breaking news
Urvil Patel
-
సీఎస్కే బ్యాటర్ విధ్వంసర శతకం.. 37 బంతుల్లోనే..
దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 (Syed Mushtaq Ali Trophy 2025)లో గుజరాత్ జట్టు శుభారంభం చేసింది. ఎలైట్-సి గ్రూపులో భాగంగా బుధవారం నాటి మ్యాచ్లో సర్వీసెస్పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ ఉర్విల్ పటేల్ (Urvil Patel) విధ్వంసకర శతకం కారణంగా గుజరాత్ విజయం నల్లేరు మీద నడకలా మారింది.182 పరుగులుహైదరాబాద్లోని జింఖాన స్టేడియం వేదికగా టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన సర్వీసెస్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఓపెనర్ గౌరవ్ కొచ్చర్ (37 బంతుల్లో 60) మెరుపు అర్ధ శతకం బాదగా.. అరుణ్ కుమార్ (29), జయంత్ గోయత్ (7 బంతుల్లో 29) రాణించారు.గుజరాత్ బౌలర్లలో హేమాంగ్ పటేల్, అర్జాన్ నాగ్వాస్వల్లా చెరో రెండు వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్, రవి బిష్షోయి, విశాల్ జేస్వాల్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్ ఆది నుంచే దూసుకుపోయింది.చెలరేగిన ఓపెనర్లుఓపెనర్లలో ఆర్య దేశాయ్ ధనాధన్ ఇన్నింగ్స్ (35 బంతుల్లో 60)తో హాఫ్ సెంచరీ చేయగా.. కెప్టెన్ ఉర్విల్ పటేల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 31 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. మొత్తంగా 37 బంతుల్లో 119 పరుగులతో అజేయంగా నిలిచాడు.321కి పైగా స్ట్రైక్రేటుతోఉర్విల్ విధ్వంసకర శతక ఇన్నింగ్స్లో పన్నెండు ఫోర్లు, పది సిక్సర్లు ఉన్నాయి. 321కి పైగా స్ట్రైక్రేటుతో అతడు పరుగులు రాబట్టడం గమనార్హం. మిగతావారిలో రిపాల్ పటేల్ డకౌట్ అయినా పెద్దగా ప్రభావం పడలేదు. 12.3 ఓవర్లలోనే కేవం రెండు వికెట్లు నష్టపోయి గుజరాత్ 183 పరుగులు చేసి జయభేరి మోగించింది. శతక వీరుడు ఉర్విల్ పటేల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.నమ్మకం నిలబెట్టుకున్నాడుకాగా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు ఉర్విల్ పటేల్ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు చెన్నై అతడిని రిటైన్ చేసుకుంది. ఇక ఫ్రాంఛైజీ నమ్మకాన్ని నిలబెడుతూ సొంత జట్టు గుజరాత్ తరఫున ఉర్విల్ తొలి మ్యాచ్లోనే ఇరగదీయడం గమనార్హం. కాగా ఏడాది ఐపీఎల్లో ఉర్విల్ మూడు మ్యాచ్లు ఆడి 68 పరుగులు చేశాడు.చదవండి: Gautam Gambhir: అందరూ నన్నే నిందిస్తారు.. బీసీసీఐదే తుది నిర్ణయం -
శతక్కొట్టిన సీఎస్కే చిచ్చరపిడుగు
రంజీ ట్రోఫీ 2025-26 ఎడిషన్లో (Ranji Trophy) భాగంగా బెంగాల్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ ఆటగాడు ఉర్విల్ పటేల్ (Urvil Patel) విధ్వంసకర శతకం బాదాడు. 327 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం 96 బంతుల్లోనే 16 ఫోర్ల సాయంతో సెంచరీ చేశాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన ఉర్విల్.. టీమిండియా పేసర్లు మహ్మద్ షమీ, ఆకాశ్దీప్ను సమర్దవంతంగా ఎదుర్కొని శతక్కొట్టాడు.34 ఓవర్ల అనంతరం గుజరాత్ 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఇప్పటివరకే వచ్చిన జట్టు స్కోర్లో ఉర్విల్దే సింహభాగం. అతనికి జతగా జైమీత్ పటేల్ (34) క్రీజ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ గెలవాలంటే మరో 177 పరుగులు చేయాలి. చివరి రోజు ఆటలో రెండో సెషన్ కొనసాగుతుంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్.. సుదీప్ ఘరామీ (56), ఇషాన్ పోరెల్ (51), సుమంత గుప్తా (63) అర్ద సెంచరీలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 279 పరుగులు చేసింది. సిద్దార్థ్ దేశాయ్ 4 వికెట్లతో సత్తా చాటాడు.అనంతరం బరిలోకి దిగిన గుజరాత్.. షాబాజ్ అహ్మద్ (19-5-34-6) చెలరేగడంతో 167 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ మనన్ హింగ్రాజియా (80 నాటౌట్) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. బెంగాల్ బౌలర్లలో షాబాజ్తో పాటు మహ్మద్ షమీ (18.3-6-44-3) కూడా సత్తా చాటాడు.112 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్.. 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. సుదీప్ ఘరామీ (54), అనుస్తుప్ మజుందార్ (58) అర్ద సెంచరీలతో రాణించారు. సిద్దార్థ్ దేశాయ్ 5 వికెట్లతో సత్తా చాటాడు.27 ఏళ్ల ఉర్విల్ పటేల్ గత ఐపీఎల్ సీజన్ మధ్యలో వన్ష్ బేడీ స్థానంలో సీఎస్కేలో చేరాడు. 3 మ్యాచ్ల్లో అద్బుతమైన స్ట్రయిక్రేట్తో (212.50) 68 పరుగులు చేశాడు.ఉర్విల్కు భారత టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్గా రికార్డు ఉంది. 2024 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో త్రిపురపై అతను 28 బంతుల్లోనే శతక్కొట్టాడు. చదవండి: సిక్సర్ కొట్టి అదే బంతికి ఔటయ్యాడు..! -
IPL 2025: సీఎస్కే జట్టులోకి ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడు..
