Urvil Patel
-
ఉర్విల్ సిక్సర్ల సునామీ.. ‘ఇది నీకోసం పప్పా’
ఐపీఎల్ 2026 సీజన్లో ప్లేఆఫ్ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చెన్నై సూపర్కింగ్స్ జూలు విదిల్చింది. లక్నో సూపర్జెయింట్స్పై 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో చెన్నై పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. అయితే సీఎస్కే విజయంలో ఉర్విల్ పాత్ర కీలకం. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన ఉర్విల్ పటేల్ లక్నో బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 8 బంతుల్లోనే 41 పరుగులు చేసిన ఉర్విల్ టీ20 క్రికెట్ చరిత్రలో వేగవంతమైన అర్థసెంచరీ సాధిస్తాడనిపించింది. కానీ ఆ తర్వాత రెండు బంతుల్లో సింగిల్స్ తీయడంతో 13 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ సాధించాడు. అయితే ఉర్విల్ ఫిఫ్టీ మార్క్ చేరిన ఆనందంలో అతడి చర్య సోషల్ మీడియాలో వైరల్గా మారింది. A record knock 🤯A memorable celebration with a 𝗵𝗲𝗮𝗿𝘁𝗳𝗲𝗹𝘁 𝗺𝗲𝘀𝘀𝗮𝗴𝗲 🥹🫶Urvil Patel, thank you for the entertainment today 💛 Updates ▶️ https://t.co/MoXhlWHk4O#TATAIPL | #KhelBindaas | #CSKvLSG | @ChennaiIPL pic.twitter.com/GjR5D2sYid— IndianPremierLeague (@IPL) May 10, 2026హాఫ్ సెంచరీ మార్క్ అందుకోగానే ఉర్విల్ తన ప్యాంటు జేబులో నుంచి ఒక కాగితాన్ని బయటకు తీశాడు. ఆ కాగితంలో ఉన్న సందేశాన్ని అభిమానులకు చూపించాడు. అందులో 'ఇది నీకోసం పప్పా' అని రాసి ఉన్న మెసేజ్ కెమెరా కంటికి చిక్కింది.👉 ఇదే మ్యాచ్లో ఉర్విల్ పటేల్ మరో రికార్డు కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఉర్విల్ తాను ఎదుర్కొన్న తొలి 8 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఒక బౌండరీ బాదాడు. తద్వారా ఒక ఇన్నింగ్స్లో తొలి 8 బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్గా ఉర్విల్ నిలిచాడు. అంతకముందు ఐపీఎల్లో తొలి 8 బంతుల్లో 33 పరుగులు రావడమే ఉత్తమంగా ఉంది. తాజాగా ఉర్విల్పటేల్ దానిని బద్దలు కొట్టాడు.6️⃣6️⃣6️⃣6️⃣6️⃣4️⃣6️⃣❗🔥Urvil Patel is unleashing absolute carnage at Chepauk! 💥🏏Will he script the fastest fifty in #TATAIPL? 👀🔥#TATAIPL Revenge Week 2026 ➡️ #CSKvLSG | LIVE NOW 👉 https://t.co/niGR0vFDDY pic.twitter.com/86xCo1SXsh— Star Sports (@StarSportsIndia) May 10, 2026👉 సీఎస్కే తరఫున ఒక ఇన్నింగ్స్లో అత్యధిక స్ట్రైక్రేట్తో బ్యాటింగ్ చేసిన జాబితాలో ఉర్విల్ రెండో స్థానంలో నిలిచాడు. లక్నోతో మ్యాచ్లో ఉర్విల్ 282.6 స్ట్రైక్రేట్ 23 బంతుల్లో 65 పరుగులు సాధించాడు. తొలి స్థానంలో సురేశ్ రైనా (348 స్ట్రైక్రేట్, 25 బంతుల్లో 87 పరుగులు) ఉన్నాడు. అంబటి రాయుడు (266.6 స్ట్రైక్రేట్, 27 బంతుల్లో 72 నాటౌట్), ఎంఎస్ ధోని (255 స్ట్రైక్రేట్, 20 బంతుల్లో 51 నాటౌట్), డెవాల్డ్ బ్రెవిస్ (247.82 స్ట్రైక్రేట్, 23 బంతుల్లో 57 పరుగులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.