నా మాతృభూమి’ని ఆలపించి చిన్నారులు ఆకట్టుకున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి జాతీయ సమైక్యతను పెంపొందించేలా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పరిశీలకుడు సాయిశ్రీ అన్నారు. ఎస్ఎంసీ సంస్థ చైర్మన్ ఫాదర్ డొమినిక్ చుక్కా జ్వోతి ప్రజ్వలనం చేశారు. సభాధ్యక్షుడిగా లయన్ ఎ.శేషుకుమార్ వ్యవహరించగా విశిష్ట అతిథిగా డీజీఎం ఫాదర్ మోజెస్ హాజరయ్యారు. ముందుగా స్వాతంత్య్ర పోరాటంలో దేశం కోసం ప్రాణాలర్పించిన నాయకుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. లయన్ అక్కినేని వెంకటేశ్వరరావు, జోన్ చైర్పర్సన్ సీహెచ్ అవినాష్రాజ్, సర్పంచ్ మాతంగి కోటేశ్వరరావు, హెచ్ఎం కె.ఉషారాణి, లయన్ నూలు రామకృష్ణ పాల్గొన్నారు. -
‘అలా అని రాజ్యాంగంలో రాసి ఉందా?’
హైదరాబాద్ : భారత్మాతాకీ జై అని అనని వాళ్లు దేశంలో ఉండకూడదని రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉందా? అని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. డెబ్భై ఏళ్ల స్వతంత్ర భారతంలో భారత్మాతాకీ జై, వందేమాతరం ప్రస్తావన లేనేలేదన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేని, గతంలోబ్రిటీష్వారికి తొత్తులుగా ఉన్న బీజేపీ నాయకులు అనవసరంగా భారత్మాతా వివాదాన్ని ముందుకు తెస్తున్నారని ఎద్దేవాచేశారు. గురువారం మఖ్దూంభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూడా బీజేపీ నాయకులు కుహనా జాతీయవాదంతో ఆయా అంశాలను ప్రస్తావిస్తున్నారన్నారు.