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం ముగిసిన సంగతి తెలిసిందే. వరుస ఓటములతో మరో మూడు మ్యాచ్లు మిగిలూండగానే ప్లే ఆఫ్స్ రేసు నుంచి సీఎస్కే నిష్క్రమించింది. అయితే మిగిలిన మూడు మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తమ పరువు కాపాడుకోవాలని సీఎస్కే భావిస్తోంది.సీఎస్కే తమ తదుపరి మ్యాచ్లో మే 7న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల అన్క్యాప్డ్ వికెట్ కీపర్-బ్యాటర్ వన్ష్ బేడీ చీలమండ గాయం కారణంగా మిగిలిన సీజన్కు దూరమయ్యాడు. అతడి స్దానంలో బరోడా బ్యాటర్ ఉర్విల్ పటేల్ను చెన్నై తమ జట్టులోకి తీసుకుంది. "ఎడమ చీలమండ గాయం కారణంగా టోర్నమెంట్లోని మిగిలిన మ్యాచ్లకు వన్ష్ బేడీ దూరమయ్యాడు. అతడి స్దానంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఉర్విల్ పటేల్తో ఒప్పందం కుదుర్చుకుంది" అని ఐపీఎల్ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి.26 ఏళ్ల ఉర్విల్ పటేల్కు టీ20 క్రికెట్లో అద్బుతమైన రికార్డు ఉంది. గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉర్విల్ పటేల్ విధ్వంసం సృష్టించాడు. త్రిపురపై కేవలం 28 బంతుల్లోనే సెంచరీ చేసి పటేల్ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డును ఉర్విల్ బద్దలు కొట్టాడు. అదే టోర్నీలో ఉత్తరాఖండ్పై కూడా 36 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే ఉర్విల్ పటేల్తో సీఎస్కే ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు ఉర్విల్.. 47 టీ20 మ్యాచ్లు ఆడి 170 స్ట్రైక్ రేట్తో 1162 పరుగులు చేశాడు. -
IPL 2025: అంతా అయిపోయాక విధ్వంసకర వీరుడికి పిలుపునిచ్చిన సీఎస్కే..?
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. ఆ జట్టు మరో నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉన్నా, ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. తద్వారా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. ఐపీఎల్లో సీఎస్కే వరుసగా రెండు సీజన్లలో ఫైనల్కు చేరకుండా నిష్క్రమించడం ఇదే మొదటిసారి. ఈ సీజన్లో సీఎస్కే ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలు సాధించింది. ఏ జట్టు ఓడని విధంగా 8 మ్యాచ్ల్లో ఓడింది.సీఎస్కే ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించిన తర్వాత ఓ వార్త సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్ల కోసం సీఎస్కే యాజమాన్యం ఓ విధ్వంసకర వీరుడిని ట్రయల్స్కు పిలిచినట్లు సమాచారం. సీఎస్కే మేనేజ్మెంట్ గుజరాత్కు చెందిన ఉర్విల్ పటేల్ను మిడ్ సీజన్ ట్రయల్స్కు పిలిచినట్లు ఓ భారత మాజీ ఆటగాడు చెప్పాడు.ఉర్విల్ గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో (టీ20) 28 బంతుల్లోనే (త్రిపురపై) సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో ఇది రెండో వేగవంతమైన సెంచరీ. పొట్టి క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. సాహిత్ గతేడాది సైప్రస్పై 27 బంతుల్లోనే శతకొట్టాడు.26 ఏళ్ల ఉర్విల్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్. ఇతనికి దేశవాలీ క్రికెట్లో మంచి రికార్డు ఉంది. 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో సెంచరీ, 2 అర్ద సెంచరీలు.. 22 లిస్ట్-ఏ మ్యాచ్ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు.. 47 టీ20ల్లో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు చేశాడు.ఉర్విల్ను సీఎస్కే మేనేజ్మెంట్ తదుపరి సీజన్ ప్రణాళికల్లో భాగంగా ట్రయల్స్కు పిలిచినట్లు తెలుస్తుంది. ధోని వచ్చే సీజన్లో రిటైర్ అవుతాడని పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో అతనికి ప్రత్యామ్నాయంగా ఉర్విల్ను ఎంపిక చేసుకోనున్నట్లు తెలుస్తుంది.ఉర్విల్ ఈ సీజన్ మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకున్నాడు (30 లక్షల విభాగంలో). అయినా ఏ ఫ్రాంచైజీ అతనిపై ఆసక్తి చూపలేదు. సీఎస్కేకు ఉర్విల్పై ముందు నుంచే కన్ను ఉన్నప్పటికీ ఎందుకో అతన్ని రుతురాజ్కు ప్రత్యామ్నాయంగా కూడా ఎంపిక చేసుకోలేదు. రుతురాజ్కు ప్రత్యామ్నాయంగా ఆయుశ్ మాత్రే సీఎస్కేలోకి వచ్చిన విషయం తెలిసిందే.