👉 మ్యాచ్ విజయం అనంతరం ఉర్విల్ మాట్లాడుతూ.. ‘నా మనసులో ఏమీ లేదు, కానీ నేను పరిస్థితికి తగినట్లుగా బ్యాటింగ్ చేయాలని భావించాను. స్థిరమైన బేస్ ఉంచుకుని బ్యాటింగ్ ఆడమని కోచ్ సలహా ఇచ్చారు. నేను అదే పాటించాను. వికెట్ పల్లంగా ఉందని, దానికి సిద్ధంగా ఉండమని రుతురాజ్ చెప్పాడు. ఇది మినహా నాకు ఏమీ చెప్పలేదు. నన్ను స్వేచ్ఛగా ఆడనిచ్చాడు. అందుకే ఇది సాధ్యమైంది’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: వైభవ్పై రబాడ సంచలన వ్యాఖ్యలు -
ఉర్విల్ పటేల్ ఊచకోత.. లక్నోను చిత్తు చేసిన సీఎస్కే
ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో ఇవాళ (మే 10) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ (85) ఊచకోత కోశాడు. ఆఖర్లో షాబాజ్ అహ్మద్ (43 నాటౌట్) రాణించాడు. వీరు మినహా ఎవరూ పెద్ద స్కోర్ చేయలేదు. మిచెల్ మార్ష్ 10, నికోలస్ పూరన్ 1, రిషబ్ పంత్ 15, మార్క్రమ్ 6, రఘువంశీ 18, హిమ్మత్ సింగ్ 17, షమీ డకౌటయ్యారు. సీఎస్కే బౌలర్లలో జేమీ ఓవర్టన్ 3 వికెట్లు పడగొట్టగా.. అన్షుల్ కంబోజ్ 2, నూర్ అహ్మద్ ఓ వికెట్ తీశాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కే ఆది నుంచే దూకుడుగా ఆడింది. వన్డౌన్లో వచ్చిన ఉర్విల్ పటేల్ (65) పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, విజయానికి గట్టి పునాది వేశాడు. అయితే మధ్యలో సీఎస్కే కాస్త తడబాటుకు లోనైంది. సునాయాసంగా గెలుస్తుందనుకుంటే, మ్యాచ్ను చివరి వరకు తీసుకొచ్చింది. చివరి ఓవర్ తొలి రెండు బంతులకు శివమ్ దూబే (15 నాటౌట్) సిక్సర్లు బాది సీఎస్కేను విజయతీరాలు దాటించాడు. సీఎస్కే బ్యాటర్లలో సంజూ శాంసన్ 28, రుతురాజ్ గైక్వాడ్ 42, కార్తీక్ శర్మ 20, బ్రెవిస్ 10, ప్రశాంత్ వీర్ (18 నాటౌట్) పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్ రాఠీ, షాబాజ్ అహ్మద్ తలో 2 వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్లో లక్నో చాలా క్యాచ్లు జారవిడిచి మూల్యం చెల్లించుకుంది. ఈ ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్పై పూర్తిగా ఆశలు వదులుకుంది. సీఎస్కే విషయానికొస్తే.. ఆదిలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న ఈ జట్టు అనూహ్యంగా పుంజుకొని ప్లే ఆఫ్స్ రేసులో ప్రధాన పోటీదారుగా మారిపోయింది. ఈ గెలుపుతో ఆ జట్టు ఖాతాలో 12 పాయింట్లు (11 మ్యాచ్ల్లో 6 విజయాలు) చేరాయి. ప్రస్తుతం ఆ జట్టు పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. -
