breaking news
vande mataram srinivas
-
కరోనాపై పాట.. దానికే బలైన నిస్సార్!
సాక్షి, హైదరాబాద్: కరోనాపై ప్రజలను చైతన్యం చేసిన కవిగాయకుడు నిస్సార్ను మహమ్మారి బలితీసుకుంది. కోవిడ్ బారినపడిన ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ప్రాణాలు విడిచారు. ‘కరోనా కరోనా నీతో యుద్ధం చేస్తాం మా భారత భూభాగాన. కరోనా కరోనా నిన్ను మట్టికరిపిస్తాం 130 కోట్ల జనం సరేనా!!’అంటూ కరోనాపై కలం గురిపెట్టిన నిస్సార్ అకాల మరణంపై పలువురు సాహితీవేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నిస్సార్ స్వగ్రామం యాదాద్రి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామం. ఆయన ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో కంట్రోలర్గా పనిచేస్తూ, జగద్గిరిగుట్టలో నివాసముంటున్నారు. ఇక నిస్సార్ రాసిన పాటను సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస ఆలపించారు. మార్చి నెలాఖరులో విడుదలైన ఈ మాట ప్రేక్షకాదరణ పొందింది. (సచివాలయం కూల్చివేత: అత్యవసరంగా విచారించలేం) -
చిత్రపురి కాలనీ సొసైటీ ఎన్నికలు ప్రారంభం
హైదరాబాద్ : బంజారాహిల్స్లోని చిత్రపురి కాలనీ సొసైటీ ఎన్నికలు ఆదివారం ఉదయం ప్రారంభమైనాయి. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్థానికులు ఎన్నికల కేంద్రం వద్ద బారులు తీరారు. ఈ ఎన్నికల బరిలో ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్, తెలుగు సినీ వర్కర్స్ కో - ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు కొమర వెంకటేష్ నిలిచారు. ఈ ఎన్నికలు ఈ రోజు మధ్యాహ్నం3.00 గంటల వరకు జరుగుతాయి. అనంతరం 3.30 గంటలకు కౌంటింగ్ నిర్వహించి... విజేతలను ప్రకటిస్తారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన కార్మికులు బంజారాహిల్స్లోని చిత్రపురి కాలనీలో నివసిస్తున్న సంగతి తెలిసిందే.