కాగా, సీఎస్కే నిన్న (ఏప్రిల్ 30) పంజాబ్ చేతిలో ఓడటంతో ప్లే ఆఫ్స్ అవకాశాలు అధికారికంగా గల్లంతయ్యాయి. నిన్నటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే తొలుత భారీ స్కోర్ చేసేలా కనిపించినా.. ఆఖర్లో చహల్ హ్యాట్రిక్తో చెలరేగడంతో 190 పరుగులకే ఆలౌటైంది. అనంతరం పంజాబ్ మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకి ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. -
మరో సుడిగాలి శతకం బాదిన ఉర్విల్ పటేల్
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గుజరాత్ వికెట్ కీపర్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ భీకర ఫామ్ కొనసాగుతుంది. ఈ టోర్నీలో ఇప్పటికే ఓ మెరుపు సెంచరీ బాదిన ఉర్విల్.. తాజాగా మరో సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. ఉత్తరాఖండ్తో ఇవాళ (డిసెంబర్ 3) జరిగిన మ్యాచ్లో ఉర్విల్ 36 బంతుల్లో శతకొట్టాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 41 బంతులు ఎదుర్కొన్న ఉర్విల్.. 8 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 115 పరుగులు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గుజరాత్ తరఫున ఇదే అత్యధిక స్కోర్.టీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీఉర్విల్ గత నెలాఖరులో త్రిపురతో జరిగిన మ్యాచ్లో కేవలం 28 బంతుల్లోనే శతక్కొట్టాడు. భారత్ తరఫున టీ20ల్లో ఇది వేగవంతమైన సెంచరీ. ఓవరాల్గా టీ20ల్లో ఇది రెండో వేగవంతమైన శతకం.టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీని చేరుకునే క్రమంలో ఉర్విల్.. క్రిస్ గేల్, రిషబ్ పంత్ రికార్డులను బద్దలు కొట్టాడు. టీ20ల్లో గేల్ 30 బంతుల్లో శతక్కొట్టగా.. పంత్ 32 బంతుల్లో సెంచరీ బాదాడు.సాహిల్ చౌహాన్ పేరిట ఫాస్టెస్ట్ సెంచరీపొట్టి ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. చౌహాన్ ఈ ఏడాదే సైప్రస్తో జరిగిన మ్యాచ్లో 27 బంతుల్లో శతక్కొట్టాడు. ఉర్విల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కేవలం ఒక్క బంతితో మిస్ అయ్యాడు.లిస్ట్-ఏ క్రికెట్లోనూ..భారత్ తరఫున లిస్ట్-ఏ క్రికెట్లోనూ సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఉర్విల్ పేరిటే ఉంది. 2023 నవంబర్లో అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో ఉర్విల్ 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు టీమిండియా మాజీ ఆటగాడు యూసఫ్ పఠాన్ పేరిట ఉంది. 2010లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్లో యూసఫ్ పఠాన్ 40 బంతుల్లో సెంచరీ బాదాడు.గుజరాత్ టైటాన్స్ వదిలేసింది..!ఉర్విల్ను 2023 ఐపీఎల్ సీజన్ వేలంలో గుజరాత్ టైటాన్స్ 20 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. అయితే ఆ సీజన్లో ఉర్విల్కు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. ఉర్విల్ను గుజరాత్ టైటాన్స్ 2025 మెగా వేలానికి ముందు వదిలేసింది. మెగా వేలంలో ఉర్విల్ అన్సోల్డ్గా మిగిలిపోయాడు. ఉర్విల్పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరాఖండ్.. సమర్థ్ (54), ఆధిత్య తారే (54) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో విశాల్ జేస్వాల్ 4 వికెట్లు పడగొట్టాడు.183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. ఉర్విల్ సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో కేవలం 13.1 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. గుజరాత్ ఇన్నింగ్స్లో ఆర్య దేశాయ్ (23), అక్షర్ పటేల్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఈ గెలుపుతో గుజరాత్ ప్రస్తుత ఎడిషన్లో (సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో) వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది.