ఉర్విల్ పటేల్ సరికొత్త చరిత్ర.. ఐపీఎల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో ఇవాళ (మే 10) జరుగుతున్న మ్యాచ్లో సీఎస్కే బ్యాటర్ ఉర్విల్ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 13 బంతుల్లోనే ఓ ఫోర్, 7 సిక్సర్ల సాయంతో అర్ద సెంచరీ పూర్తి చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ. గతంలో ఈ రికార్డు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉండేది. జైస్వాల్ కూడా 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. తాజాగా ఈ రికార్డును ఉర్విల్ జైస్వాల్తో సంయుక్తంగా పంచుకున్నాడు.ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీలు13 - యశస్వి జైస్వాల్ (RR) vs KKR, కోల్కతా, 202313 - ఉర్విల్ పటేల్ (CSK) vs LSG, లక్నో, 202614 - KL రాహుల్ (PBKS) vs DC, మొహాలి, 201814 - ప్యాట్ కమిన్స్ (KKR) vs MI, పుణే, 202214 - రొమారియో షెపర్డ్ (RCB) vs CSK, బెంగళూరు, 2025సరికొత్త చరిత్రఈ ఇన్నింగ్స్తో ఉర్విల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో తొలి 10 బంతుల తర్వాత అత్యధిక స్కోర్ (42) చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉండేది. 2015 ఎడిషన్లో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో డివిలియర్స్ తొలి 10 బంతుల తర్వాత 41 పరుగులతో అజేయంగా నిలిచాడు. తాజాగా ఈ రికార్డును ఉర్విల్ బద్దలు కొట్టాడు.ఐపీఎల్లో మొదటి 10 బంతుల తర్వాత అత్యధిక స్కోర్లు42* - ఉర్విల్ పటేల్ vs LSG, చెన్నై, 202641* - AB డివిలియర్స్ vs MI, బెంగళూరు, 201541* - యశస్వి జైస్వాల్ vs KKR, కోల్కతా, 202340* - అభిషేక్ శర్మ vs DC, ఢిల్లీ, 202439* - రొమారియో షెపర్డ్ vs DC, ముంబై WS, 202439* - ప్రియాంష్ ఆర్య vs CSK, చెన్నై, 2026మ్యాచ్ విషయానికొస్తే.. 204 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సీఎస్కే దూసుకుపోతుంది. తొలి 10 ఓవర్లలో ఏకంగా 132 పరుగులు చేసి లక్ష్యం దిశగా సాగుతోంది. ఉర్విల్ 23 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 65 పరుగులు చేసి ఔటయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ (33), కార్తీక్ శర్మ (4) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో సీఎస్కే గెలవాలంటే 60 బంతుల్లో మరో 73 పరుగులు చేయాల్సి ఉంది.అంతకుముందు లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ (85) ఊచకోత కోశాడు. ఆఖర్లో షాబాజ్ అహ్మద్ (43 నాటౌట్) రాణించాడు. వీరు మినహా ఎవరూ పెద్ద స్కోర్ చేయలేదు. మిచెల్ మార్ష్ 10, నికోలస్ పూరన్ 1, రిషబ్ పంత్ 15, మార్క్రమ్ 6, రఘువంశీ 18, హిమ్మత్ సింగ్ 17, షమీ డకౌటయ్యారు. సీఎస్కే బౌలర్లలో జేమీ ఓవర్టన్ 3 వికెట్లు పడగొట్టగా.. అన్షుల్ కంబోజ్ 2, నూర్ అహ్మద్ ఓ వికెట్ తీశాడు. -
Virat Kohli: మళ్లీ సెంచరీ చేస్తాడనుకుంటే..
టీమిండియా దిగ్గజ బ్యాటర్, ఢిల్లీ స్టార్ విరాట్ కోహ్లి శతకం చేజార్చుకున్నాడు. మెరుపు హాఫ్ సెంచరీతో అలరించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్... సెంచరీకి ఇరవై మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. కాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో కలిసి కోహ్లి దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 బరిలో దిగిన విషయం తెలిసిందే. రోహిత్ తన సొంత జట్టు ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. కోహ్లి సైతం తన జట్టు ఢిల్లీకి ఆడుతున్నాడు.ఆంధ్రపై శతక్కొట్టిన కోహ్లి..ఇందులో భాగంగా బుధవారం నాటి తొలి మ్యాచ్లో ఆంధ్రపై శతక్కొట్టిన (101 బంతుల్లో 131) కోహ్లి.. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్లోనూ ఫామ్ను కొనసాగించాడు. ఎలైట్ గ్రూప్-డిలో భాగంగా బెంగళూరు వేదికగా గుజరాత్తో మ్యాచ్లో ఢిల్లీ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది.𝐕𝐢𝐫𝐚𝐭 𝐊𝐨𝐡𝐥𝐢 𝐒𝐩𝐞𝐜𝐢𝐚𝐥 😎1️⃣3️⃣1️⃣ runs 1️⃣0️⃣1️⃣ balls 1️⃣4️⃣ fours 3️⃣ sixes A terrific knock from Virat Kohli as he guided Delhi to a 4️⃣-wicket victory against Andhra 👏 He also completed 1️⃣6️⃣0️⃣0️⃣0️⃣ runs in Men’s List A cricket 🫡 @IDFCFIRSTBank | @imVkohli |… pic.twitter.com/kCfdl3yux1— BCCI Domestic (@BCCIdomestic) December 24, 202529 బంతుల్లోనేఅయితే, ఆదిలోనే గుజరాత్ బౌలర్లు ఢిల్లీని దెబ్బకొట్టారు. ప్రియాన్ష్ ఆర్య (7 బంతుల్లో 1)ను కెప్టెన్ చింతన్ గజా వెనక్కి పంపగా.. కోహ్లి క్రీజులోకి వచ్చాడు. కాసేపటికే మరో ఓపెనర్ అర్పిత్ రాణా (31 బంతుల్లో 10)ను విశాల్ జైస్వాల్ అవుట్ చేయగా.. కోహ్లి బాధ్యతాయుతంగా ఆడుతూనే మెరుపులు మెరిపించాడు.మళ్లీ సెంచరీ చేస్తాడనుకుంటే..కేవలం 29 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న కోహ్లి.. తర్వాత కూడా అదే జోరును కొనసాగించాడు. మొత్తంగా 61 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 77 పరుగులు సాధించాడు. అయితే, విశాల్ జైస్వాల్ బౌలింగ్లో వికెట్ కీపర్ ఉర్విల్ పటేల్కు క్యాచ్ ఇవ్వడంతో కోహ్లి ఇన్నింగ్స్కు తెరపడింది.మిగతా వారిలో నితీశ్ రాణా (12) తేలిపోగా.. కెప్టెన్ రిషభ్ పంత్, ఆయుశ్ బదోనిలపై భారం పడింది. 27 ఓవర్ల ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి ఢిల్లీ 129 పరుగులు చేయగలిగింది. ఇదిలా ఉంటే.. గత ఐదు మ్యాచ్లలో కోహ్లి మూడు సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.పిచ్చెక్కిస్తున్నావు భయ్యా!సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో తొలి, రెండో మ్యాచ్లలో శతక్కొట్టిన కోహ్లి.. ఢిల్లీ తరఫు పునరాగమనంలోనూ సెంచరీతో అలరించాడు. కింగ్ ఫామ్ చూసి అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. తాజాగా మెరుపు హాఫ్ సెంచరీ బాదడంతో.. ‘‘సంతోషం పట్టలేకపోతున్నాం.. పిచ్చెక్కిస్తున్నావు భయ్యా!’’ అంటూ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.కాగా బెంగళూరులో కోహ్లి ఆటను చూసేందుకు ఫ్యాన్స్ చెట్లెక్కి మరీ విన్యాసాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన కోహ్లి.. వన్డేల్లో మాత్రం కొనసాగుతున్న విషయం తెలిసిందే. UPDATE: కోహ్లి, పంత్ మెరుపులు.. ఢిల్లీ స్కోరెంతంటే?చదవండి: మొన్న శతక్కొట్టాడు.. ఇప్పుడు గోల్డెన్ డక్! -
సీఎస్కే బ్యాటర్ విధ్వంసర శతకం.. 37 బంతుల్లోనే..
దేశవాళీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025 (Syed Mushtaq Ali Trophy 2025)లో గుజరాత్ జట్టు శుభారంభం చేసింది. ఎలైట్-సి గ్రూపులో భాగంగా బుధవారం నాటి మ్యాచ్లో సర్వీసెస్పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ ఉర్విల్ పటేల్ (Urvil Patel) విధ్వంసకర శతకం కారణంగా గుజరాత్ విజయం నల్లేరు మీద నడకలా మారింది.182 పరుగులుహైదరాబాద్లోని జింఖాన స్టేడియం వేదికగా టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన సర్వీసెస్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఓపెనర్ గౌరవ్ కొచ్చర్ (37 బంతుల్లో 60) మెరుపు అర్ధ శతకం బాదగా.. అరుణ్ కుమార్ (29), జయంత్ గోయత్ (7 బంతుల్లో 29) రాణించారు.గుజరాత్ బౌలర్లలో హేమాంగ్ పటేల్, అర్జాన్ నాగ్వాస్వల్లా చెరో రెండు వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్, రవి బిష్షోయి, విశాల్ జేస్వాల్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్ ఆది నుంచే దూసుకుపోయింది.చెలరేగిన ఓపెనర్లుఓపెనర్లలో ఆర్య దేశాయ్ ధనాధన్ ఇన్నింగ్స్ (35 బంతుల్లో 60)తో హాఫ్ సెంచరీ చేయగా.. కెప్టెన్ ఉర్విల్ పటేల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 31 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. మొత్తంగా 37 బంతుల్లో 119 పరుగులతో అజేయంగా నిలిచాడు.321కి పైగా స్ట్రైక్రేటుతోఉర్విల్ విధ్వంసకర శతక ఇన్నింగ్స్లో పన్నెండు ఫోర్లు, పది సిక్సర్లు ఉన్నాయి. 321కి పైగా స్ట్రైక్రేటుతో అతడు పరుగులు రాబట్టడం గమనార్హం. మిగతావారిలో రిపాల్ పటేల్ డకౌట్ అయినా పెద్దగా ప్రభావం పడలేదు. 12.3 ఓవర్లలోనే కేవం రెండు వికెట్లు నష్టపోయి గుజరాత్ 183 పరుగులు చేసి జయభేరి మోగించింది. శతక వీరుడు ఉర్విల్ పటేల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.నమ్మకం నిలబెట్టుకున్నాడుకాగా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు ఉర్విల్ పటేల్ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు చెన్నై అతడిని రిటైన్ చేసుకుంది. ఇక ఫ్రాంఛైజీ నమ్మకాన్ని నిలబెడుతూ సొంత జట్టు గుజరాత్ తరఫున ఉర్విల్ తొలి మ్యాచ్లోనే ఇరగదీయడం గమనార్హం. కాగా ఏడాది ఐపీఎల్లో ఉర్విల్ మూడు మ్యాచ్లు ఆడి 68 పరుగులు చేశాడు.చదవండి: Gautam Gambhir: అందరూ నన్నే నిందిస్తారు.. బీసీసీఐదే తుది నిర్ణయం -
శతక్కొట్టిన సీఎస్కే చిచ్చరపిడుగు
రంజీ ట్రోఫీ 2025-26 ఎడిషన్లో (Ranji Trophy) భాగంగా బెంగాల్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ ఆటగాడు ఉర్విల్ పటేల్ (Urvil Patel) విధ్వంసకర శతకం బాదాడు. 327 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం 96 బంతుల్లోనే 16 ఫోర్ల సాయంతో సెంచరీ చేశాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన ఉర్విల్.. టీమిండియా పేసర్లు మహ్మద్ షమీ, ఆకాశ్దీప్ను సమర్దవంతంగా ఎదుర్కొని శతక్కొట్టాడు.34 ఓవర్ల అనంతరం గుజరాత్ 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఇప్పటివరకే వచ్చిన జట్టు స్కోర్లో ఉర్విల్దే సింహభాగం. అతనికి జతగా జైమీత్ పటేల్ (34) క్రీజ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ గెలవాలంటే మరో 177 పరుగులు చేయాలి. చివరి రోజు ఆటలో రెండో సెషన్ కొనసాగుతుంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్.. సుదీప్ ఘరామీ (56), ఇషాన్ పోరెల్ (51), సుమంత గుప్తా (63) అర్ద సెంచరీలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 279 పరుగులు చేసింది. సిద్దార్థ్ దేశాయ్ 4 వికెట్లతో సత్తా చాటాడు.అనంతరం బరిలోకి దిగిన గుజరాత్.. షాబాజ్ అహ్మద్ (19-5-34-6) చెలరేగడంతో 167 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ మనన్ హింగ్రాజియా (80 నాటౌట్) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. బెంగాల్ బౌలర్లలో షాబాజ్తో పాటు మహ్మద్ షమీ (18.3-6-44-3) కూడా సత్తా చాటాడు.112 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్.. 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. సుదీప్ ఘరామీ (54), అనుస్తుప్ మజుందార్ (58) అర్ద సెంచరీలతో రాణించారు. సిద్దార్థ్ దేశాయ్ 5 వికెట్లతో సత్తా చాటాడు.27 ఏళ్ల ఉర్విల్ పటేల్ గత ఐపీఎల్ సీజన్ మధ్యలో వన్ష్ బేడీ స్థానంలో సీఎస్కేలో చేరాడు. 3 మ్యాచ్ల్లో అద్బుతమైన స్ట్రయిక్రేట్తో (212.50) 68 పరుగులు చేశాడు.ఉర్విల్కు భారత టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్గా రికార్డు ఉంది. 2024 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో త్రిపురపై అతను 28 బంతుల్లోనే శతక్కొట్టాడు. చదవండి: సిక్సర్ కొట్టి అదే బంతికి ఔటయ్యాడు..! -
IPL 2025: సీఎస్కే జట్టులోకి ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడు..
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం ముగిసిన సంగతి తెలిసిందే. వరుస ఓటములతో మరో మూడు మ్యాచ్లు మిగిలూండగానే ప్లే ఆఫ్స్ రేసు నుంచి సీఎస్కే నిష్క్రమించింది. అయితే మిగిలిన మూడు మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తమ పరువు కాపాడుకోవాలని సీఎస్కే భావిస్తోంది.సీఎస్కే తమ తదుపరి మ్యాచ్లో మే 7న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల అన్క్యాప్డ్ వికెట్ కీపర్-బ్యాటర్ వన్ష్ బేడీ చీలమండ గాయం కారణంగా మిగిలిన సీజన్కు దూరమయ్యాడు. అతడి స్దానంలో బరోడా బ్యాటర్ ఉర్విల్ పటేల్ను చెన్నై తమ జట్టులోకి తీసుకుంది. "ఎడమ చీలమండ గాయం కారణంగా టోర్నమెంట్లోని మిగిలిన మ్యాచ్లకు వన్ష్ బేడీ దూరమయ్యాడు. అతడి స్దానంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఉర్విల్ పటేల్తో ఒప్పందం కుదుర్చుకుంది" అని ఐపీఎల్ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి.26 ఏళ్ల ఉర్విల్ పటేల్కు టీ20 క్రికెట్లో అద్బుతమైన రికార్డు ఉంది. గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉర్విల్ పటేల్ విధ్వంసం సృష్టించాడు. త్రిపురపై కేవలం 28 బంతుల్లోనే సెంచరీ చేసి పటేల్ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డును ఉర్విల్ బద్దలు కొట్టాడు. అదే టోర్నీలో ఉత్తరాఖండ్పై కూడా 36 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే ఉర్విల్ పటేల్తో సీఎస్కే ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు ఉర్విల్.. 47 టీ20 మ్యాచ్లు ఆడి 170 స్ట్రైక్ రేట్తో 1162 పరుగులు చేశాడు. -
IPL 2025: అంతా అయిపోయాక విధ్వంసకర వీరుడికి పిలుపునిచ్చిన సీఎస్కే..?
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. ఆ జట్టు మరో నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉన్నా, ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. తద్వారా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. ఐపీఎల్లో సీఎస్కే వరుసగా రెండు సీజన్లలో ఫైనల్కు చేరకుండా నిష్క్రమించడం ఇదే మొదటిసారి. ఈ సీజన్లో సీఎస్కే ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలు సాధించింది. ఏ జట్టు ఓడని విధంగా 8 మ్యాచ్ల్లో ఓడింది.సీఎస్కే ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించిన తర్వాత ఓ వార్త సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్ల కోసం సీఎస్కే యాజమాన్యం ఓ విధ్వంసకర వీరుడిని ట్రయల్స్కు పిలిచినట్లు సమాచారం. సీఎస్కే మేనేజ్మెంట్ గుజరాత్కు చెందిన ఉర్విల్ పటేల్ను మిడ్ సీజన్ ట్రయల్స్కు పిలిచినట్లు ఓ భారత మాజీ ఆటగాడు చెప్పాడు.ఉర్విల్ గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో (టీ20) 28 బంతుల్లోనే (త్రిపురపై) సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో ఇది రెండో వేగవంతమైన సెంచరీ. పొట్టి క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. సాహిత్ గతేడాది సైప్రస్పై 27 బంతుల్లోనే శతకొట్టాడు.26 ఏళ్ల ఉర్విల్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్. ఇతనికి దేశవాలీ క్రికెట్లో మంచి రికార్డు ఉంది. 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో సెంచరీ, 2 అర్ద సెంచరీలు.. 22 లిస్ట్-ఏ మ్యాచ్ల్లో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు.. 47 టీ20ల్లో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు చేశాడు.ఉర్విల్ను సీఎస్కే మేనేజ్మెంట్ తదుపరి సీజన్ ప్రణాళికల్లో భాగంగా ట్రయల్స్కు పిలిచినట్లు తెలుస్తుంది. ధోని వచ్చే సీజన్లో రిటైర్ అవుతాడని పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో అతనికి ప్రత్యామ్నాయంగా ఉర్విల్ను ఎంపిక చేసుకోనున్నట్లు తెలుస్తుంది.ఉర్విల్ ఈ సీజన్ మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకున్నాడు (30 లక్షల విభాగంలో). అయినా ఏ ఫ్రాంచైజీ అతనిపై ఆసక్తి చూపలేదు. సీఎస్కేకు ఉర్విల్పై ముందు నుంచే కన్ను ఉన్నప్పటికీ ఎందుకో అతన్ని రుతురాజ్కు ప్రత్యామ్నాయంగా కూడా ఎంపిక చేసుకోలేదు. రుతురాజ్కు ప్రత్యామ్నాయంగా ఆయుశ్ మాత్రే సీఎస్కేలోకి వచ్చిన విషయం తెలిసిందే.కాగా, సీఎస్కే నిన్న (ఏప్రిల్ 30) పంజాబ్ చేతిలో ఓడటంతో ప్లే ఆఫ్స్ అవకాశాలు అధికారికంగా గల్లంతయ్యాయి. నిన్నటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే తొలుత భారీ స్కోర్ చేసేలా కనిపించినా.. ఆఖర్లో చహల్ హ్యాట్రిక్తో చెలరేగడంతో 190 పరుగులకే ఆలౌటైంది. అనంతరం పంజాబ్ మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకి ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. -
మరో సుడిగాలి శతకం బాదిన ఉర్విల్ పటేల్
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గుజరాత్ వికెట్ కీపర్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ భీకర ఫామ్ కొనసాగుతుంది. ఈ టోర్నీలో ఇప్పటికే ఓ మెరుపు సెంచరీ బాదిన ఉర్విల్.. తాజాగా మరో సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. ఉత్తరాఖండ్తో ఇవాళ (డిసెంబర్ 3) జరిగిన మ్యాచ్లో ఉర్విల్ 36 బంతుల్లో శతకొట్టాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 41 బంతులు ఎదుర్కొన్న ఉర్విల్.. 8 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 115 పరుగులు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గుజరాత్ తరఫున ఇదే అత్యధిక స్కోర్.టీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీఉర్విల్ గత నెలాఖరులో త్రిపురతో జరిగిన మ్యాచ్లో కేవలం 28 బంతుల్లోనే శతక్కొట్టాడు. భారత్ తరఫున టీ20ల్లో ఇది వేగవంతమైన సెంచరీ. ఓవరాల్గా టీ20ల్లో ఇది రెండో వేగవంతమైన శతకం.టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీని చేరుకునే క్రమంలో ఉర్విల్.. క్రిస్ గేల్, రిషబ్ పంత్ రికార్డులను బద్దలు కొట్టాడు. టీ20ల్లో గేల్ 30 బంతుల్లో శతక్కొట్టగా.. పంత్ 32 బంతుల్లో సెంచరీ బాదాడు.సాహిల్ చౌహాన్ పేరిట ఫాస్టెస్ట్ సెంచరీపొట్టి ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ పేరిట ఉంది. చౌహాన్ ఈ ఏడాదే సైప్రస్తో జరిగిన మ్యాచ్లో 27 బంతుల్లో శతక్కొట్టాడు. ఉర్విల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కేవలం ఒక్క బంతితో మిస్ అయ్యాడు.లిస్ట్-ఏ క్రికెట్లోనూ..భారత్ తరఫున లిస్ట్-ఏ క్రికెట్లోనూ సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఉర్విల్ పేరిటే ఉంది. 2023 నవంబర్లో అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో ఉర్విల్ 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు టీమిండియా మాజీ ఆటగాడు యూసఫ్ పఠాన్ పేరిట ఉంది. 2010లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్లో యూసఫ్ పఠాన్ 40 బంతుల్లో సెంచరీ బాదాడు.గుజరాత్ టైటాన్స్ వదిలేసింది..!ఉర్విల్ను 2023 ఐపీఎల్ సీజన్ వేలంలో గుజరాత్ టైటాన్స్ 20 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. అయితే ఆ సీజన్లో ఉర్విల్కు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. ఉర్విల్ను గుజరాత్ టైటాన్స్ 2025 మెగా వేలానికి ముందు వదిలేసింది. మెగా వేలంలో ఉర్విల్ అన్సోల్డ్గా మిగిలిపోయాడు. ఉర్విల్పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరాఖండ్.. సమర్థ్ (54), ఆధిత్య తారే (54) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో విశాల్ జేస్వాల్ 4 వికెట్లు పడగొట్టాడు.183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్.. ఉర్విల్ సుడిగాలి శతకంతో విరుచుకుపడటంతో కేవలం 13.1 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. గుజరాత్ ఇన్నింగ్స్లో ఆర్య దేశాయ్ (23), అక్షర్ పటేల్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఈ గెలుపుతో గుజరాత్ ప్రస్తుత ఎడిషన్లో (సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో) వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది.


